అన్వేషించండి

Siddaramaiah: ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ వల్లే కర్ణాటకకు ఈ గతి పట్టింది - సిద్దరామయ్య ఫైర్

Siddaramaiah: ప్రధాని మోదీ కారణంగానే కర్ణాటక నష్టాల్లో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు.

Siddaramaiah Slams BJP:

బీజేపీపై ఆగ్రహం..

కర్ణాటక ముఖ్యమత్రిగా సిద్దరామయ్య అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో...అప్పుడే గత ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేసిన ఆయన..5 హామీలనూ ప్రస్తావించారు. ఆ హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వెల్లడించారు. కేబినెట్‌ మీటింగ్‌లో వాటిపై ఆమోద ముద్ర వేసి చట్టాలుగా చేస్తామని తెలిపారు. 

"ఎన్నికల మేనిఫెస్టోలో మేం 5 హామీలు ఇచ్చాం. తొలి కేబినెట్ మీటింగ్‌లోనే వాటిని ఆమోదిస్తాం. కచ్చితంగా అమలు చేస్తాం. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి రూట్‌మ్యాప్‌ని ప్రకటిస్తాం"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి 

ఈ సమయంలోనే గత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సిద్దరామయ్య. "ఎందుకూ పనికి రాని ప్రభుత్వం" అంటూ తీవ్రంగా మండి పడ్డారు. రాష్ట్రానికి వచ్చే పన్ను వాటాలు కూడా సరిగా రాలేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ కారణంగానే కర్ణాటక ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. 

"ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.5,495 కోట్లు రావాల్సి ఉంది. కానీ...గత ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వలేదు. కర్ణాటక నుంచే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు నిర్మలా సీతారామన్. అయినా...నిధులు తెప్పించలేకపోయారు. ప్రధాని, నిర్మలా సీతారామన్ కారణంగానే కర్ణాటక ఇలా నష్టాల్లో కూరుకుపోయింది. మా ప్రభుత్వం ఇలా కాదు. మేం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తాం"
 
- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి 

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ అభిమానులంతా ఎదురు చూసిన ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కంఠీరవ స్టేడియం వేలాది మంది కార్యకర్తలతో నిండిపోయింది. సిద్దరామయ్య, శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఒక్కసారిగా జనమంతా కేరింతలు కొట్టారు. చాలా సేపటి వరకూ ఆ ప్రాంతం వాళ్ల అరుపులతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి కీలక నేతలు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్‌ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వేదికపై సందడి చేశారు. ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ కూడా వేదికపై కనిపించారు. అయితే...ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కనిపించలేదు. సిద్దరామయ్య, డీకేతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

NEET Paper Leak:పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget