అన్వేషించండి

Pune Bridge Collapse: ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన, 30 మంది పర్యాటకులు గల్లంతు- 3 మృతదేహాలు వెలికితీత

పుణేలోని ఇంద్రాయని నదిపై వంతెన కూలిపోయింది. ఇంద్రియాని నదిలో 25 నుంచి 30 మంది గల్లంతయ్యారు. మూడు మృతదేహాలను వెలికితీశారు.

Pune Bridge collapse: మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రాయని నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిన సమయంలో చాలా మంది దాని మీద ఉన్నారు. దాంతో దాదాపు 25 నుంచి 30 మంది నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు.  

పుణేలోని మావల్ లోని కుండ మాల్ లో ఇనుప వంతెన కూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన జూన్ 15న మధ్యాహ్నం 3.40 గంటలకు జరిగిందని తెలుస్తోంది. వంతెన కూలిన చోట రాళ్లు కూడా ఉన్నాయి. రాళ్లపై పడిన వారికి తీవ్ర గాయాలు కాగా, పలువురు నదిలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. 

కుండమాల దాటే వంతెన కూలిపోయింది
పింప్రి-చింఛ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తలేగావ్ దాభడే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుండమాలను దాటడానికి ఒక వంతెన ఉంది, ఇక్కడ నుండి అటువైపు వెళ్లడానికి అదొక్కటే మార్గం. కానీ దురదృష్ణవశాత్తూ ఈ వంతెన కూలిపోయింది.

సెలవు కారణంగా అధిక రద్దీ
ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.  కొంతమంది ఇంద్రాయని నదిపై ఉన్న వంతెనపై నిలబడి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దాంతో పలువురు నీళ్లలో పడిపోయారు. ఎంతమంది మునిగిపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 25 నుంచి 30 మంది నీటిలో పడి కొట్టుకుపోయారు. సంఘటనా స్థలంలో దాదాపు 200 మంది పర్యాటకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత, రెస్క్యూ ఆపరేషన్లకు ఏ ఇబ్బంది కలగకుండా పర్యాటకులను అక్కడి నుంచి తరలించారు.

బైక్‌లతో వంతెనపైకి చేరుకున్న ప్రజలు
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ వంతెన వద్దకు వస్తుంటారు. సెలవు రోజుల్లో అక్కడ రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడి దేవాలయాన్ని దర్శించుకుంటారు. ప్రస్తుతం, NDRF రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఈ వంతెనపై కొంతమంది బైక్‌లతో చేరుకున్నారని తెలుస్తోంది.  ఎక్కువ బరువును మోసే సామర్థ్యం లేక వంతెన కూలిపోయింది.  

వంతెన గురించి ఫిర్యాదులు 
వంతెన కండీషన్ సరిగ్గా లేదని గతంలోనే అధికారులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వంతెన శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పుణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

సంఘటనా స్థలానికి అంబులెన్సులు
రెస్క్యూ ఆపరేషన్లు వేగవంతం చేశారు.  పర్యాటకులను రక్షించడానికి 20 వరకు అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయంత్రం కావడంతో రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేస్తున్నారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుండి పలు టీమ్స్ అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. నది ప్రవాహం దిశలో ఉన్న గ్రామాల్లోనూ వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget