అన్వేషించండి

MLA Seethakka Profile: నక్సలైట్‌ నుంచి మంత్రిస్థాయి వరకు-అంచెలంచెలుగా సీతక్క రాజకీయ ప్రస్థానం

Minister Seetakka News: తెలంగాణ మంత్రివర్గంలో ఎమ్మెల్యే సీతక్కకు కూడా చోటు దక్కింది. నక్సలైట్‌ నుంచి ప్రజాప్రతినిధిగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఎదిగిన సీతక్క రాజకీయ ప్రస్థానం ఒకసారి చూద్దాం.

MLA Seethakka Political Profile: ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఆమె జీవితం  ఎందరికో ఆదర్శప్రాయం. తెలంగాణ రాజ‌కీయాల్లో సీత‌క్క‌ది ప్ర‌త్యేక స్థానం. విద్యార్థి దశ నుంచే పోరాటం మొదలు పెట్టారు. ఆ తర్వాత దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం  మీద పోరాటం చేశారు. అక్కడ మారిన సిద్ధాంతాలు పొసగక బయటికి వచ్చారు. సాయుధ పోరాటాల కంటే ప్రజల్లో ఉండి పోరాడటమే మేలనుకుని జనజీవన స్రవంతిలో  కలిసిపోయారు. తుపాకీ తూట కంటే అంబేడ్కర్ బాటలో పయనిస్తే ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావచ్చని భావించారు. గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ  సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూ సామజిక సేవ వైపు పయనం సాగించారు సీతక్క. ఆపై రాజకీయాల్లో ఎంట్రో ఇచ్చారు. పాలిటిక్స్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.  ఎమ్మెల్యేగా గెలిచి.. సొంత నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు. ప్రజల పక్షాన పోరాడారు. ఇటు రాజకీయాల్లో, అటు ప్రజల్లో మంచి గుర్తింపు  తెచ్చుకున్నారు. ఇలా నక్సలైట్ జీవితం నుంచి.. ఇప్పుడు మంత్రిగా ఎదిగారు సీతక్క. 

1971, జూలై 9న.. వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క-సమ్మయ్య దంపతులకు జన్మించారు సీతక్క. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో  చదువుకుంటున్న సమయంలోనే పోరాటంలోకి వెళ్లారు సీతక్క. గిరిజన వసతి గృహంలో సరిగా భోజనం పెట్టడం లేదని, బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలను  వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ధర్నా చేశారామె. అప్పుడు ఆమె వయస్సు 13ఏళ్లు. ఆమె పోరాటపటిమను గుర్తించిన పీపుల్స్  వార్ దళం సభ్యుల పిలుపుతో...14ఏళ్ల వయస్సులోనే అడవిబాట పట్టారు. 1988లో 10వ తరగతి చదువుతుండగానే నక్సల్స్‌ పార్టీలో చేరారు. మావోయిస్టుల్లో చేరినా చదువు  వదల్లేదు సతీక్క. పోలీసుల అరెస్ట్‌ చేసినా... జైల్లో ఉంటూనే పదో తరగతిలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు పరీక్షల రాసి పాస్ అయ్యారు. ఆ తర్వాత... ప్రేమించిన తన బావనే  పెళ్లాడారారు సీతక్క. రెండు నెలల కుమారుడిని వేరేవాళ్ల చేతుల్లో పెట్టి మళ్లీ అడవిబాట పట్టారు. జన నాట్య మండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం చేశారు. 20ఏళ్ల  పాటు నక్సలైట్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు సీతక్క. ఆ తర్వాత సీతక్క దంపతుల మధ్య విబేధాలు రావడం.. దళంలో మారిన సిద్ధాంతాలు నచ్చక 1996లో బయటికి  వచ్చేశారు సీతక్క. ఆ తరువాత ఐటిడీఏ (ITDA)లో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు.

ఎన్టీఆర్‌ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన సీతక్క.. 2001లో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో  తొలిసారిగా ములుగు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌ చేరారు. 2018  ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి ములుగు నుంచి గెలుపొందారు సీతక్క. కరోనా సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితమైతే.. ప్రభుత్వ సహాయం లేకున్నా తన  నియోజకవర్గంలోని గ్రామాలన్నీ తిరుగుతూ ఎంతో మందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉస్మానియా  యూనివర్సిటీ నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోత్తి కోయ గిరిజనుల జీవన స్థితిగతులపై పరిశోధనలు చేసి డాక్టరేట్ కూడా పొందారు సీతక్క. 

రాజకీయాల్లో చేరడానికి ముందు 15ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు సీతక్క.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు.  రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. నక్సలైట్ జీవితం నుంచి లాయర్‌గా.. ఆపై ఎమ్మెల్యేగా... ఆ తర్వాత ప్రజాదరణ పొందిన నాయకురాలిగా గుర్తింపుతెచ్చుకున్న  సీతక్క ఇప్పుడు.. కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగిరారు. ముళ్ల బాటలను దాటుకుండా.. ప్రజాసేవకు సరైన మార్గం ఎన్నుకుంటూ... ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget