అన్వేషించండి

Artificial Intelligence: వచ్చే కాల‌మంతా కృత్రిమ మేధస్సుదే, నాస్‌కామ్ సంచలన రిపోర్ట్‌

కృత్రిమ మేథ‌.. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌పంచవ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. అనేక రంగాల్లో దీని ప్ర‌వేశంపై సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రో మూడేళ్ల‌లోమ‌న దేశంలో ఇది మ‌రింత విస్త‌రించ‌నుంది. మ‌రి దీనివ‌ల్ల లాభాలేంటి?

Artificial Intelligence: కృత్రిమ మేథ‌.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(AI).. దీని ప్ర‌భావం ప్ర‌పంచంపై బాగానే ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే.. ప్ర‌వేశిస్తున్న ఈ అత్యంత అధునాత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రవేశించింది. రాబోయే కాలమంతా దీనిదే అంటున్నాయి సర్వేసంస్థలు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భార‌త్(India) వంటి వాటిలో రానున్న మూడేళ్ల కాలంలో అంటే 2027 నాటికి భారీగా వృద్ధి చెందుతుంద‌ని నాస్‌కామ్(Naascom) అంచ‌నా వేసింది. సాధార‌ణంగా కృత్రిమ మేథ అంటే.. ఇటీవ‌ల కాలంలోకొంత ఆందోళ‌న‌లు చోటు చేసుకున్నాయి. దీనివ‌ల్ల ఊడిపోతున్న ఉద్యోగాలు స‌హా.. మ‌నిషి క‌న్నా.. 100 రెట్లు ఎక్కువ‌గా ఆలోచ‌న చేస్తుంద‌ని.. ఫ‌లితంగా ఇది చెడుకు దారితీస్తుంద‌ని మేధావులు సైతం చెప్పుకొచ్చారు. అయితే.. ఏ వ్య‌వ‌స్థ‌లో అయినా.. మంచి, చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు కృత్రిమ మేథ‌లోనూ ఈ రెండు ఉన్నాయ‌నే చెబుతున్నారు. 

నాస్‌కామ్ నివేదిక ఏమందంటే..

కృత్రిమ మేధ (AI) ఆధారిత సేవల మార్కెట్ భార‌త్‌(India) ఏటా 25-35% వృద్ధిని సాధిస్తుందని నాస్‌కామ్ త‌న నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 2027 నాటికి ఏఐ మార్కెట్‌(AI market)  దేశీయంగా 17 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.41 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని వివరించింది. టెక్నాలజీకి (Technology) బడ్జెట్‌ (Budget) కేటాయింపులు పెరగడం, మానవ వనరుల లభ్యత, ఏఐ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంద‌ని  విశ్లేషించింది. ‘ఏఐ పవర్డ్‌ టెక్‌ సర్వీసెస్‌’(AI powered Tech Services) పేరుతో ఈ నివేదికను కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన బీసీజీతో కలిసి నాస్‌కామ్‌ ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రంగంలోకి పెట్టుబడులు ఏటా 24% పెరుగుతున్నాయి. 2023లో 83 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.89 లక్షల కోట్ల) పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించింది. ప్రధానంగా డేటా అనలిటిక్స్‌, జెన్‌ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, ఆల్గోరిధమ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ విభాగాల్లోకి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయి.

భార‌త్‌లో.. 

మనదేశంలో ఐటీ కంపెనీలు డిజిటల్‌ కంటెంట్‌(Digital content), డేటా అనలిటిక్స్‌(Data analatics), సప్లై చైన్‌(Supply chain) రంగాలకు నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం ఏఐని వినియోగించడమే కాదు.. తమ సేవల తీరును సరికొత్తగా మారుస్తున్నాయి. మన దేశంలో 4.2 లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారు. ఏటా ఈ నిపుణుల సంఖ్య పెరుగుతోంది. ఈ విష‌యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి-5 దేశాల జాబితాలో మనదేశం ఒకటి. ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నందున, ఏఐ నిపుణుల అవసరాలు పెరుగుతాయని నాస్‌కామ్ వెల్ల‌డించింది. నిపుణుల సంఖ్య ఏటా 15% పెరగాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. దీన్ని పరిగణనలోకి తీసుకునే, ఐటీ కంపెనీలు తమ సిబ్బందిలో ఏఐ నైపుణ్యాలు పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు వచ్చే మూడేళ్లలో బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల)కు పైగా నిధులు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నాయి.

జాగ్ర‌త్త‌లు కీల‌కం..

ఏఐ(AI) పరిజ్ఞానంతో ఐటీ కంపెనీలు తమ వినియోగదార్లకు కొత్త సేవలు ఆవిష్కరించడంతో పాటు అదనపు విలువను జోడించగలుగుతున్నాయని నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌ దేబ్‌జానీ ఘోష్‌ వివరించారు. ఏఐ వినియోగంలో భద్రత, నైతిక విలువలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. లేక‌పోతే.. మంచి క‌న్నా.. చెడుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌నే హెచ్చ‌రిక‌లు కూడా వ‌స్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget