అన్వేషించండి

Russia Ukraine Conflict: బుకారెస్ట్‌ చేరుకున్న స్పెషల్ ఫ్లైట్స్‌, ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను తరలించేందుకు స్పెషల్ ఆపరేషన్

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌(Ukraine)లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి బుకారెస్ట్(Bucharest), హంగేరియన్(Hungarian) రాజధాని బుడాపెస్ట్‌(Budapest)కు ఎయిర్ ఇండియా విమానాలు చేరుకున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి భారత్‌లో ఒకటే టెన్షన్. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ బిడ్డలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు. అటు ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టింది. 

సరిహద్దులు దాటించి...

ఉక్రెయిన్‌లో నేరుగా విమానాలు దిగే ఛాన్స్ లేనందున సమీప దేశాల నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ వెహికల్స్ బుక్క్ చేసుకొని ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చేయాలని విద్యార్థులకు రూట్‌ మ్యాప్ ఇచ్చింది. విద్యార్థులు వెళ్లే వెహికల్స్‌కు ఇండియా జెండా పెట్టుకోవాలని సూచించింది.

ఎయిరిండియా ప్రత్యేక విమానం

ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చిన విద్యార్థుల కోసం రొమేనియా, హంగేరిలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. భారతీయుల తరలింపు కోసం ఎయిర్ ఇండియా AI-1943 ప్రత్యేక విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌లో ల్యాండ్ అయింది.ఈ ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయం నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. .

Russia Ukraine Conflict: బుకారెస్ట్‌ చేరుకున్న స్పెషల్ ఫ్లైట్స్‌, ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను తరలించేందుకు స్పెషల్ ఆపరేషన్

AI-1943 అనే విమానం ముంబై విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 3.40 గంటలకు బయలుదేరింది. ఇండియన్ టైం ప్రకారం పది గంటలకు బుకారెస్ట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 

ఉక్రెయిన్- రొమేనియాకు భారత్‌ విద్యార్థులు

భారతీయ విద్యార్థులను సరిహద్దులకు చేరుకోమని కోరిన తర్వాత, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న జాతీయులను భారత ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలాలకు చేరుస్తారని అధికారులు తెలియజేసినట్లు PTI తెలిపింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం బుకారెస్ట్, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌కు మరిన్ని ఎయిర్ ఇండియా విమానాలు నడపనుంది ప్రభుత్వం. 

రష్యాతో వివాదం కారణంగా తమ గగనతలంలో విమానాలు ఎగరడాన్ని ఉక్రెయిన్ పూర్తిగా నిషేధించింది. అందుకే విద్యార్థుల తరలింపులో జాప్యం జరిగింది. విద్యార్థులు, వారి ఫ్యామిలీ మెంబర్స్‌ ఒత్తిడి పెరిగిపోవడంతో ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లను పూర్తి చేశారు. బుకారెస్ట్, బుడాపెస్ట్ వరకు విద్యార్థులను తీసుకురావాలని ఎంబసీ అధికారులకు సూచించింది. దాదాపు 20,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు, ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని అధికారులు గుర్తించారు.

ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడానికి ముందే, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు విమానం పంపించింది. 240 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. 

దిల్లీ, ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌ 

తర్వాత పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యేక ప్రభుత్వ చార్టర్ విమానాలు నడపనున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొంది. దిల్లీ, ముంబై నుంచి బుకారెస్ట్, బుడాపెస్ట్‌కు B787 విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

ప్రస్తుతం ఉజ్హోరోడ్ సమీపంలోని చాప్-జహోనీ హంగేరియన్ సరిహద్దు, చెర్నివ్ట్సీ సమీపంలోని పోరుబ్నే-సిరెట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్లు ఉన్నాయి. అక్కడ వెరిఫై చేసి ఆయా దేశాల్లోకి పంపిస్తారు. 

జెండా, పాస్‌పోర్ట్ తప్పనిసరి

భారతీయ ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు, ఇతర అవసరమైన వస్తువులు, కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాలను సరిహద్దు చెక్‌పోస్టులకు తీసుకెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది. వాహనాలు, బస్సులపై భారత జెండా అతికించాలని తెలిపింది. 

కీవ్ , రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 600 కి.మీ . రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఎనిమిదిన్నర గంటల నుంచి 11 గంటల సమయం పడుతుంది. 

బుకారెస్ట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతుంది.

కీవ్, హంగేరియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 820 కిలోమీటర్లు ఉంది. దానిని రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే 12-13 గంటలు పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget