అన్వేషించండి

Same Sex Marriage: స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక ప్రకటన, కమిటీ ఏర్పాటుకు సిద్ధం

Same Sex Marriage: స్వలింగ వివాహాల అంశంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది.

Same Sex Marriage:

స్పెషల్ కమిటీ..

స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం తన వాదన వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు ప్రస్తావించింది. స్వలింగ వివాహం చేసుకున్న వాళ్లు సొసైటీలో ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించింది. కొన్ని ఉదాహరణలూ చెప్పింది. రోజువారీ లైఫ్‌లో వచ్చే సమస్యలతో పాటు, జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చా లేదా..? ఇన్సూరెన్స్ పాలసీలో ఆ వ్యక్తిని నామినీగా పెట్టొచ్చా లేదా అన్న అంశాలనూ తెరపైకి తీసుకొచ్చింది. ప్రాక్టికల్‌గా ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయన్న అంశంపైనా ఈ కమిటీ దృష్టి సారించనుంది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు కోర్టుకి వెల్లడించారు. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై 5గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ కమిటీ కేంద్రం అభిప్రాయాలేంటో చెప్పాలని అడిగింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని పక్కన పెడితే అలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు వర్తిస్తాయా లేదా చెప్పాలని కేంద్రాన్ని అడిగింది ధర్మాసనం. అయితే...కేంద్రం మాత్రం స్వలింగ వివాహాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇది చట్టపరిధిలోని అంశం అని...సుప్రీంకోర్టు కలగజేసుకోకపోవడమే మంచిదని చెప్పింది. 

రాష్ట్రాలకు లేఖలు..

ఈ అంశంపై అభిప్రాయాలేంటో చెప్పాలని ఇప్పటికే కేంద్రం...అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణను ఖండిస్తున్న కేంద్రం...ప్రొసీడింగ్స్‌లో రాష్ట్రాలనూ చేర్చాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే...సుప్రీంకోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అందుకే వెంటనే కేంద్రం అలెర్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలకూ లేఖలు పంపింది. ఆయా ప్రభుత్వాల అభిప్రాయాలేంటో తెలుసుకుని పూర్తి స్థాయి నివేదికను కోర్టులో సమర్పించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఇదే విషయాన్ని వెల్లడించింది కేంద్రం. ఈ విచారణలో రాష్ట్రాల అభిప్రాయాలూ కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం తేల్చి చెబుతోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే అంశం రాష్ట్రాల చట్ట పరిధిలోనూ ఉంటుందని, అందుకే ప్రొసీడింగ్స్‌లో వాళ్లనూ చేర్చడం మంచిదని వివరిస్తోంది. దీనిపై ఓ "ఉమ్మడి అభిప్రాయం" ఏంటో తెలుసుకోవడం ముఖ్యమని చెప్పింది. అప్పటి వరకూ విచారణను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరింది. కానీ కోర్టు మాత్రం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 

Also Read: Hit-And-Run Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు, 3 కి.మీ. వరకూ కార్‌ రూఫ్‌పైనే బాధితుడు - తీవ్ర గాయాలతో మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Mobile Recharge Price : మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Embed widget