అన్వేషించండి

Justice Varma Impeachment: న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ ఎలా జరుగుతుంది? జస్టిస్ వర్మ కేసును లోతుగా తెలుసుకోండి!

Justice Varma Impeachment: భారత్‌లో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానమే అభిశంసన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లో అభిశంసన వంటి అంశాలు ప్రస్తావిస్తుంది.

Justice Varma Impeachment: భారతదేశ ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైనది. రాజ్యాంగ పరిరక్షణకు మూలవిరాట్ న్యాయవ్యవస్థే. అయితే, ఈ వ్యవస్థలో భాగమైన న్యాయమూర్తులను తొలగించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. న్యాయమూర్తుల తొలగింపు ఎలా చేయాలన్న విషయాన్ని రాజ్యాంగం ప్రత్యేకంగా పొందుపరిచింది. న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియను అభిశంసన (Impeachment) అంటారు. ఈ విధానం ద్వారానే న్యాయమూర్తులను తొలగిస్తారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియ సాగుతోంది. ఇది ఎలా జరుగుతుంది? అభిశంసనపై రాజ్యాంగం ఏం చెబుతోంది? అన్న విషయాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

అభిశంసన ఏ స్థాయి న్యాయమూర్తులకు వర్తిస్తుంది?

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానమే అభిశంసన. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్వహణ, న్యాయమూర్తుల ఎంపిక, అభిశంసన వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 124(4) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు అంశాన్ని వివరిస్తుంది. ఇక, ఆర్టికల్ 217, 218 హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియను వివరిస్తుంది.

న్యాయమూర్తుల అభిశంసనకు గల కారణాలు ఇవే

రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రెండు కారణాల మీద మాత్రమే అభిశంసన చేసే అవకాశం ఉంది. అందులో మొదటి కారణం దుష్ప్రవర్తన (Misbehaviour), రెండో కారణం అసమర్థత (Incapacity). ఈ రెండు కారణాలే అభిశంసన ప్రక్రియకు ప్రాతిపదిక.

అభిశంసన ప్రక్రియ జరిగే విధానం

పై రెండు కారణాలతో న్యాయమూర్తులపై అభిశంసన ప్రక్రియ "న్యాయమూర్తుల విచారణ చట్టం, 1968" (Judges Enquiry Act, 1968) ద్వారా చేపడతారు. ఇందులో ఐదు దశలు ఉంటాయి. న్యాయమూర్తుల తొలగింపు అధికారంలోని ఆ దశలు క్రింది విధంగా ఉంటాయి:

1. ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం: న్యాయమూర్తుల తొలగింపునకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో ప్రవేశపెట్టదలచుకుంటే 50 మంది సభ్యులు సంతకాలు అవసరం. అలా సంతకాలు చేసిన తీర్మానాన్ని లోక్‌సభలో అయితే స్పీకర్‌కు, రాజ్యసభలో అయితే ఛైర్మన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

2. అభిశంసన తీర్మానంపై విచారణ కమిటీ ఏర్పాటు: అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో ఛైర్మన్ ఆమోదించిన తర్వాత ముగ్గురు సభ్యులతో విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వారితోపాటు ఒక న్యాయ నిపుణుడు సభ్యులుగా ఉంటారు.

3. ఆరోపణలపై కమిటీ విచారణ- నివేదిక: న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానంలో వచ్చిన ఆరోపణలను ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతుంది. న్యాయమూర్తిపై ఆరోపణలు రుజువైతే, ఆ అంశాలతో కూడిన నివేదికను పార్లమెంట్‌కు ఈ విచారణ కమిటీ సమర్పిస్తుంది.

4. కమిటీ నివేదికపై పార్లమెంట్‌లో ఓటింగ్: పార్లమెంట్‌కు సమర్పించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ ప్రత్యేక మెజారిటీ అవసరం. అంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీతోపాటు, ఆ రోజు సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీ సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

5. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగింపు: ఉభయ సభల్లోనూ అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఆరోపణలు రుజువైన న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.

ఈ ఐదు దశలు దాటిన తర్వాతే అభిశంసన ఎదుర్కొన్న న్యాయమూర్తులను తొలగిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే, న్యాయమూర్తిని తొలగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ ప్రక్రియ చాలా కఠినమైనది, సంక్లిష్టమైనది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి అభిశంసన ప్రక్రియ ద్వారా న్యాయమూర్తులు తొలగించడం జరగలేదు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget