అన్వేషించండి

Artificial Intelligence: వచ్చే కాల‌మంతా కృత్రిమ మేధస్సుదే, నాస్‌కామ్ సంచలన రిపోర్ట్‌

కృత్రిమ మేథ‌.. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌పంచవ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. అనేక రంగాల్లో దీని ప్ర‌వేశంపై సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రో మూడేళ్ల‌లోమ‌న దేశంలో ఇది మ‌రింత విస్త‌రించ‌నుంది. మ‌రి దీనివ‌ల్ల లాభాలేంటి?

Artificial Intelligence: కృత్రిమ మేథ‌.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(AI).. దీని ప్ర‌భావం ప్ర‌పంచంపై బాగానే ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే.. ప్ర‌వేశిస్తున్న ఈ అత్యంత అధునాత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రవేశించింది. రాబోయే కాలమంతా దీనిదే అంటున్నాయి సర్వేసంస్థలు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భార‌త్(India) వంటి వాటిలో రానున్న మూడేళ్ల కాలంలో అంటే 2027 నాటికి భారీగా వృద్ధి చెందుతుంద‌ని నాస్‌కామ్(Naascom) అంచ‌నా వేసింది. సాధార‌ణంగా కృత్రిమ మేథ అంటే.. ఇటీవ‌ల కాలంలోకొంత ఆందోళ‌న‌లు చోటు చేసుకున్నాయి. దీనివ‌ల్ల ఊడిపోతున్న ఉద్యోగాలు స‌హా.. మ‌నిషి క‌న్నా.. 100 రెట్లు ఎక్కువ‌గా ఆలోచ‌న చేస్తుంద‌ని.. ఫ‌లితంగా ఇది చెడుకు దారితీస్తుంద‌ని మేధావులు సైతం చెప్పుకొచ్చారు. అయితే.. ఏ వ్య‌వ‌స్థ‌లో అయినా.. మంచి, చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు కృత్రిమ మేథ‌లోనూ ఈ రెండు ఉన్నాయ‌నే చెబుతున్నారు. 

నాస్‌కామ్ నివేదిక ఏమందంటే..

కృత్రిమ మేధ (AI) ఆధారిత సేవల మార్కెట్ భార‌త్‌(India) ఏటా 25-35% వృద్ధిని సాధిస్తుందని నాస్‌కామ్ త‌న నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 2027 నాటికి ఏఐ మార్కెట్‌(AI market)  దేశీయంగా 17 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.41 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని వివరించింది. టెక్నాలజీకి (Technology) బడ్జెట్‌ (Budget) కేటాయింపులు పెరగడం, మానవ వనరుల లభ్యత, ఏఐ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంద‌ని  విశ్లేషించింది. ‘ఏఐ పవర్డ్‌ టెక్‌ సర్వీసెస్‌’(AI powered Tech Services) పేరుతో ఈ నివేదికను కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన బీసీజీతో కలిసి నాస్‌కామ్‌ ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రంగంలోకి పెట్టుబడులు ఏటా 24% పెరుగుతున్నాయి. 2023లో 83 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.89 లక్షల కోట్ల) పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించింది. ప్రధానంగా డేటా అనలిటిక్స్‌, జెన్‌ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, ఆల్గోరిధమ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ విభాగాల్లోకి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయి.

భార‌త్‌లో.. 

మనదేశంలో ఐటీ కంపెనీలు డిజిటల్‌ కంటెంట్‌(Digital content), డేటా అనలిటిక్స్‌(Data analatics), సప్లై చైన్‌(Supply chain) రంగాలకు నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం ఏఐని వినియోగించడమే కాదు.. తమ సేవల తీరును సరికొత్తగా మారుస్తున్నాయి. మన దేశంలో 4.2 లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారు. ఏటా ఈ నిపుణుల సంఖ్య పెరుగుతోంది. ఈ విష‌యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి-5 దేశాల జాబితాలో మనదేశం ఒకటి. ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నందున, ఏఐ నిపుణుల అవసరాలు పెరుగుతాయని నాస్‌కామ్ వెల్ల‌డించింది. నిపుణుల సంఖ్య ఏటా 15% పెరగాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. దీన్ని పరిగణనలోకి తీసుకునే, ఐటీ కంపెనీలు తమ సిబ్బందిలో ఏఐ నైపుణ్యాలు పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు వచ్చే మూడేళ్లలో బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల)కు పైగా నిధులు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నాయి.

జాగ్ర‌త్త‌లు కీల‌కం..

ఏఐ(AI) పరిజ్ఞానంతో ఐటీ కంపెనీలు తమ వినియోగదార్లకు కొత్త సేవలు ఆవిష్కరించడంతో పాటు అదనపు విలువను జోడించగలుగుతున్నాయని నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌ దేబ్‌జానీ ఘోష్‌ వివరించారు. ఏఐ వినియోగంలో భద్రత, నైతిక విలువలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. లేక‌పోతే.. మంచి క‌న్నా.. చెడుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌నే హెచ్చ‌రిక‌లు కూడా వ‌స్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
PM Modi On NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై మోదీ సంచలన నిర్ణయం, దోషులకు వెంటనే శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశం!
నీట్ పేపర్ లీక్‌పై మోదీ సంచలన నిర్ణయం, దోషులకు వెంటనే శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
Embed widget