అన్వేషించండి

Supreme Court on Pegasus: పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. 10 రోజులు గడువు 

దేశ రక్షణ, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకుని తాము ఏ వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అధికారులు తమకు అఫిడవిట్ సమర్పించడానికి సమస్య ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మంగళవారం నాడు పెగాసస్ నిఘా వ్యవహారంపై మరోసారి కేంద్రం తీరును తప్పుపట్టారు. ఓ ముందుకేసి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడం సరైన చర్య కాదని, దీనికి బాధ్యులు తప్పక శిక్ష అనుభవిస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది. 

పెగాసస్ స్పైవేర్‌తో ప్రతిపక్ష నేతలు, లాయర్లు, జడ్జీలు, జర్నలిస్టులపై నిఘా ఉంచారంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను నేడు మరోసారి విచారించిన సుప్రీంకోర్టు.. పెగాసస్ స్పైవేర్ వాడకంపై విచారణకు సహకరించాలని, నిఘా ఉంచారా లేదా అనే ప్రశ్నలు కేంద్రానికి సంధించింది. కేంద్ర ప్రభుత్వం తమ ప్రశ్నలకు, సందేహాలకు 10 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

దేశ రక్షణ, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకుని తాము ఏ వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే దేశ రక్షణ అవసరమైన నేపథ్యంలో కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేసినా.. అందుకు తగిన అధికారంతో చేశారా అంటూ సుప్రీం ధర్మాసనం పలు ప్రశ్నలను కేంద్రానికి సంధించింది. కోర్టు ప్రశ్నలకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. నిపుణుల టీమ్ ముందు కొన్ని వివరాలు బహిర్గతం చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ప్రజల సమక్షంలో అలాంటి కీలక విషయాలు వెల్లడించడం దేశ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు.
Also Read: పెగాసస్‌పై విచారిస్తుండగా సోషల్‌మీడియాలో సమాంతర చర్చలెందుకూ..

నిపుణుల ముందు కేంద్ర ప్రభుత్వం విషయాలను బహిర్గతం చేయడానికి వెనుకాడదు. ఒకవేళ కొన్ని ఉగ్ర సంస్థలు టెక్నాలజీ సాయంతో కొందరు వ్యక్తులతో చర్చలు జరుపుతారని, అయితే తటస్థంగా ఉండే కమిటీ, నిపుణులకు మాత్రమే ఆ వివరాలు అందిస్తామని చెప్పారు. ఆ కమిటీ కేవలం కోర్టుకు మాత్రమే నివేదిక వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. 

తుషార్ మెహతా చెప్పిన దానిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీరు సొలిసిటర్ జనరల్, మేం కోర్టు.. మనం జాతీయ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనై కాంప్రమైజ్ అవ్వకూడదు. వివరాలను మేం ఎవరికీ వెల్లడించం. అయితే అధికారులు తమకు అఫిడవిట్ సమర్పించడానికి సమస్య ఏముంటుందని ప్రశ్నించింది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ, జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, కొందరు ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ విచారణలో భాగంగా అడిగిన వివరాలను పది రోజుల్లోగా సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
Also Read: Pegasus Snooping Row: గూఢచర్యానికి పాల్పడటం చాలా తీవ్రమైన విషయం: సుప్రీంకోర్టు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget