News
News
X

Jammu and Kashmir Encounter: నక్కి ఉన్న ఉగ్రవాదులను బయటకు లాగుతూ, కశ్మీర్‌ లోయలో వరుస ఎన్‌కౌంటర్‌లు

కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో భారత సైన్యం, ఉగ్రవాదులను మట్టుబెడుతోంది.

FOLLOW US: 
Share:

రహస్య స్థావరాలపై దాడులు

జమ్ము, కశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో మరోసారి ఉగ్ర కదలికలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు భారత సైన్యం గట్టి నిఘా పెడుతోంది. 
ఉగ్రవాదులు దాక్కున్న రహస్య స్థావరాలను గుర్తించి నేరుగా దాడులు చేస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో షిర్మాల్ అనే ఓ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరం వద్ద సైనికులు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. వెంటనే టెర్రరిస్ట్‌లు కాల్పులు జరపటం మొదలు పెట్టారు. భద్రతా దళాలతో పాటు పోలీసులు కూడా ఆ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

ఆ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్..

పోలీసుల కదలికల్ని గుర్తించి అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపటం వల్ల ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎల్ఓసీ వద్ద 150 మంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్లాన్ వేసుకున్నారని ఓ సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. 500 నుంచి 700 మంది మిలిటెంట్లకు 11 క్యాంప్‌ల్లో శిక్షణ ఇస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని స్పష్టం చేశారు. మన్‌షేరా, కొట్లీ, ముజఫర్‌బాద్ ప్రాంతాల్లో ఈ ఉగ్ర క్యాంప్‌లున్నాయని ఆయన అన్నారు. అయితే ముష్కరులు ఎల్ఓసీని దాటి రాకుండా, మన సైనికులు కట్టడి చేస్తున్నారని వెల్లడించారు.

కొన్ని నెలలుగా ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య ఇలాంటి ఎన్‌కౌంటర్ ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆపరేషన్లలో ఉగ్రవాదులతో సహా వాళ్ల కమాండర్లను కూడా హతమార్చుతోంది భారత సైన్యం. జూన్ 15వ తేదీన లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కులగం జిల్లాలోని ఓ బ్యాంక్‌ మేనేజర్‌ని చంపినందుకు ఇలా ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు చనిపోయారని, వారిలో ముగ్గురు పాక్‌కు చెందిన వారని స్పష్టం చేశారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. 

Also Read: Maharashtra Political Crisis: మహారాష్ట్ర సంక్షోభంలోకి రష్మీ ఎంట్రీ! మీ భర్తలకు చెప్పుకోండమ్మా అంటూ విజ్ఞప్తి

Also Read: DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

Published at : 26 Jun 2022 11:12 AM (IST) Tags: J&K terrorism jammu and kashmir Encounters in J&K

సంబంధిత కథనాలు

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

US Army Helicopter Crash:  అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు