అన్వేషించండి

Presidential Poll 2022: ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో, లిస్ట్‌లో చాలా మందే ఉన్నారుగా

ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రకటించిన దీదీ. ఎవరు అన్ని విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తాం: మమతా బెనర్జీ

రాష్ట్రపతి ఎన్నికల వేడి దేశమంతా కనిపిస్తోంది. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు చాలా రోజులుగా మేధోమథనం సాగిస్తున్నాయి. మొదట కాంగ్రెస్ ఈ బాధ్యతను తీసుకుని ప్రతిపక్షాలను కలుపుకుని పోయేందుకు గట్టిగానే కృషి చేసింది. అయితే పలు పార్టీలు కాంగ్రెస్‌ అభిప్రాయాలతో విభేదించటం వల్ల పూర్తి స్థాయిలో చర్చలు సఫలం కాలేదు. ఈ లోగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యత తీసుకున్నారు. చకచకా పావులు కదిపి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించేలా అందరూ సహకరించాలని కోరారు. దాదాపు నాలుగు రోజుల చర్చల తరవాత 
మమతా బెనర్జీ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశామని స్పష్టం చేశారు దీదీ. "మేం ఎన్నుకునే అభ్యర్థికి అందరమూ మద్దతునివ్వాలని నిర్ణయించాం. ఎన్నో నెలలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్‌ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తాం" అని అన్నారు మమతా బెనర్జీ. దీదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 
 అభ్యర్థి విషయంలో ఇంకా రాని స్పష్టత

ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్‌ను నిలబెట్టాలని ప్రతిపాదించారని, అయితే ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఆలోచించాల్సి వస్తోందని అన్నారు సీపీఐ నేత బినోయ్ విశ్వం. అయితే ప్రతిపక్షాలు మాత్రం కచ్చితంగా శరద్‌ పవార్‌నే అభ్యర్థిగా ప్రకటించాలని పట్టు పడుతున్నట్టు సమాచారం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రధాని మోదీ భంగం కలిగిస్తున్నారని, ఆయనను అడ్డుకోవాలంటే
బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నామని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఫరూక్ అబ్దుల్లాతో పాటు గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ వీరిద్దరి పేర్లనూ ప్రతిపాదించినట్టు సమాచారం. మమతా బెనర్జీ లేఖలు పంపిన నేతల జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. భాజపా హయాంలో ప్రాధాన్యత దక్కని వర్గాల వారి వాణిని వినిపించటమే చర్చల ప్రధాన ఎజెండా అని అప్పుడే దీదీ స్పష్టంగా లేఖలో ప్రస్తావించారు. నిజానికి కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల విషయమై చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ప్రకటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ విషయమై చాన్నాళ్లుగా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. అయితే కాంగ్రెస్ కన్నా ముందుగానే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కీలక పాత్ర పోషించాలని భావించారు పశ్చిమ బంగ సీఎం మమత బెనర్జీ. అందుకే ఆ బాధ్యత తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి ఆప్‌తో పాటు తెరాస హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. 

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Embed widget