అన్వేషించండి

Poverty Index 2023: దేశంలో భారీగా తగ్గిన పేదరికం - నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఏపీ తెలంగాణ ప్లేస్‌ ఏంటీ?

Poverty Index 2023: ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.

Poverty Index News: దేశంలో పేదరికం తగ్గినట్టు నీతిఆయోగ్‌ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌-ఎ ప్రోగ్రెసివ్‌ రివ్యూ -2023పేరుతో విడుదల చేసిన ఆ నివేదికలో కీలకాంశాలను ప్రస్తావించింది. ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతోపాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, బడికి వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర 12 అంశాలనే కొలమానంగా ఈ నివేదికను రూపొందించింది. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ 12 అంశాలను ఆధారంగా చేసుకొని పరిస్థితులను స్టడీ చేసింది. అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలు ఆధారంగా 2015-16 నుంచి 2019-21 మధ్య పేదరికం భారీగా తగ్గినట్టు చెబుతోంది నీతి ఆయోగ్‌. అప్పట్లో 24.85 శాతం పేదరికం ఉంటే ఇప్పుడు అది 14.96కి తగ్గినట్టు పేర్కొంది. ఈ రేస్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ముందంజలో ఉన్నాయి. 
 
నీతి ఆయోగ్ విడుదల చేసిన పేదరికం తగ్గుదల నివేదికలో ఏపీ 13వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. సగుటున చూసుకుంటే మాత్రం ఏపీ 17వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలోనే కొనసాగుతోంది. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 5.71 శాతం పేదరికం తగ్గింది. తెలంగాణలో 7.30 శాతం మంది విముక్తి పొందారు. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగానే ఇది సాధ్యమైందని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతోంది. 2015-16లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4తోపాటు 2019-21లో నిర్వహించిన 5వ సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ నివేదికను రూపొందించారు.   
Poverty Index 2023: దేశంలో భారీగా తగ్గిన పేదరికం - నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఏపీ తెలంగాణ ప్లేస్‌ ఏంటీ?


Poverty Index 2023: దేశంలో భారీగా తగ్గిన పేదరికం - నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఏపీ తెలంగాణ ప్లేస్‌ ఏంటీ?

2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలన్న లక్ష్యంతో..!

ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ ఘనతను 2016-21 మధ్య కాలంలో సాధించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 2015-16లో 24.85 శాతం ఉందని తెలిపింది. అలాగే 2019-21లో 14.96 శాతానికి తగ్గిందని.. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను ప్రజలు అందుకునే శక్తిని బట్టి పేదరికాన్ని లెక్కిస్తారు. గ్రామాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి తగ్గిందన్నారు. పట్టణాల్లో 8.65 శాతం నుంచి 5.27కు తగ్గింది. 2030 నాటికి దేశంలో పేదరికాన్ని సగానికి తగ్గించాలన్న లక్ష్యం దిశగా దూసుకెళ్తుందని తెలుస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget