అన్వేషించండి

Pahalgam Terror Attack : ఇంతకింత తిరిగి ఇచ్చేస్తాం - ఉగ్రదాడిపై మోదీ రియాక్షన్- అమిత్‌షాకు ఫోన్‌లో దిశానిర్దేశం

Pahalgam Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం మరింత బలపడుతుందని అన్నారు.

జమ్ముకశ్మీర్‌ పహల్గామ్ ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటన గురించి తెలిసిన వెంటనే  ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రదేశాన్ని సందర్శించాలని కూడా ప్రధాని మోదీ సూచించినట్టు ప్రభుత్వ తెలిపాయి. 

దక్షిణ కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక గమ్యస్థానమైన పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు, ఇద్దరు మృతి చెందారు. ఈ దాడి తర్వాత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. "జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన అన్నారు.

"బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాం. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయం స్థానం ముందు నిలబెడతాం. వారిని వదిలిపెట్టబోం. వారి దుర్మార్గపు అజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం దృఢమైంది. అది మరింత బలపడుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.

పహల్గామ్ దాడి తర్వాత, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఐబి చీఫ్, హోం కార్యదర్శి సమావేశానికి హాజరయ్యారు. హోంమంత్రి ఈ ఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ ఘటన గురించి ప్రధానమంత్రి మోడీకి తెలియజేశానని, ఉగ్రవాద దాడి తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించానని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

"జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి బాధించింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దారుణ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము మరియు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాము. వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాం" అని హోంమంత్రి అన్నారు. "అన్ని ఏజెన్సీలతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించడానికి త్వరలో శ్రీనగర్‌కు బయలుదేరుతున్నాను" అని హోంమంత్రి అన్నారు. 

జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో రాజస్థాన్‌కు చెందిన పర్యాటకుల బృందంపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన బైసరన్‌ లోయ ఎగువ ప్రాంతాల్లో జరిగింది. కొంతమంది పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget