అన్వేషించండి

Presidential Election 2022: మోదీకి పవర్ పంచ్,దీదీ ప్లానింగ్ మామూలుగా లేదుగా

ప్రతిపక్ష నేతలందరూ ఏకం కావాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. దిల్లీ వేదికగా జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం పలికారు.

ప్రతిపక్ష నేతలకు లేఖ రాసిన మమతా బెనర్జీ

ప్రతిపక్ష నేతల్ని ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎప్పటి నుంచో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ ఈ వ్యూహాలకు ఇంకా పదును పెడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయమై చర్చించేందుకు రావాలంటూ  20 మంది ప్రతిపక్ష నేతలకు ఆమె లేఖ రాశారు. ఈ నెల 15వతేదీన దిల్లీ వేదికగా చర్చించేందుకు ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజాకు లేఖలు పంపారు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ మమత ఆహ్వనం పలికారు. వీరిలో ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, ఎమ్‌కే స్టాలిన్, హేమంత్ సోరెన్, పినరయి విజయన్ ఉన్నారు.

 

కాంగ్రెస్ జోక్యంపై ఆ పార్టీల అసహనం

లాలూ ప్రసాద్ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా లాంటి సీనియర్ నేతలకూ మమత లేఖ అందింది. జూన్ 15న మధ్యాహ్నం దిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నారు. భాజపా హయాంలో ప్రాధాన్యత దక్కని వర్గాల గొంతుని వినిపించటమే చర్చల ప్రధాన ఎజెండా అని ఈ లేఖలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి కష్టకాలం వచ్చిందని, సమస్యలు తీర్చాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల విషయమై చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ప్రకటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ విషయమై చాన్నాళ్లుగా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. అయితే కాంగ్రెస్ కన్నా ముందుగానే 
ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు పశ్చిమ బంగ సీఎం మమత బెనర్జీ. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూన్ 9వ తేదీనే మమతా బెనర్జీ సహా స్టాలిన్, శరద్ పవార్, సీతారం ఏచూరితో సంప్రదింపులు జరిపారు. అన్ని పార్టీల నేతలతో మాట్లాడే బాధ్యతను మల్లికార్జున్ ఖార్గేకు అప్పగించారు. ఇందుకు అనుగుణంగానే ఖార్గే, మమతా బెనర్జీతో చర్చించారు. ఇంత వరకు బాగానే ఉన్నా టీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్‌ పార్టీలు కాంగ్రెస్‌ వైఖరిపై కాస్త అసంతృప్తిగా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ జోక్యాన్ని ఆయా పార్టీలు అంగీకరించటంలేదు. ఫలితంగా చర్చలు ఫలవంతంగా సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ చిన్న చిన్న మనస్పర్ధల్ని, భేదాభిప్రాయాల్ని పక్కన పెట్టి భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలాని మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావటానికి ఇదే సరైన సమయం అని గుర్తు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget