అన్వేషించండి

వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తున్నా- కలలన్నీ నెరవేరుస్తా: మోదీ

వచ్చే ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని... వచ్చే ఆగస్టు 15న తానే ఎర్రకోట నుంచి ప్రసంగిస్తానంటూ మోదీ చెప్పారు.

ఎర్రకోటపై ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మీ ముందుక వస్తానని అన్నారు. 2014లో మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. దేశప్రజలంతా నన్ను నమ్మారు. నేను మీకు ఇచ్చిన మాటను నమ్మకంగా మార్చుకున్నాను. చేసిన మంచి పనులకు  2019లో మద్దతుగా నిలిచారు. మళ్లీ నన్ను ఆశీర్వదించారు. నాకు మరో అవకాశం ఇచ్చారు. నీ కలలన్నీ నెరవేరుస్తాను. మళ్లీ ఆగస్టు 15న వస్తాను. నీ కోసమే బతుకుతున్నాను. మీరు నా కుటుంబం అందుకే మీ కోసం చెమటలు చిందిస్తాను. 

90 నిమిషాలకుపైగా సాగిన ప్రసంగంలో స్వాతంత్య్ర సమరయోధుల గురించి, మణిపూర్ గురించి ప్రస్తావించారు మోదీ. ప్రభుత్వ విజయాలను వివరించారు. కొత్త ప్రపంచంలో భారతదేశం పాత్రపై అభిప్రాయాలు వ్యక్తం చేసారు. రాజకీయ ప్రత్యర్థులను కూడా టార్గెట్ చేశారు. 

వచ్చేసారి ఆగస్టు 15న ఈ ఎర్రకోట నుంచి దేశం సాధించిన విజయాలను, సాధించబోయే విజయాలను మీకు వివరిస్తాను అన్నారు. నేను మీ నుంచి వచ్చాను, మీ కోసం జీవిస్తున్నాను. మీ కోసమే నేను కలలు కంటున్నా మీ కోసం చెమటలు చిందిస్తాను. మీరు నాకు ఈ బాధ్యత ఇచ్చారనే కాదు మీరు నా కుటుంబం అనినేను ఇలా చేస్తున్నాను. మీరు బాధపడుతుంటే చూడలేను అని అన్నారు. 

2014లో మార్పు తెస్తానని హామీ ఇచ్చానన్న మోదీ 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు, మీరు నన్ను నమ్మారని, ఆ నమ్మకాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించానని చెప్పారు.

దేశం కోసం ఎంతో కష్టపడ్డారని, గర్వించదగ్గ పని చేశారన్నారు. మాకు దేశమే ప్రథమం, దేశమే సర్వోన్నతం. 2019లో మీరంతా మార్పు ప్రాతిపదికన మమ్మల్ని మరోసారి ఆశీర్వదించారు. ఆ ప్రదర్శన నన్ను మరింత ప్రోత్సహించిందన్నారు. 

రాబోయే ఐదేళ్లలో అపూర్వమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చేసారి ఆగస్టు 15న దేశం సాధించిన విజయాలు, మీ బలాలు, మీ తీర్మానాలు, సాధించిన పురోగతి, దాని విజయం, దాని వైభవం, మరింత ఆత్మవిశ్వాసం గురించి ప్రస్తావిస్తాను. 

ఎర్రకోట నుంచి మీ సాయం కోరేందుకు వచ్చానని, మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా భారత త్రివర్ణ పతాకం ప్రపంచంలో అభివృద్ధి చెందిన భారతదేశానికి త్రివర్ణ పతాకంగా నిలవాలి.

వచ్చే ఆగస్టు 15 నాడు తానే ఎర్రకోటపై జెండాను ఎగరేస్తానని మోదీ చెప్పడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోడీ వచ్చే ఏడాది ఎర్రకోటపై కాకుండా తన ఇంట్లో జెండా ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 

తన 90 నిమిషాల ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునలను ప్రారంభిస్తానని చెప్పారు. దీనిపై కూడా ఖర్గే స్పందిస్తూ.. వచ్చే ఏడాది తన ఇంట్లోనే జెండా ఎగురవేస్తానని చెప్పారు. ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు. అక్కడ ఆయన కుర్చీ ఖాళీగా ఉంది. ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా మల్లికార్జున ఖర్గే తనకు ఆరోగ్యం బాగాలేదని అయితే తన కార్యాలయంలో జెండా ఎగురవేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ గత ప్రభుత్వాలను టార్గెట్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ అవినీతి భూతాలు దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. 140 కోట్ల మంది దేశప్రజల కృషి ఫలించిందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో అవినీతి రాక్షసుడు దేశాన్ని వెంటాడేవాడు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. అలాంటి వాటిని అరికట్టి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాం. పేదల సంక్షేమం కోసం వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ప్రయత్నించాం. అని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
India vs Australia:నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాల్గో టీ20 మ్యాచ్ జరుగుతుందా? లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ చూడవచ్చు?
నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాల్గో టీ20 మ్యాచ్ జరుగుతుందా? లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ చూడవచ్చు?
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Bihar Assembly Elections 2025:ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు  ఏంటీ?
ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు ఏంటీ?
Best Car Under 10 Lakh: డైలీ డ్రైవ్‌ కోసం ₹8-10 లక్షల్లో బెస్ట్‌ మిడ్‌-సైజ్‌ హ్యాచ్‌బ్యాక్‌ కావాలా? - ఈ కారు మీకు సరైన ఎంపిక!
డైలీ 50 Km డ్రైవ్‌ కోసం సూపర్‌ మైలేజ్‌ ఇచ్చే మిడ్‌-సైజ్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఇదే, ₹8–10 లక్షల బడ్జెట్‌లోనే!
Embed widget