అన్వేషించండి

26 th August 2024 School News Headlines Today: ఏపీలో యువ పారిశ్రామిక వేత్తల కోసం సరికొత్త కార్యక్రమం, టెన్నిస్‌ క్యాలెండర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ ప్రారంభం వంటి మార్నింగ్ టాప్ న్యూస్‌

26th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

26th August 2024 School News Headlines Today: 

నేటీ ప్రత్యేకత
  • నేడు శ్రీ కృష్ణాష్టమి
  • అమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టొఫర్ కొలంబస్ జననం
  • పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ జయంతి
  • మానవతావాది, కరుణామయి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీద మదర్ థెరిస్సా జయంతి
 
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు చేయూత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వీరి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం EDP అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రణాళిక రచిస్తోంది. యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.
  • విశాఖలో నేటి నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల అభ్యర్థులు ఈ ర్యాలీకి తరలివచ్చారు. ఈ ర్యాలీ సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. రోజుకు వెయ్యి మందికి చొప్పున ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్, ఆఫీస్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయి.
తెలంగాణ వార్తలు: 
  • రుణమాఫీ కాని వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అర్హులై రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు 'రైతు భరోసా పంట రుణమాఫీ యాప్'ను తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబసభ్యుల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు  ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 
  • తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
జాతీయ వార్తలు: 
  • కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా గణేష్‌ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకల్లో లైట్లు, అలంకరణలకు దూరంగా ఉండాలని కోల్‌కతా గణేశ్ కమిటీలు నిర్ణయించాయి. ‘అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం’ అనే థీమ్‌తో పూజలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. 
  • ప్రధాని నరేంద్ర మోదీని ఇస్లామాబాద్‌కు పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్  సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థకు చెందిన ఇతర నేతలను ఆహ్వానించింది. పాకిస్తాన్‌తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి మోదీ సిద్ధంగా లేరని తెలుస్తోంది. 
  • మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. పంటలకు MSPతో పాటు రైతుల ఇతర డిమాండ్లను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించాయి. బడ్జెట్‌లోనూ పట్టించుకోలేదని రైతు సంఘాలు మండిపడ్డాయి. 
క్రీడా వార్తలు: 
టెన్నిస్‌ క్యాలెండర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి న్యూయార్క్‌ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నేటి నుంచి పురుషుల, మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. పురుషులలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్‌ జొకోవిచ్‌ బరిలోకి దిగుతుండగా.. మహిళల నుంచి అమెరికాకు చెందిన కోకో గాఫ్‌ బరిలోకి దిగుతోంది. 

మంచిమాట

  • ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య." నెల్సన్ మండేలా
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget