అన్వేషించండి

Presidential Election 2022: మోదీకి పవర్ పంచ్,దీదీ ప్లానింగ్ మామూలుగా లేదుగా

ప్రతిపక్ష నేతలందరూ ఏకం కావాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. దిల్లీ వేదికగా జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం పలికారు.

ప్రతిపక్ష నేతలకు లేఖ రాసిన మమతా బెనర్జీ

ప్రతిపక్ష నేతల్ని ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎప్పటి నుంచో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ ఈ వ్యూహాలకు ఇంకా పదును పెడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయమై చర్చించేందుకు రావాలంటూ  20 మంది ప్రతిపక్ష నేతలకు ఆమె లేఖ రాశారు. ఈ నెల 15వతేదీన దిల్లీ వేదికగా చర్చించేందుకు ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజాకు లేఖలు పంపారు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ మమత ఆహ్వనం పలికారు. వీరిలో ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, ఎమ్‌కే స్టాలిన్, హేమంత్ సోరెన్, పినరయి విజయన్ ఉన్నారు.

 

కాంగ్రెస్ జోక్యంపై ఆ పార్టీల అసహనం

లాలూ ప్రసాద్ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా లాంటి సీనియర్ నేతలకూ మమత లేఖ అందింది. జూన్ 15న మధ్యాహ్నం దిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నారు. భాజపా హయాంలో ప్రాధాన్యత దక్కని వర్గాల గొంతుని వినిపించటమే చర్చల ప్రధాన ఎజెండా అని ఈ లేఖలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి కష్టకాలం వచ్చిందని, సమస్యలు తీర్చాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల విషయమై చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ప్రకటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ విషయమై చాన్నాళ్లుగా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. అయితే కాంగ్రెస్ కన్నా ముందుగానే 
ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు పశ్చిమ బంగ సీఎం మమత బెనర్జీ. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూన్ 9వ తేదీనే మమతా బెనర్జీ సహా స్టాలిన్, శరద్ పవార్, సీతారం ఏచూరితో సంప్రదింపులు జరిపారు. అన్ని పార్టీల నేతలతో మాట్లాడే బాధ్యతను మల్లికార్జున్ ఖార్గేకు అప్పగించారు. ఇందుకు అనుగుణంగానే ఖార్గే, మమతా బెనర్జీతో చర్చించారు. ఇంత వరకు బాగానే ఉన్నా టీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్‌ పార్టీలు కాంగ్రెస్‌ వైఖరిపై కాస్త అసంతృప్తిగా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ జోక్యాన్ని ఆయా పార్టీలు అంగీకరించటంలేదు. ఫలితంగా చర్చలు ఫలవంతంగా సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ చిన్న చిన్న మనస్పర్ధల్ని, భేదాభిప్రాయాల్ని పక్కన పెట్టి భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలాని మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావటానికి ఇదే సరైన సమయం అని గుర్తు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget