News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అది మోదీ మల్టీప్లెక్స్, మరీ ఇరుగ్గా గజిబిజిగా ఉంది - కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ సెటైర్లు

New Parliament Building: కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

FOLLOW US: 
Share:

 New Parliament Building: 


కొత్త పార్లమెంట్ భవనంపై విమర్శలు..

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై విమర్శలు చేశారు. ఈ బిల్డింగ్‌ని పార్లమెంట్ భవనం అనే కన్నా "మోదీ మల్టీప్లెక్స్" అంటే మంచిదంటూ మండి పడ్డారు. అక్కడ అంతా ఆయన చెప్పినట్టే నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పాత పార్లమెంట్ భవనాన్ని బాగా మిస్ అవుతున్నానని, కొత్త భవనం చాలా ఇరుగ్గా ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం కావాలనే హైప్ చేసి కొత్త పార్లమెంట్‌ని నిర్మించారని, ఈ ఆర్కిటెక్చర్‌తో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఫైర్ అయ్యారు. ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టి మోదీ సర్కార్‌పై ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ సర్కార్ చాలా హడావుడి చేసింది. అనవసరంగా హైప్ చేసింది. అది కేవలం ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా కట్టుకున్న భవనం మాత్రమే. అందుకే దాన్ని పార్లమెంట్ అనడం కన్నా మోదీ మల్టీప్లెక్స్ అంటే మంచిది. నాలుగు రోజుల పాటు ఆ పార్లమెంట్‌కి వెళ్తే కానీ అర్థం కాలేదు ఎంత ఇరుగ్గా ఉందో. రెండు సభల్లోని లాబీల్లో అనవసరమైన చర్చలు జరుగుతున్నాయి. అబద్ధాలు ప్రచారమవుతున్నాయి. ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఈ విషయంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

ట్విటర్‌లో పోస్ట్..

పాత పార్లమెంట్ భవనంతో పోల్చుకుంటే...కొత్త భవనంలో హాల్స్ సౌకర్యంగా లేవని, ఒకరినొకరు చూడాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో అంటూ సెటైర్లు వేశారు జైరాం రమేశ్. సభల మధ్య నడిచేందుకు పాత భవనంలో చాలా సులువుగా ఉండేదని, ఇక్కడ మాత్రం అంతా ఇరుగ్గా ఉందని అన్నారు. 

"కొత్త పార్లమెంట్ హాల్స్‌లో ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో. ఏ మాత్రం సౌకర్యంగా లేవు. పాత పార్లమెంట్ బిల్డింగ్ ఎన్నో చరిత్రాత్మకైన చర్చలకు వేదికగా నిలిచింది. అందులో రెండు సభల మధ్య నడవడానికి ఎంతో అనువుగా ఉండేది. కొత్త బిల్డింగ్‌లో పొరపాటున దారి తప్పితే వెనక్కి వచ్చేందుకు కూడా లేదు. అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది.2024లో మోదీ ప్రభుత్వం మారాక కానీ ఈ కొత్త భవనాన్ని సరైన విధంగా వినియోగించుకునే అవకాశముండదు. అసలు ఈ బిల్డింగ్ నిర్మించేటప్పుడు సరైన విధంగా సలహాలు తీసుకోలేదని మాకు సమాచారం అందింది. అందుకే ఇలా తయారైంది. మా వాళ్లందరి అభిప్రాయం ఇదే. "

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

Also Read: జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ తొలి భేటీ, పెరుగుతున్న ఉత్కంఠ

Published at : 23 Sep 2023 12:30 PM (IST) Tags: CONGRESS New Parliament Building Jairam Ramesh New Parliament  New Parliament Modi Multiplex

ఇవి కూడా చూడండి

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ

I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్‌ షేరింగ్‌పై క్లారిటీ కోసమే!

I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్‌ షేరింగ్‌పై క్లారిటీ కోసమే!

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

హైవేపై ఘోర ప్రమాదం, ట్రక్‌ని ఢీకొట్టిన కార్‌లో మంటలు - ఓ చిన్నారి సహా 8 మంది ఆహుతి

హైవేపై ఘోర ప్రమాదం, ట్రక్‌ని ఢీకొట్టిన కార్‌లో మంటలు - ఓ చిన్నారి సహా 8 మంది ఆహుతి

టాప్ స్టోరీస్

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి