అన్వేషించండి

JK Target Killings: కశ్మీరీ పండిట్‌లే లక్ష్యంగా మళ్లీ ఉగ్ర దాడులు

JK Target Killings: కశ్మీర్‌ లోయలో మరోసారి ఉగ్ర కదలికలు పెరిగాయి. వరుస హత్యలతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. కశ్మీరీ పండిట్‌లు నిరసన బాట పట్టారు.

JK Target Killings: కశ్మీర్‌ లోయలో అంతా ప్రశాంతంగానే ఉందనుకుంటున్న తరుణంలో మరోసారి ఉగ్రవాదుల కదలికలు మొదలయ్యాయి. వరుస హత్యలతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ముష్కరులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉగ్రదాడుల్లో 16 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో పండిట్ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు ఇతర వర్గాల వారూ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు, టీచర్లు, సర్పంచ్‌లు ఇలా కీలకమైన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. కుల్గం జిల్లాలో ఓ బ్యాంక్ అధికారిని హత్య చేసిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అవటం వల్ల ఒక్కసారిగా స్థానిక ప్రజల్లో భయం రెట్టింపైంది. కశ్మీరీ పండిట్‌ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతలు చల్లార్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రంగంలోకి దిగారు.  ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే ఓ దఫా చర్చలు ముగిశాయి.

ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే అమిత్‌షాతో కశ్మీర్‌లోని స్థితిగతులపై చర్చలు జరిపారు. అయితే మరోసారి ఉన్నతాధికారులతో సమావేశం జరపాలని నిర్ణయించారు అమిత్‌షా. అజిత్‌ దోవల్‌తో పాటు జమ్ము, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, భాజపా సీనియర్ నేతలు, స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలోనే అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన 
ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్టు తెలుస్తోంది. జమ్ము, కశ్మీర్‌లో ఉగ్ర కదలికలు లేకుండా చూడాలని గతంలోనే అమిత్‌షా అక్కడి భద్రతా అధికారులకు సూచించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో వరుస హత్యలు జరగటం వల్ల అమిత్‌షా వరుస సమావేశాలతో లోయల్ పరిస్థితులు చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. 

వరుస హత్యలతో లోయలో అలజడి

కశ్మీర్‌ లోయపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించటం సహా భద్రతను కట్టుదిట్టం చేయటాన్ని చూసి ఉగ్రవాదులు అసహనానికి గురవుతున్నారని అందుకే ఇలా వరుస హత్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. కొత్తగా ఉగ్రసంస్థల్లో చేరిన వాళ్లే ఈ పనులు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. నిజానికి గతేడాది ఫిబ్రవరి నుంచే లోయలో ఉగ్ర అలజడి మొదలైంది. శ్రీనగర్‌లోని ఓ ధాబా యజమాని కొడుకుని కాల్చి చంపారు ఉగ్రవాదులు. తరవాత అక్టోబర్‌లో ప్రముఖ కెమిస్ట్ ఎమ్‌ఎల్ బింద్రూని ఆయన షాప్‌లోనే కాల్చి చంపారు. తరవాత పలువురు టీచర్లనీ ఇలాగే హతమార్చారు ముష్కరులు. కశ్మీరీ టీవీ నటిని కూడా ఇదే విధంగా కాల్చి చంపారు. ఈ వరుస హత్యలతో మరోసారి కశ్మీర్‌ లోయలో అలజడి రేగింది. వీలైనంత త్వరగా ప్రజల్లో భయాందోళనలు తగ్గించి భరోసా కల్పించాలని భావిస్తోంది కేంద్రం.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Best Mileage Cars: మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
US Iran War Updates: పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget