అన్వేషించండి

Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!

Money Laundering Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తరువాత అరెస్ట్ అయ్యేది సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ అంటోంది.

ED Arrests Sanjay Singh In Money Laundering Case:

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తరువాత అరెస్ట్ అయ్యేది సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అని ఢిల్లీ బీజేపీ అంటోంది. లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్ట్ చేసింది. సంజయ్ సింగ్ అరెస్ట్ తరువాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. తరువాత అరెస్ట్ అయ్యేది సీఎం కేజ్రీవాల్ అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే నిజం దాచినా దాగదని, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదన్నారు. సంజయ్ సింగ్ తరువాత జైలుకు వెళ్లే నేత కేజ్రీవాల్ అనడంలో సందేహం లేదన్నారు. 

ఈడీ అధికారులు బుధవారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలో సాయంత్రం ఈడీ అధికారులు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తర్వాత అరెస్టయిన మూడో ఆప్ నేత సంజయ్ సింగ్. బీజేపీ  ఎంపీ మనోజ్ తివారీ సైతం సీఎం కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతిలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, త్వరలోనే ఆయన సైతం భారీ మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. ఆప్ నేతలు లెటర్స్ రాయడం చూస్తే, వారు నిజాయితీపరులు కాదని తెలుస్తోందని కీలకవ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సహ నిందితులు అప్రూవర్లుగా మారారు. సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలతోనే అరెస్టులు ఆగవని, ఆప్ అధినేత కేజ్రీవాల్ హస్తం ఉందని త్వరలోనే తేలుతుందని విమర్శించారు.

ఢిల్లీ మద్యం పాలసీ క్లైమాక్స్ కు చేరుకుందని, అందుకు సంజయ్ సింగ్ అరెస్ట్ కావడం.. త్వరలోనే కేజ్రీవాల్ ఈ అవినీతి సెగలు తాకుతాయన్నారు. అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్ ఈ కేసు నుంచి బయట పడటం అంత ఈజీ కాదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలా...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని, ఆప్ నేతలు ప్రజా ధనాన్ని దోచుకున్నారని బీజేపీ నేతలు 15 నెలల నుంచి ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈడీ, సీబీఐ ఇప్పటివరకూ 1000 చోట్ల సోదాలు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలకు ఆప్ నేతల వద్ద ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు. బీజేపీ నేతలు ఓటమి భయంతోనే దర్యాప్తు సంస్థలను ఆప్ నేతలపై ప్రయోగిస్తున్నారని రాఘవ్ చద్దా ఆరోపించారు. తాజాగా సంజయ్ సింగ్ ఇంటిపై ఆకస్మిక దాడులు చేసి ఆయనను ఈడీ అరెస్ట్ చేయడం ఇందుకు నిదర్శనం అన్నారు.

సీబీఐ ఛార్జ్‌షీట్ ప్రకారం... గతేడాది అక్టోబర్ 1వ తేదీన దినేష్ అరోరా ఈ కేసులో అప్రూవర్‌గా మారాడు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్టు సీబీఐకి చెప్పాడు. సంజయ్ సింగ్‌ ద్వారానే మనీశ్ సిసోడియాని కలిసినట్టు వివరించాడు. సంజయ్ సింగ్ సలహాతోనే రెస్టారెంట్‌ ఓనర్‌లతో మాట్లాడి రూ.82 లక్షల చెక్‌లు కలెక్ట్ చేసినట్టు చెప్పాడు. ఆ డబ్బులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు తెలిపాడు. ఈ డబ్బంతా మనీశ్ సిసోడియాకి ఇచ్చినట్టు అంగీకరించాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget