అన్వేషించండి

అది మోదీ మల్టీప్లెక్స్, మరీ ఇరుగ్గా గజిబిజిగా ఉంది - కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ సెటైర్లు

New Parliament Building: కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

 New Parliament Building: 


కొత్త పార్లమెంట్ భవనంపై విమర్శలు..

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై విమర్శలు చేశారు. ఈ బిల్డింగ్‌ని పార్లమెంట్ భవనం అనే కన్నా "మోదీ మల్టీప్లెక్స్" అంటే మంచిదంటూ మండి పడ్డారు. అక్కడ అంతా ఆయన చెప్పినట్టే నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పాత పార్లమెంట్ భవనాన్ని బాగా మిస్ అవుతున్నానని, కొత్త భవనం చాలా ఇరుగ్గా ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం కావాలనే హైప్ చేసి కొత్త పార్లమెంట్‌ని నిర్మించారని, ఈ ఆర్కిటెక్చర్‌తో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఫైర్ అయ్యారు. ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టి మోదీ సర్కార్‌పై ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ సర్కార్ చాలా హడావుడి చేసింది. అనవసరంగా హైప్ చేసింది. అది కేవలం ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా కట్టుకున్న భవనం మాత్రమే. అందుకే దాన్ని పార్లమెంట్ అనడం కన్నా మోదీ మల్టీప్లెక్స్ అంటే మంచిది. నాలుగు రోజుల పాటు ఆ పార్లమెంట్‌కి వెళ్తే కానీ అర్థం కాలేదు ఎంత ఇరుగ్గా ఉందో. రెండు సభల్లోని లాబీల్లో అనవసరమైన చర్చలు జరుగుతున్నాయి. అబద్ధాలు ప్రచారమవుతున్నాయి. ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఈ విషయంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

ట్విటర్‌లో పోస్ట్..

పాత పార్లమెంట్ భవనంతో పోల్చుకుంటే...కొత్త భవనంలో హాల్స్ సౌకర్యంగా లేవని, ఒకరినొకరు చూడాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో అంటూ సెటైర్లు వేశారు జైరాం రమేశ్. సభల మధ్య నడిచేందుకు పాత భవనంలో చాలా సులువుగా ఉండేదని, ఇక్కడ మాత్రం అంతా ఇరుగ్గా ఉందని అన్నారు. 

"కొత్త పార్లమెంట్ హాల్స్‌లో ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో. ఏ మాత్రం సౌకర్యంగా లేవు. పాత పార్లమెంట్ బిల్డింగ్ ఎన్నో చరిత్రాత్మకైన చర్చలకు వేదికగా నిలిచింది. అందులో రెండు సభల మధ్య నడవడానికి ఎంతో అనువుగా ఉండేది. కొత్త బిల్డింగ్‌లో పొరపాటున దారి తప్పితే వెనక్కి వచ్చేందుకు కూడా లేదు. అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది.2024లో మోదీ ప్రభుత్వం మారాక కానీ ఈ కొత్త భవనాన్ని సరైన విధంగా వినియోగించుకునే అవకాశముండదు. అసలు ఈ బిల్డింగ్ నిర్మించేటప్పుడు సరైన విధంగా సలహాలు తీసుకోలేదని మాకు సమాచారం అందింది. అందుకే ఇలా తయారైంది. మా వాళ్లందరి అభిప్రాయం ఇదే. "

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

Also Read: జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ తొలి భేటీ, పెరుగుతున్న ఉత్కంఠ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hardik Pandya :బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
US-Canada Tariff War: ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
Embed widget