అన్వేషించండి

Mourning Day in India: భారత్‌లో సంతాప దినం ఎందుకు పాటిస్తారు, గతంలోనూ ఇలా ప్రకటించారా?

గతంలో పలువురు అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడూ భారత్ సంతాప దినాలు ప్రకటించి నివాళులర్పించింది.

షింజో అబే మృతికి గౌరవంగా సంతాప దినం..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి, ఆ దేశాన్నే కాదు. భారత్‌నూ షాక్ గురి చేసింది. తనకు అత్యంత సన్నిహితుడైన అబే హత్యకు గురికావటం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. వరుస ట్వీట్‌లతో విచారం వ్యక్తం చేశారు. అంతే కాదు. దేశంలో "ఒకరోజు సంతాప దినం" పాటించాలని ప్రకటించారు. ఆయనపై ఉన్న గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సంతాప దిన సందర్భంగా దేశంలోని అన్ని భవంతులపై త్రివర్ణ పతాకాన్ని సగం మాత్రమే ఎగర వేసి ఉంచుతారు. ఈ ఒక్క రోజు వినోదాలు, వేడుకలు పక్కన పెట్టాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే కాదు. గతంలోనూ భారత్, అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడు వారికి గౌరవ సూచకంగా సంతాప దినం నిర్వహించింది.

గతంలో వీరికీ సంతాప దినాలు ప్రకటించిన భారత్..

ఇరాన్‌కు తొలి సుప్రీమ్‌ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన సయ్యిద్ రుహొల్లా ముసవి కొమినేని అలియాస్ అయతొల్ల కొమినేని మృతి చెందినప్పుడూ భారత్‌ సంతాప దినం ప్రకటించింది. 1979 నుంచి 1989 వరకూ అధికారంలో ఉన్నారు కొమినేని. 1989లో జూన్‌3 వ తేదీన కన్నుమూశారు. ఆ తరవాత పోప్‌ జాన్‌ పాల్-2 కూడా ఈ జాబితాలో ఉన్నారు. క్యాథలిక్ చర్చ్‌ హెడ్‌గా, వాటికన్‌ సిటీ అధిపతిగా ఉన్న జాన్‌పాప్ పోల్-2,2005లో ఏప్రిల్ 2వ తేదీన మృతి చెందారు. అప్పుడు ఏకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది భారత ప్రభుత్వం. దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడిగా, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిగా చిరస్థాయిలో నిలిచిపోయే నెల్సన్ మండేలానూ ఇదే విధంగా గౌరవించింది భారత్. 2013లో జొహెన్నస్‌బర్గ్‌లో తుది శ్వాస విడిచారు మండేలా. ఆ సమయంలో భారత్‌లో 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. 

సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ 2015లో మృతి చెందగా, ఒక రోజు సంతాప దినం ప్రకటించారు. లీ క్వాన్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మధ్యప్రాచ్యంలో, అరబ్‌లో సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ 2020 జనవరిలో మృతి చెందారు. ఒమన్‌కు చాన్నాళ్లు సుల్తాన్‌గా వ్యవహరించారు. ఆ ఏడాది జనవరి 13వ తేదీన సంతాప దినం పాటించారు. మారిషస్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన అనిరూద్ జుగ్నౌత్ 2021లో మృతి చెందారు. అప్పుడూ ఒక రోజు సంతాప దినం పాటించారు. ఇటీవలే యూఏఈ రెండో అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయెద్ అల్ తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది మే 13న ఆయన మృతి చెందగా, 14వ తేదీన సంతాప దినం పాటించింది భారత ప్రభుత్వం. 

 Also Read: Cloudburst Near Amarnath Shrine : అమర్‌నాథ్ టెంపుల్ దగ్గర వరద బీభత్సం - ముప్పులో వేల మంది భక్తులు !

 

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
ABP Desam Top 10, 29 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 29 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget