అన్వేషించండి

Draupadi Murmu: 4ఏళ్ల పాపపై అత్యాచారం, రాళ్లతో కొట్టి హత్య - ఉరిశిక్ష వేసిన కోర్టు, క్షమాభిక్ష పెట్టని రాష్ట్రపతి

మహారాష్ట్రలో 2008లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి రాళ్లతో కొట్టి చంపిన కేసులో వసంత్ సంపత్ దుపారే అనే వ్యక్తి దోషిగా తేలాడు.

Draupadi Murmu Rejects Mercy Petition: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ (Mercy Petition) ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ సమాచారం ఇచ్చింది. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం అయింది. మే 3, 2017న వసంత్ సంపత్ దుపారే (అప్పటికి 55 సంవత్సరాలు) అనే వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌ (Mercy Petition) ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది కోర్టు వేసిన మరణశిక్షను సమర్థించింది. 25 జూలై 2022న దేశ 15వ రాష్ట్రపతి అయిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించిన మొదటి క్షమాభిక్ష పిటిషన్ ఇది. ఈ క్షమాభిక్ష పిటిషన్‌పై ఈ ఏడాది మార్చి 28న రాష్ట్రపతి భవన్ కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. తాజాగా రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించారు.

మహారాష్ట్రలో 2008లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి రాళ్లతో కొట్టి చంపిన కేసులో వసంత్ సంపత్ దుపారే (Vasanth Sampath Dupare) అనే వ్యక్తి దోషిగా తేలాడు. 2008లో మహారాష్ట్రలో ఓ నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైంది. వసంత దుపారే (అప్పటికి అతని వయసు 46 ఏళ్లు) అనే వ్యక్తి ఈ దారుణ హత్యాచారం చేశాడని కోర్టు తేల్చింది. చిన్నారి పక్కింట్లోనే ఉండే దుపారే.. తినుబండారాల ఆశ చూపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బండరాళ్లతో మోది హత్య చేశాడు. 

చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుపారేను అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు, అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష వేస్తూ తీర్పు ఇచ్చింది. దోషి దానిపై అప్పీలుకు వెళ్లగా ఆ శిక్షను బాంబే హైకోర్టు కూడా సమర్థించింది.

ఈ తీర్పుపై 2014లో దుపారే సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించగా అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. అతడి మరణ శిక్షను అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ 2016లో దుపారే మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే ఈ రివ్యూ పిటిషన్‌ను 2017లో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అతడు చేసిన నేరం అత్యంత హేయమైనదని అప్పట్లో కోర్టు అభిప్రాయపడింది. అతడి మరణశిక్షను మళ్లీ సమర్థించింది. దోషికి ఉరిశిక్షను సమర్థిస్తూ, మైనర్ బాలికపై అత్యాచారం చేయడం ఆమె గౌరవాన్ని క్రూరంగా పూడ్చేయడం లాంటిదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో దోషి అయిన దుపారే క్షమాభిక్ష కోరాడు. తాజాగా రాష్ట్రపతి (President Draupadi Murmu) అందుకు నిరాకరించారు.

రాష్ట్రపతి భవన్ జారీ చేసిన సమాచారం

రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) 28 ఏప్రిల్ 2023న క్షమాభిక్ష పిటిషన్ స్థితికి సంబంధించి అప్‌డేట్ చేసిన ప్రకటనలో, "రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను (ఏప్రిల్ 10న) తిరస్కరించారు" అని పేర్కొంది. 2008లో మహారాష్ట్రలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దుపారేకు విధించిన మరణశిక్షను సమర్థించినట్లు పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget