అన్వేషించండి

Ajit Pawar Dies in Baramati Plane Crash: రాజకీయ యుక్తి నేర్పిన బాబాయ్ నుంచి అజిత్ పవార్ NCPని ఎందుకు లాక్కున్నారు? అత్యంత శక్తివంతమైన లీడర్‌గా ఎలా మారారు?

Ajit Pawar Died: అజిత్ పవార్ రాజకీయ వ్యూహాలలో బాబాయ్ శరద్ పవార్ ఎలాంటి పాత్ర పోషించారు? శరద్ పవార్ ఆధ్వర్యంలో అజిత్ పవార్ మహారాష్ట్రలోని అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరిగా ఎలా మారారో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బారామతిలో విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారు.
  • మామ శరద్ పవార్ తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎదిగారు.
  • అనేక మంత్రి పదవులు చేపట్టి, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
  • పార్టీలో చీలిక తర్వాత ఉపముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది.

Ajit Pawar Dies in Baramati Plane Crash: మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం ఉదయం (జనవరి 28, 2026) జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఆరుగురు మరణించారు. బారామతిలో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. పిటిఐ ప్రకారం, విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది.

అజిత్ పవార్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బారామతితో ఆయనకు చాలా అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగారు. ప్రజలకు సేవ చేశారు. వాటిలో ఉప ముఖ్యమంత్రిగా, NCP సీనియర్ నాయకుడిగా చాలా కాలం పనిచేశారు. 

బాబాయ్ శరద్ పవార్ నుంచి రాజకీయ నైపుణ్యాలు నేర్చుకున్న అజిత్ పవార్.

అజిత్ పవార్ రాజకీయ ప్రయాణం ఆయన బాబాయ్ శరద్ పవార్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది, రాజకీయ నైపుణ్యాలు, సంస్థాగత వ్యూహాన్ని నేర్పించారు  బారామతి ప్రాంతాన్ని కుటుంబ రాజకీయ కోటగా మార్చారు. అయితే తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీలో చీలిక విభేదాలు చాలా అంశాలు మహారాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  

1991 లోక్‌సభ ఎన్నికలు, శరద్ పవార్ రాజీనామా

ది హిందూలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, 1991లో బారామతి లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా అజిత్ పవార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ విజయం కేవలం వ్యక్తిగత విజయం కాదు, శరద్ పవార్ రాజకీయ వ్యూహంలో భాగం. తరువాత, అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఈ నిర్ణయం ఆ సమయంలో అజిత్ పవార్ పూర్తిగా శరద్ పవార్ నాయకత్వంలో పనిచేస్తున్నారని నిరూపిస్తుంది.

అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ స్కూల్

శరద్ పవార్ తో కలిసి పనిచేయడం వల్ల అజిత్ పవార్ కు అనేక పరిపాలనా పాఠాలు నేర్చుకున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమయపాలన పాటించడం, అధికారులు, ప్రజల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం, సంక్షోభ సమయాల్లో కఠినమైన కానీ ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు బాగా వంటపట్టింది. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా శరద్ పవార్ అనుభవం అజిత్ పవార్ కు శిక్షణా స్థలంగా పనిచేసింది.

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

కాలక్రమేణా, అజిత్ పవార్ తనను తాను శరద్ పవార్ మేనల్లుడి కుమారుడిగా మాత్రమే పరిమితం చేసుకోలేదు. నీటిపారుదల, ఆర్థికం, పరిపాలన వంటి కీలక విభాగాలలో సేవలందిస్తూ, తన పని తీరుతో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలం పాటు, మహారాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా మారారు. బారామతి ప్రాంతంలో ఆయన రాజకీయ ఆధిపత్యం బలపడింది.

అలా బాబాయ్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకొని మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ దాదా అని పిలుచుకు స్థాయికి ఎదిగారు. శరద్, అజిత్ మధ్య గురు శిష్యుల సంబంధం ఉంది. కానీ జీవితంలో, రాజకీయాల్లో ఏ సమీకరణం శాశ్వతం కాదు. అందుకే, బహుశా, వారి రాజకీయ కెరీర్ సంధ్యా సమయంలో అజిత్ , శరద్ మధ్య చీలిక స్పష్టంగా కనిపించింది. 

1990ల ప్రారంభంలో అజిత్ పవార్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1991లో తన మొదటి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, ఆయన తన బాబాయ్ అజిత్ పవార్ కోసం ఆ స్థానాన్ని వదులుకున్నారు. తరువాత, అజిత్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో అజిత్ తొలిసారి విజయం సాధించారు. తరువాత, 1995, 1999, 2004, 2009, 2014లో వరుసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ విజయం సాధించారు.

1991 నుంచి 1992 వరకు, ముఖ్యమంత్రి సుధాకర్‌రావు నాయక్ ప్రభుత్వంలో వ్యవసాయం, విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత, 1992లో, శరద్ పవార్ ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన భూసార పరిరక్షణ, విద్యుత్, ప్రణాళిక శాఖ సహాయ మంత్రి అయ్యారు. 1999లో, కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. 2003లో, ఆయన సుశీల్ కుమార్ షిండే మంత్రివర్గంలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సిపి కూటమి విజయం సాధించిన తర్వాత , ఆయన దేశ్‌ముఖ్, తరువాత అశోక్ చవాన్ మంత్రివర్గాలలో జల వనరుల మంత్రిగా పనిచేశారు.  

ఇంతలో, తన బాబాయ్ శరద్ పవార్ తో పార్టీలో విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు మొదట 2019లో వెలుగులోకి వచ్చాయి. ఆ సంవత్సరం నవంబర్ 23న ఆయన NCPని వీడి BJP నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో, ఆ ప్రభుత్వంలో మెజారిటీని నిరూపించుకోవడానికి, తనకు మద్దతు ఇస్తున్న NCP ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు ఒక పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే, 80 గంటలలోపు, మహారాష్ట్రలో రాజకీయాల చక్రాలు తిరిగాయి. అజిత్ మళ్ళీ తిరిగి సొంత గూటికి వచ్చారు.  

2022లో, శివసేన విడిపోయినప్పుడు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటు శివసేన వర్గం, బిజెపి కలిసి ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో, అజిత్ పవార్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. 2023 నాటికి, బాబాయ్ , మేనల్లుళ్ల మధ్య దూరం, అధికారం కోసం తహతహలాడే అన్నీ పార్టీలో స్పష్టంగా కనిపించాయి. ఆ సంవత్సరం జూలై 2న, అజిత్ పవార్, తన మద్దతుదారుల ఎమ్మెల్యేలతో కలిసి, శరద్ పవార్ నేతృత్వంలోని NCPని విడిచిపెట్టి, మహారాష్ట్రలో శివసేన-BJP కూటమిలో చేరారు. ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాజకీయ మార్పు NCPలో పెద్ద చీలికకు దారితీసింది. 

రాజకీయాల్లో నిలబెట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చిన బారామతికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రయాణం అజిత్ పవార్ చివరి ప్రయాణం. ఆయన ప్రైవేట్ విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ప్రమాదంలో ఆయన మరణించారు. మరణించే సమయానికి ఆయన వయస్సు 66 సంవత్సరాలు. 

Frequently Asked Questions

అజిత్ పవార్ ఎప్పుడు, ఎలా మరణించారు?

మహారాష్ట్రలోని బారామతిలో జనవరి 28, 2026న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోవడంతో ఆయనతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అజిత్ పవార్ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది?

అజిత్ పవార్ 1990ల ప్రారంభంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తొలిసారి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

అజిత్ పవార్ తన మామ శరద్ పవార్ నుండి ఎలాంటి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు?

శరద్ పవార్ పర్యవేక్షణలో అజిత్ పవార్ రాజకీయ నైపుణ్యాలు, సంస్థాగత వ్యూహాలను నేర్చుకున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అధికారులతో సమన్వయం వంటి పరిపాలనా పాఠాలు కూడా నేర్చుకున్నారు.

అజిత్ పవార్ ఎప్పుడు, ఎందుకు NCP నుంచి విడిపోయారు?

2023 జూలై 2న, అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి శరద్ పవార్ నేతృత్వంలోని NCPని విడిచిపెట్టారు. మహారాష్ట్రలో శివసేన-BJP కూటమిలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget