అన్వేషించండి

Centre On Caste Census: కుల గణన అధికారం మాదే: సుప్రీంలో కేంద్రం వాదన

Centre On Caste Census: జనాభా గణనను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉందని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Centre On Caste Census: జనాభా గణన చట్టం 1948 ప్రకారం జనాభా గణనను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉందని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. బిహార్‌ కుల గణనకు సంబంధించిన అంశంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం ఈ విధంగా పేర్కొంది. జనగణన అనేది చట్టబద్ధమైన ప్రక్రియం అని, చట్టం ఆధారంగానే నిర్వహించాలని తెలిపింది. ఏడో షెడ్యూల్‌ 69వ ఎంట్రీ ప్రకారం జనగణన యూనియన్‌ లిస్ట్‌లో ఉందని వెల్లడించింది. సెన్సెస్‌ యాక్ట్‌ ప్రకారం కూడా కేవలం కేంద్రానికి మాత్రమే ఈ అధికారం ఉంటుందని స్పష్టంచేసింది.రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఎస్‌ఈబీసీ, ఓబీసీల అభివృద్ధి కోసం తగిన చర్యలను తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.

బిహార్‌ కులగణనకు వ్యతిరేకంగా కేంద్రం సోమవారం తొలుత దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేరా నంబర్‌ 5 లో.. రాజ్యాంగం ప్రకారం కేంద్రం కాకుండా ఇతర ఏ సంస్థకు జనగణన లేదా దానికి సమానమైన చర్యను నిర్వహించడానికి అర్హత లేదని పేర్కొంది. అయితే కొన్ని గంటల తర్వాత మరో సారి అఫిడవిట్‌ దాఖలు చేసి ఆ పేరాను తొలగించారు. ఈ పేరాపై బిహార్‌ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని తీసివేశారు. బిహార్‌లో నిర్వహించిన కుల గణనను ఛాలెంజ్‌ చేస్తున్నట్లుగానే కేంద్రం అఫడవిట్‌ ఉందని అభిప్రాయపడ్డారు. 

ఇంతముందు జరిగిన విచారణలో బిహార్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6 న కుల గణన సర్వే చేపట్టి ఆగస్టు 12న డేటా అప్‌లోడ్‌ చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సర్వే వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయని కేంద్రం తరఫున వాదిస్తున్న సోలిసిటర్‌ జనరల్‌  తుషార్‌ మెహతా వెల్లడించడంతో దీనిపై స్పందనను తెలియజేయాలని కోర్టు వెల్లడించింది. దీంతో వారం తర్వాత కేంద్రం ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

కేంద్రం సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు చేయడంపై బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ మండిపడ్డారు. వారికి ఎలాంటి నాలెడ్జ్‌ లేదని, ఎలా అబద్ధాలు చెప్పాలో, నిజాన్ని ఎలా  అణిచివేయాలో మాత్రమే తెలుసని విమర్శించారు. కుల గణను కేంద్రం అఫిడవిట్‌లోనే వ్యతిరేకించిందని స్పష్టంచేశారు. దీన్ని బట్టి బీజేపీకి కులగణన ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. ఒకవేళ వాళ్లు సపోర్ట్‌ చేస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని పేర్కొన్నారు. 

బిహార్‌ మాజీ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌, సీనియర్‌ బీజేపీ నాయకుడు సుశీల్‌ మోదీ దీనిపై స్పందించారు. తమ పార్టీ కుల గణనకు మద్దతిస్తుందని, కానీ జనగణన చట్ట ప్రకారం కుల గణన నిర్వహించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని అన్నారు. 

బిహార్‌ ప్రభుత్వం చేపడుతున్న కుల గణనను సమర్థిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆగస్టు 21 న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ప్రాథమికంగా కేసు నమోదు చేస్తే తప్ప ఈ అంశంపై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పిటిషనర్లకు వెల్లడించింది. బిహార్‌లో కులగణన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది. కుల గణనను వ్యతిరేకిస్తూ గతంలో కూడా పలు మార్లు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pakistan Semifinals Chance: శ్రీలంకపై నెగ్గితే పాకిస్తాన్ సెమీఫైనల్స్ చేరుతుందా? అద్భుతం జరిగితేనే ఛాన్స్
శ్రీలంకపై నెగ్గితే పాకిస్తాన్ సెమీఫైనల్స్ చేరుతుందా? అద్భుతం జరిగితేనే ఛాన్స్
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Iran reverse attack: ఇరాన్ రివర్స్ ఎటాక్ ప్రారంభం - ఒకే సారి ఎనిమిది దేశాలపైకి మిస్సైళ్లు - మూడో ప్రపంచ యుద్ధమే !
ఇరాన్ రివర్స్ ఎటాక్ ప్రారంభం - ఒకే సారి ఎనిమిది దేశాలపైకి మిస్సైళ్లు - మూడో ప్రపంచ యుద్ధమే !
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget