అన్వేషించండి

Centre On Caste Census: కుల గణన అధికారం మాదే: సుప్రీంలో కేంద్రం వాదన

Centre On Caste Census: జనాభా గణనను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉందని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Centre On Caste Census: జనాభా గణన చట్టం 1948 ప్రకారం జనాభా గణనను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉందని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. బిహార్‌ కుల గణనకు సంబంధించిన అంశంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం ఈ విధంగా పేర్కొంది. జనగణన అనేది చట్టబద్ధమైన ప్రక్రియం అని, చట్టం ఆధారంగానే నిర్వహించాలని తెలిపింది. ఏడో షెడ్యూల్‌ 69వ ఎంట్రీ ప్రకారం జనగణన యూనియన్‌ లిస్ట్‌లో ఉందని వెల్లడించింది. సెన్సెస్‌ యాక్ట్‌ ప్రకారం కూడా కేవలం కేంద్రానికి మాత్రమే ఈ అధికారం ఉంటుందని స్పష్టంచేసింది.రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఎస్‌ఈబీసీ, ఓబీసీల అభివృద్ధి కోసం తగిన చర్యలను తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.

బిహార్‌ కులగణనకు వ్యతిరేకంగా కేంద్రం సోమవారం తొలుత దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేరా నంబర్‌ 5 లో.. రాజ్యాంగం ప్రకారం కేంద్రం కాకుండా ఇతర ఏ సంస్థకు జనగణన లేదా దానికి సమానమైన చర్యను నిర్వహించడానికి అర్హత లేదని పేర్కొంది. అయితే కొన్ని గంటల తర్వాత మరో సారి అఫిడవిట్‌ దాఖలు చేసి ఆ పేరాను తొలగించారు. ఈ పేరాపై బిహార్‌ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని తీసివేశారు. బిహార్‌లో నిర్వహించిన కుల గణనను ఛాలెంజ్‌ చేస్తున్నట్లుగానే కేంద్రం అఫడవిట్‌ ఉందని అభిప్రాయపడ్డారు. 

ఇంతముందు జరిగిన విచారణలో బిహార్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6 న కుల గణన సర్వే చేపట్టి ఆగస్టు 12న డేటా అప్‌లోడ్‌ చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సర్వే వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయని కేంద్రం తరఫున వాదిస్తున్న సోలిసిటర్‌ జనరల్‌  తుషార్‌ మెహతా వెల్లడించడంతో దీనిపై స్పందనను తెలియజేయాలని కోర్టు వెల్లడించింది. దీంతో వారం తర్వాత కేంద్రం ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

కేంద్రం సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు చేయడంపై బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ మండిపడ్డారు. వారికి ఎలాంటి నాలెడ్జ్‌ లేదని, ఎలా అబద్ధాలు చెప్పాలో, నిజాన్ని ఎలా  అణిచివేయాలో మాత్రమే తెలుసని విమర్శించారు. కుల గణను కేంద్రం అఫిడవిట్‌లోనే వ్యతిరేకించిందని స్పష్టంచేశారు. దీన్ని బట్టి బీజేపీకి కులగణన ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. ఒకవేళ వాళ్లు సపోర్ట్‌ చేస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని పేర్కొన్నారు. 

బిహార్‌ మాజీ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌, సీనియర్‌ బీజేపీ నాయకుడు సుశీల్‌ మోదీ దీనిపై స్పందించారు. తమ పార్టీ కుల గణనకు మద్దతిస్తుందని, కానీ జనగణన చట్ట ప్రకారం కుల గణన నిర్వహించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని అన్నారు. 

బిహార్‌ ప్రభుత్వం చేపడుతున్న కుల గణనను సమర్థిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆగస్టు 21 న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ప్రాథమికంగా కేసు నమోదు చేస్తే తప్ప ఈ అంశంపై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పిటిషనర్లకు వెల్లడించింది. బిహార్‌లో కులగణన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది. కుల గణనను వ్యతిరేకిస్తూ గతంలో కూడా పలు మార్లు పిటిషన్లు దాఖలయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir Donation Row 2026: అయోధ్య రామందిరం నిధుల వివాదం- రాముడి విరాళాలు మాయమయ్యాయా? యోగి సర్కార్ ఏం తేల్చబోతోంది?
అయోధ్య రామందిరం నిధుల వివాదం- రాముడి విరాళాలు మాయమయ్యాయా? యోగి సర్కార్ ఏం తేల్చబోతోంది?
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Iron And Vitamin B12 Deficiency : మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Embed widget