అన్వేషించండి

Mourning Day in India: భారత్‌లో సంతాప దినం ఎందుకు పాటిస్తారు, గతంలోనూ ఇలా ప్రకటించారా?

గతంలో పలువురు అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడూ భారత్ సంతాప దినాలు ప్రకటించి నివాళులర్పించింది.

షింజో అబే మృతికి గౌరవంగా సంతాప దినం..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి, ఆ దేశాన్నే కాదు. భారత్‌నూ షాక్ గురి చేసింది. తనకు అత్యంత సన్నిహితుడైన అబే హత్యకు గురికావటం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. వరుస ట్వీట్‌లతో విచారం వ్యక్తం చేశారు. అంతే కాదు. దేశంలో "ఒకరోజు సంతాప దినం" పాటించాలని ప్రకటించారు. ఆయనపై ఉన్న గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సంతాప దిన సందర్భంగా దేశంలోని అన్ని భవంతులపై త్రివర్ణ పతాకాన్ని సగం మాత్రమే ఎగర వేసి ఉంచుతారు. ఈ ఒక్క రోజు వినోదాలు, వేడుకలు పక్కన పెట్టాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే కాదు. గతంలోనూ భారత్, అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడు వారికి గౌరవ సూచకంగా సంతాప దినం నిర్వహించింది.

గతంలో వీరికీ సంతాప దినాలు ప్రకటించిన భారత్..

ఇరాన్‌కు తొలి సుప్రీమ్‌ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన సయ్యిద్ రుహొల్లా ముసవి కొమినేని అలియాస్ అయతొల్ల కొమినేని మృతి చెందినప్పుడూ భారత్‌ సంతాప దినం ప్రకటించింది. 1979 నుంచి 1989 వరకూ అధికారంలో ఉన్నారు కొమినేని. 1989లో జూన్‌3 వ తేదీన కన్నుమూశారు. ఆ తరవాత పోప్‌ జాన్‌ పాల్-2 కూడా ఈ జాబితాలో ఉన్నారు. క్యాథలిక్ చర్చ్‌ హెడ్‌గా, వాటికన్‌ సిటీ అధిపతిగా ఉన్న జాన్‌పాప్ పోల్-2,2005లో ఏప్రిల్ 2వ తేదీన మృతి చెందారు. అప్పుడు ఏకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది భారత ప్రభుత్వం. దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడిగా, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిగా చిరస్థాయిలో నిలిచిపోయే నెల్సన్ మండేలానూ ఇదే విధంగా గౌరవించింది భారత్. 2013లో జొహెన్నస్‌బర్గ్‌లో తుది శ్వాస విడిచారు మండేలా. ఆ సమయంలో భారత్‌లో 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. 

సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ 2015లో మృతి చెందగా, ఒక రోజు సంతాప దినం ప్రకటించారు. లీ క్వాన్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మధ్యప్రాచ్యంలో, అరబ్‌లో సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ 2020 జనవరిలో మృతి చెందారు. ఒమన్‌కు చాన్నాళ్లు సుల్తాన్‌గా వ్యవహరించారు. ఆ ఏడాది జనవరి 13వ తేదీన సంతాప దినం పాటించారు. మారిషస్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన అనిరూద్ జుగ్నౌత్ 2021లో మృతి చెందారు. అప్పుడూ ఒక రోజు సంతాప దినం పాటించారు. ఇటీవలే యూఏఈ రెండో అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయెద్ అల్ తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది మే 13న ఆయన మృతి చెందగా, 14వ తేదీన సంతాప దినం పాటించింది భారత ప్రభుత్వం. 

 Also Read: Cloudburst Near Amarnath Shrine : అమర్‌నాథ్ టెంపుల్ దగ్గర వరద బీభత్సం - ముప్పులో వేల మంది భక్తులు !

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
The Raja Saab Story : అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget