అన్వేషించండి

Lok Sabha Security Breach: లోక్‌సభ దాడి ఘటనలో మరో ట్విస్ట్,పోలీసుల అదుపులో రిటైర్డ్ డీఎస్‌పీ కొడుకు

Security Breach Lok Sabha: లోక్‌సభ దాడి ఘటనలో కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Security Breach in Lok Sabha: 

టెక్కీ అరెస్ట్..

పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం  (Security Breach Parliament)ఘటనలో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. బగల్‌కోటేలోని ఆ టెక్కీ ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు ఢిల్లీకి తరలించారు. అరెస్ట్ అయిన యువకుడు మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు కావడం మరింత సంచలనమవుతోంది. లోక్‌సభలో దాడి ఘటనలో ఈ యువకుడి హస్తమూ ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం...ఈ యువకుడి పేరు సాయికృష్ణ జగలి. లోక్‌సభలోకి దూసుకెళ్లి (Lok Sabha Security Breach) కలర్ టియర్‌ గ్యాస్ ప్రయోగించిన మనోరంజన్‌, సాయికృష్ణ మిత్రులు. ఇప్పటికే మనోరంజన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో మనోరంజన్, సాయికృష్ణ చదువుతున్నారు. అక్కడే వీళ్లిద్దరికీ పరిచయమైంది. పైగా రూమ్‌మేట్స్ కూడా. అయితే..మనోరంజన్‌ని విచారించే సమయంలో సాయి కృష్ణ పేరు ప్రస్తావించాడు. అందుకే..పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ రిటైర్డ్ డీఎస్‌పీ కొడుకు. బగల్‌కోటేలోని తన ఇంట్లో నుంచే పని చేస్తున్నాడు. తన అన్న ఎలాంటి తప్పు చేయలేదని మీడియాకి వెల్లడించింది సాయి కృష్ణ సోదరి. 

"ఢిల్లీ పోలీసులు వచ్చిన మాట నిజమే. సాయి కృష్ణను ఏవో ప్రశ్నలు అడిగారు. ఈ విచారణకు మేం పూర్తి స్థాయిలో సహకరించాం. తను ఏ తప్పూ చేయలేదు. మనోరంజన్‌, సాయి కృష్ణ ఇద్దరూ రూమ్‌ మేట్స్. ఇప్పుడు మా అన్నయ్య ఇంట్లో నుంచే పని చేస్తున్నాడు"

- సాయికృష్ణ సోదరి

ఇప్పటి వరకూ ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిరుద్యోగం, మణిపూర్ అల్లర్లు, రైతుల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ దాడి చేసినట్టు విచారణలో నిందితులు వెల్లడించారు. అయితే...అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించినట్టు Dainik Jagran వెల్లడించింది. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఈ దాడిని తక్కువ అంచనా వేయకూడదని భద్రతా పరంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని మోదీ తేల్చి చెప్పినట్టు వెల్లడించింది దైనిక్ జాగరణ్. ఈ ఆర్టికల్ ప్రకారం...ప్రధాని మోదీ ఏం అన్నారంటే..

"లోక్‌సభలో దాడి జరగడం చాలా దురదృష్టకరం. ఇది చాలా ఆందోళన కలిగించింది. పార్లమెంట్‌ భద్రతా వైఫల్యాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు. విచారణా సంస్థలు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాయి. అసలు ఈ దాడి వెనకాల ఉద్దేశాలేంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఎందుకిలా చేశారో తెలుసుకోవాలి. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఆలోచించాలి. వీటిని వివాదాస్పదం చేయడం కన్నా పరిష్కారాలపై దృష్టి పెట్టడం మంచిది"

- ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: Lok Sabha Security Breach: CISF భద్రతా వలయంలో పార్లమెంట్, దాడి ఘటనతో హోంశాఖ కీలక నిర్ణయం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget