అన్వేషించండి

Mourning Day in India: భారత్‌లో సంతాప దినం ఎందుకు పాటిస్తారు, గతంలోనూ ఇలా ప్రకటించారా?

గతంలో పలువురు అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడూ భారత్ సంతాప దినాలు ప్రకటించి నివాళులర్పించింది.

షింజో అబే మృతికి గౌరవంగా సంతాప దినం..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి, ఆ దేశాన్నే కాదు. భారత్‌నూ షాక్ గురి చేసింది. తనకు అత్యంత సన్నిహితుడైన అబే హత్యకు గురికావటం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. వరుస ట్వీట్‌లతో విచారం వ్యక్తం చేశారు. అంతే కాదు. దేశంలో "ఒకరోజు సంతాప దినం" పాటించాలని ప్రకటించారు. ఆయనపై ఉన్న గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సంతాప దిన సందర్భంగా దేశంలోని అన్ని భవంతులపై త్రివర్ణ పతాకాన్ని సగం మాత్రమే ఎగర వేసి ఉంచుతారు. ఈ ఒక్క రోజు వినోదాలు, వేడుకలు పక్కన పెట్టాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే కాదు. గతంలోనూ భారత్, అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడు వారికి గౌరవ సూచకంగా సంతాప దినం నిర్వహించింది.

గతంలో వీరికీ సంతాప దినాలు ప్రకటించిన భారత్..

ఇరాన్‌కు తొలి సుప్రీమ్‌ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన సయ్యిద్ రుహొల్లా ముసవి కొమినేని అలియాస్ అయతొల్ల కొమినేని మృతి చెందినప్పుడూ భారత్‌ సంతాప దినం ప్రకటించింది. 1979 నుంచి 1989 వరకూ అధికారంలో ఉన్నారు కొమినేని. 1989లో జూన్‌3 వ తేదీన కన్నుమూశారు. ఆ తరవాత పోప్‌ జాన్‌ పాల్-2 కూడా ఈ జాబితాలో ఉన్నారు. క్యాథలిక్ చర్చ్‌ హెడ్‌గా, వాటికన్‌ సిటీ అధిపతిగా ఉన్న జాన్‌పాప్ పోల్-2,2005లో ఏప్రిల్ 2వ తేదీన మృతి చెందారు. అప్పుడు ఏకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది భారత ప్రభుత్వం. దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడిగా, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిగా చిరస్థాయిలో నిలిచిపోయే నెల్సన్ మండేలానూ ఇదే విధంగా గౌరవించింది భారత్. 2013లో జొహెన్నస్‌బర్గ్‌లో తుది శ్వాస విడిచారు మండేలా. ఆ సమయంలో భారత్‌లో 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. 

సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ 2015లో మృతి చెందగా, ఒక రోజు సంతాప దినం ప్రకటించారు. లీ క్వాన్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మధ్యప్రాచ్యంలో, అరబ్‌లో సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ 2020 జనవరిలో మృతి చెందారు. ఒమన్‌కు చాన్నాళ్లు సుల్తాన్‌గా వ్యవహరించారు. ఆ ఏడాది జనవరి 13వ తేదీన సంతాప దినం పాటించారు. మారిషస్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన అనిరూద్ జుగ్నౌత్ 2021లో మృతి చెందారు. అప్పుడూ ఒక రోజు సంతాప దినం పాటించారు. ఇటీవలే యూఏఈ రెండో అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయెద్ అల్ తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది మే 13న ఆయన మృతి చెందగా, 14వ తేదీన సంతాప దినం పాటించింది భారత ప్రభుత్వం. 

 Also Read: Cloudburst Near Amarnath Shrine : అమర్‌నాథ్ టెంపుల్ దగ్గర వరద బీభత్సం - ముప్పులో వేల మంది భక్తులు !

 

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget