By: ABP Desam | Updated at : 22 Apr 2023 09:06 AM (IST)
పల్లె వీధుల్లో వృద్ధుల స్కేటింగ్ ( Image Source : tarqeeb Instagram )
Trending News: ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చాలా స్పీడ్గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు రియల్గా ఉన్నట్టు కనిపించే భ్రమ అన్నమాట. రియల్గా అవుతున్నవి కొన్ని ఉంటే ఇలా ఆర్టిఫిషియల్గా సృష్టించి వైరల్ చేస్తున్నవి మరికొన్ని.
అలా వైరల్ అవుతున్న ఫొటోల్లో కొందరు వృద్ధు స్కేట్ బోర్డు సాయంతో వీధుల్లో స్కేటింగ్ చేస్తున్నారు. వీటిని చూసి నెటిజన్లు తమ కళ్లను తాము నమ్మలేకపోతున్నారు. సాధారణంగా వృద్ధ మహిళలు తమ శరీరాన్ని తామే మోయలేని పరిస్థితుల్లో ఉంటారు. వయోభారంతో ఉన్న వారికి వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న వారంతా ఇలా వీధుల్లో స్కేటింగ్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
వాటిని చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. జాగ్రత్తలు చెబుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. కామెంట్స్ చేస్తున్నవారు కొందరైతే... వాటిని షేర్ చేస్తున్న వాళ్లు మరికొందరు. చివరకు అసలు విషయం తెలిసి షాక్ తిన్న వారు ఇంకొందరు.
స్కేటింగ్ చేస్తున్న ఫొటోల్లో ఉన్న వృద్ధులు అంతా 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే కావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోల్లో నిజానిజాలు బయటకు తెలియగానే చాలా మంది ఉఫ్... అంటూ గట్టిగా గాలి పీల్చుకొని వదులుతున్నారు. మరికొందరు బిగ్గరగా నవ్వుతున్నారు. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఈ ఫోటోల్లో నిజమెంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేట్ చేసింది
ప్రస్తుతం ఈ ఫోటోలను ఆశిష్ జోస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ తార్కిబ్లో పోస్ట్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ చిత్రాలను రూపొందించినట్లు తెలియజేశారు. ఈ నిజం తెలిసిన వెంటనే యూజర్లు షాక్ కు గురయ్యారు. చాలా మంది యూజర్లు ఈ ఫొటోలు నిజమని, తాము నిజంగా ఆశ్చర్యపోయామని తమ రియాక్షన్లో పేర్కొన్నారు.
ఆ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇందులో దేవుళ్ళ నుంచి ప్రపంచంలోని కొంతమంది ధనవంతుల వరకు ఏఐ ఫొటోలు వచ్చాయి. ప్రస్తుతం వృద్ధ మహిళలు స్కేట్బోర్డును ఆస్వాదిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
Bihar Bridge Collapse: బిహార్లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి, ఇది మొదటిసారి కాదు
Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు, వెల్లడించిన రైల్వే మంత్రి
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్