అన్వేషించండి

Russia Ukraine Conflict: బుకారెస్ట్‌ చేరుకున్న స్పెషల్ ఫ్లైట్స్‌, ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను తరలించేందుకు స్పెషల్ ఆపరేషన్

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌(Ukraine)లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి బుకారెస్ట్(Bucharest), హంగేరియన్(Hungarian) రాజధాని బుడాపెస్ట్‌(Budapest)కు ఎయిర్ ఇండియా విమానాలు చేరుకున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి భారత్‌లో ఒకటే టెన్షన్. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ బిడ్డలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు. అటు ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టింది. 

సరిహద్దులు దాటించి...

ఉక్రెయిన్‌లో నేరుగా విమానాలు దిగే ఛాన్స్ లేనందున సమీప దేశాల నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ వెహికల్స్ బుక్క్ చేసుకొని ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చేయాలని విద్యార్థులకు రూట్‌ మ్యాప్ ఇచ్చింది. విద్యార్థులు వెళ్లే వెహికల్స్‌కు ఇండియా జెండా పెట్టుకోవాలని సూచించింది.

ఎయిరిండియా ప్రత్యేక విమానం

ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చిన విద్యార్థుల కోసం రొమేనియా, హంగేరిలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. భారతీయుల తరలింపు కోసం ఎయిర్ ఇండియా AI-1943 ప్రత్యేక విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌లో ల్యాండ్ అయింది.ఈ ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయం నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. .

Russia Ukraine Conflict: బుకారెస్ట్‌ చేరుకున్న స్పెషల్ ఫ్లైట్స్‌, ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను తరలించేందుకు స్పెషల్ ఆపరేషన్

AI-1943 అనే విమానం ముంబై విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 3.40 గంటలకు బయలుదేరింది. ఇండియన్ టైం ప్రకారం పది గంటలకు బుకారెస్ట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 

ఉక్రెయిన్- రొమేనియాకు భారత్‌ విద్యార్థులు

భారతీయ విద్యార్థులను సరిహద్దులకు చేరుకోమని కోరిన తర్వాత, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న జాతీయులను భారత ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలాలకు చేరుస్తారని అధికారులు తెలియజేసినట్లు PTI తెలిపింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం బుకారెస్ట్, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌కు మరిన్ని ఎయిర్ ఇండియా విమానాలు నడపనుంది ప్రభుత్వం. 

రష్యాతో వివాదం కారణంగా తమ గగనతలంలో విమానాలు ఎగరడాన్ని ఉక్రెయిన్ పూర్తిగా నిషేధించింది. అందుకే విద్యార్థుల తరలింపులో జాప్యం జరిగింది. విద్యార్థులు, వారి ఫ్యామిలీ మెంబర్స్‌ ఒత్తిడి పెరిగిపోవడంతో ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లను పూర్తి చేశారు. బుకారెస్ట్, బుడాపెస్ట్ వరకు విద్యార్థులను తీసుకురావాలని ఎంబసీ అధికారులకు సూచించింది. దాదాపు 20,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు, ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని అధికారులు గుర్తించారు.

ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడానికి ముందే, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు విమానం పంపించింది. 240 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. 

దిల్లీ, ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌ 

తర్వాత పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యేక ప్రభుత్వ చార్టర్ విమానాలు నడపనున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొంది. దిల్లీ, ముంబై నుంచి బుకారెస్ట్, బుడాపెస్ట్‌కు B787 విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

ప్రస్తుతం ఉజ్హోరోడ్ సమీపంలోని చాప్-జహోనీ హంగేరియన్ సరిహద్దు, చెర్నివ్ట్సీ సమీపంలోని పోరుబ్నే-సిరెట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్లు ఉన్నాయి. అక్కడ వెరిఫై చేసి ఆయా దేశాల్లోకి పంపిస్తారు. 

జెండా, పాస్‌పోర్ట్ తప్పనిసరి

భారతీయ ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు, ఇతర అవసరమైన వస్తువులు, కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాలను సరిహద్దు చెక్‌పోస్టులకు తీసుకెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది. వాహనాలు, బస్సులపై భారత జెండా అతికించాలని తెలిపింది. 

కీవ్ , రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 600 కి.మీ . రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఎనిమిదిన్నర గంటల నుంచి 11 గంటల సమయం పడుతుంది. 

బుకారెస్ట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతుంది.

కీవ్, హంగేరియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 820 కిలోమీటర్లు ఉంది. దానిని రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే 12-13 గంటలు పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Cockroach Janta Party Jantar Mantar: ఆఫ్‌లైన్‌లో తేలిపోయిన కాక్రోచ్ జనతా పార్టీ - జంతర్ మంతర్‌లో అంతంతమాత్రంగానే నిరసన
ఆఫ్‌లైన్‌లో తేలిపోయిన కాక్రోచ్ జనతా పార్టీ - జంతర్ మంతర్‌లో అంతంతమాత్రంగానే నిరసన
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget