అన్వేషించండి

Ola Uber Customer Complaints: ఓలా, ఉబర్‌ క్యాబ్‌లకు కేంద్రం షాక్- కఠిన చర్యలు తప్పవని వార్నింగ్!

Ola Uber Customer Complaints: ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Ola Uber Customer Complaints: ఓలా, ఉబర్ సహా పలు క్యాబ్ సంస్థలపై కేంద్రం సీరియస్ అయింది. క్యాబ్ సంస్థలు ఎడాపెడా దోచేస్తున్నాయని.. పీక్ అవర్స్, ఏసీ ఆన్‌ చేస్తే డబ్బులంటూ ప్రయాణికులను పీల్చి పిప్పి చేస్తున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

కఠిన చర్యలు

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలైన ఓలా, ఉబెర్‌, జుగ్నూ, మేరు సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్‌ ప్రైసింగ్‌ అల్గారిథమ్‌, డ్రైవర్స్‌, పేమెంట్స్‌ స్ట్రక్చర్స్‌ వివరాల్ని వెంటనే అందించాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వచ్చాయి. కస‍్టమర్లకు తలెత్తున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్రం ఈ సమావేశంలో హెచ్చరించింది. 

అదనపు ఛార్జీలు

గత నెలలో లోకల్‌ సర్కిల్‌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 ఉన్నప్పటికీ డ్రైవర్‌లు ఇష్టం వచ్చినట్లు రైడ్ క్యాన్సిలేషన్ చేస్తున్నారని, అందుకు అదనంగా తమ వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు 71 శాతం మంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా ఏదైనా అర్జెంట్ పని ఉండి క్యాబ్ బుక్ చేస్తుంటే.. చాలా మంది డ్రైవర్‌లు రైడ్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రికి, ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు దీని వల్ల నష్టపోతున్నట్లు కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై క్యాబ్ సంస్థలు దృష్టి పెట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

దోచెయ్ దోచెయ్

డిమాండ్‌ పేరుతో క్యాబ్‌ సంస్థలు రెచ్చిపోతున్నాయి. అత్యవసరంగా పనిపై బయటికెళ్లాలంటే మండే ఎండలకు భయపడి ఏసీ ఆన్‌ చేస్తే చార్జీల మోత మోగిస్తున్నాయి. పీక్ అవర్సే కాదు..సాధారణ సమయాల్లో సైతం అదనంగా  వసూలు చేస్తున్నారని ప్రయాణికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా, అందుబాటు ధరల్లో ఉన్న క్యాబ్‌లు ఇప్పుడు అదే కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి.

Also Read: Sedition Law: రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు స్టే- అప్పటివరకు నో FIR!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,897 మందికి కరోనా- 54 మంది మృతి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
First Pan India Movie: సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డు... రజనీ, నాగార్జున హీరోలు... ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?
సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డు... రజనీ, నాగార్జున హీరోలు... ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?
Telugu Serial Actress: గుడ్ న్యూస్ షేర్ చేసిన పద్మిని, అజయ్... పండంటి బిడ్డకు జన్మ ఇచ్చిన వైదేహి పరిణయం సీరియల్ నటి
గుడ్ న్యూస్ షేర్ చేసిన పద్మిని, అజయ్... పండంటి బిడ్డకు జన్మ ఇచ్చిన వైదేహి పరిణయం సీరియల్ నటి
Ban On Medicine: పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, బరిలో నిలిచేది ఎవరో..
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, బరిలో నిలిచేది ఎవరో..
Embed widget