అన్వేషించండి

Banda Boat Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం, యమునా నదిలో పడవ బోల్తా , 17 మంది గల్లంతు!

Banda Boat Accident : ఉత్తర్ ప్రదేశ్ బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మరణించారు. 17 మంది వరకు గల్లంతు అయినట్లు సమాచారం.

Banda Boat Accident :  ఉత్తర్​ ప్రదేశ్​ బాందా జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు.  కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. యూపీ మర్కా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మర్కా నుంచి ఫతేపుర్ ​లో ఉన్న జరౌలీ ఘాట్ ​కు యమునా నది మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలుల కారణంగా సుడిగుండం ఏర్పడి పడవ మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బందిని అధికారులు రంగంలోకి దింపారు. 

17 మంది గల్లంతు! 

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నుంచి మార్కాకు ప్రయాణికులతో వెళ్తున్న పడవ యమునా నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలు పలువురు మునిగిపోయారని ఏఎన్ఐ తెలిపింది. పడవలో ఉన్న వ్యక్తుల సంఖ్యను అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆరా తీశారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. జిల్లా అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈదురు గాలుల వల్లే బోటు బోల్తా పడిందని స్థానిక ఎస్పీ అభినందన్ విలేకరులతో అన్నారు. ఇప్పటి వరకు 15 మందిని రక్షించామన్నారు. మరో 17 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఇప్పటి వరకూ 4 మృతదేహాలను వెలికితీశారు. NDRF, SDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. 

పడవల్లో రవాణా 

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం  ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను కోరారు. మార్కా పరిసర ప్రాంతాల ప్రజలు సమీప పట్టణాలకు చేరుకోవడానికి పడవలు మాత్రమే రవాణా మార్గం. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు మాట్లాడుతూ నది ప్రవాహం ఎక్కువగా ఉందని, పడవ నది మధ్యలోకి వెళ్లగా మునిగిపోయిందన్నారు. పడవ ఒక్కసారిగా బోల్తాపడిందని, పడవ నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నానన్నారు. 

Also Read : Venkaiah Naidu : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?

Also Read : TS BJP EC : "సాలు దొర - సెలవు దొర"కు ఈసీ నో పర్మిషన్ - కొత్త పేరుతో బీజేపీ మొదలు పెడుతుందా ?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget