News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఇది మరో శివశక్తి పాయింట్, ఆ మహాదేవునికే అంకితం - వారణాసి క్రికెట్ స్టేడియంపై ప్రధాని వ్యాఖ్యలు

International Cricket Stadium: వారణాసిలోని అంతర్జాతీయ క్రికెట్ మైదాన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

FOLLOW US: 
Share:

International Cricket Stadium: 

శంకుస్థాపన..

ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ మైదాన నిర్మాణానికి ( international cricket stadium) శంకుస్థాపన చేశారు. ప్రధాని సొంత నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయిలో మైదానాన్ని నిర్మిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు క్రికెట్ లెజెండ్స్ రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ గవాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కేంద్రం చెబుతున్న వివరాల ప్రకారం...30 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియం నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.450 కోట్లు ఖర్చు పెడుతోంది. శివుడి స్ఫూర్తితోనే ఈ మైదానాన్ని నిర్మిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. నెలవంక ఆకారంలో రూఫ్ కవర్‌లు, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్ లైట్స్, ఘాట్‌ స్టెప్స్‌ ఆకృతిలో సీటింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 30 వేల మంది ఆడియెన్స్ కూర్చుని మ్యాచ్‌ని చూసేందుకు వీలుగా నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రకంగా మరోసారి తన సొంత నియోజకవర్గమైన వారణాసికి వచ్చే అవకాశం దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌ 3 గురించి మరోసారి ప్రస్తావించారు. భారత్ రోవర్‌ చంద్రుడిపై దిగి నెల రోజులవుతోందని గుర్తు చేశారు. 

"ఈ రకంగా వారణాసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ్టికి చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయి నెల రోజులవుతోంది. రోవర్ శివశక్తి పాయింట్‌కి చేరుకుంది. చంద్రుడిపై ఓ శివశక్తి పాయింట్‌ ఉంటే ఈ కాశీలో మరో శివశక్తి పాయింట్ సిద్ధమవుతోంది. ఈ మైదానమే శివశక్తి పాయింట్. ఈ మైదానానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు"

- ప్రధాని నరేంద్ర మోదీ

ఆ మహాదేవుని నగరంలో నిర్మించిన ఈ మైదానాన్ని ఆ శివుడికే అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మైదానం ద్వారా ఎంతో మంది క్రీడాకారులకు మేలు జరుగుతుందని అన్నారు. శంకుస్థాపన చేయడంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడారు. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగానే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఇది సాధ్యమైంని ప్రశంసించారు. యూపీలో ఇది మూడో అంతర్జాతీయ మైదానం అని చెప్పిన యోగి ఆదిత్యనాథ్, BCCI సూపర్‌విజన్‌లో కడుతున్న తొలి స్టేడియం అని స్పష్టం చేశారు. 

 

Published at : 23 Sep 2023 02:52 PM (IST) Tags: PM Modi varanasi cricket stadium international cricket stadium Varanasi International Cricket Stadium

ఇవి కూడా చూడండి

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

BJP MPs Resign: ఒకేసారి 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా, కారణం ఏంటంటే!

BJP MPs Resign: ఒకేసారి 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా, కారణం ఏంటంటే!

Pakistan-Occupied Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ మనదే - పార్లమెంట్‌లో అమిత్‌షా కీలక ప్రకటన

Pakistan-Occupied Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ మనదే - పార్లమెంట్‌లో అమిత్‌షా కీలక ప్రకటన

Cyclone Michaung Effect: ఏటా చెన్నైని వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఆ ఒక్క తప్పే ముప్పుగా మారిందా?

Cyclone Michaung Effect: ఏటా చెన్నైని వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఆ ఒక్క తప్పే ముప్పుగా మారిందా?

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

టాప్ స్టోరీస్

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Ravi Bishnoi: టీ20 నెంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్

Ravi Bishnoi: టీ20 నెంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?