అన్వేషించండి

Supreme Court on Pegasus: పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. 10 రోజులు గడువు 

దేశ రక్షణ, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకుని తాము ఏ వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అధికారులు తమకు అఫిడవిట్ సమర్పించడానికి సమస్య ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మంగళవారం నాడు పెగాసస్ నిఘా వ్యవహారంపై మరోసారి కేంద్రం తీరును తప్పుపట్టారు. ఓ ముందుకేసి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడం సరైన చర్య కాదని, దీనికి బాధ్యులు తప్పక శిక్ష అనుభవిస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది. 

పెగాసస్ స్పైవేర్‌తో ప్రతిపక్ష నేతలు, లాయర్లు, జడ్జీలు, జర్నలిస్టులపై నిఘా ఉంచారంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను నేడు మరోసారి విచారించిన సుప్రీంకోర్టు.. పెగాసస్ స్పైవేర్ వాడకంపై విచారణకు సహకరించాలని, నిఘా ఉంచారా లేదా అనే ప్రశ్నలు కేంద్రానికి సంధించింది. కేంద్ర ప్రభుత్వం తమ ప్రశ్నలకు, సందేహాలకు 10 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

దేశ రక్షణ, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకుని తాము ఏ వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే దేశ రక్షణ అవసరమైన నేపథ్యంలో కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేసినా.. అందుకు తగిన అధికారంతో చేశారా అంటూ సుప్రీం ధర్మాసనం పలు ప్రశ్నలను కేంద్రానికి సంధించింది. కోర్టు ప్రశ్నలకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. నిపుణుల టీమ్ ముందు కొన్ని వివరాలు బహిర్గతం చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ప్రజల సమక్షంలో అలాంటి కీలక విషయాలు వెల్లడించడం దేశ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు.
Also Read: పెగాసస్‌పై విచారిస్తుండగా సోషల్‌మీడియాలో సమాంతర చర్చలెందుకూ..

నిపుణుల ముందు కేంద్ర ప్రభుత్వం విషయాలను బహిర్గతం చేయడానికి వెనుకాడదు. ఒకవేళ కొన్ని ఉగ్ర సంస్థలు టెక్నాలజీ సాయంతో కొందరు వ్యక్తులతో చర్చలు జరుపుతారని, అయితే తటస్థంగా ఉండే కమిటీ, నిపుణులకు మాత్రమే ఆ వివరాలు అందిస్తామని చెప్పారు. ఆ కమిటీ కేవలం కోర్టుకు మాత్రమే నివేదిక వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. 

తుషార్ మెహతా చెప్పిన దానిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీరు సొలిసిటర్ జనరల్, మేం కోర్టు.. మనం జాతీయ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనై కాంప్రమైజ్ అవ్వకూడదు. వివరాలను మేం ఎవరికీ వెల్లడించం. అయితే అధికారులు తమకు అఫిడవిట్ సమర్పించడానికి సమస్య ఏముంటుందని ప్రశ్నించింది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ, జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, కొందరు ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ విచారణలో భాగంగా అడిగిన వివరాలను పది రోజుల్లోగా సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
Also Read: Pegasus Snooping Row: గూఢచర్యానికి పాల్పడటం చాలా తీవ్రమైన విషయం: సుప్రీంకోర్టు

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
NTR Statue: అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో
అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో
Allu Arjun: అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Tragedy: ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు మంత్రుల నివాళి, వైజాగ్ చేరుకున్న చంద్రమౌళి మృతదేహం
Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్
NTR Statue: అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో
అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో
Allu Arjun: అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
Pahalgam Tourist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడి ఘటన, కాల్పులు జరిపిన ఓ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో వైరల్- మొత్తం నలుగురు పాక్ టెర్రరిస్టులు
Pahalgam Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
కశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన టాలీవుడ్... చిరు, మహేష్ నుంచి బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వరకు
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Embed widget