అన్వేషించండి

Manipur Violence: అమిత్‌షా వార్నింగ్ ఎఫెక్ట్, ఇప్పటివరకు 140 ఆయుధాలు అప్పగించిన నిరసనకారులు

Manipur Violence: ఆయుధాలు సరెండర్ చేయాలని నిరసనకారులకు అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు 140 ఆయుధాలను అప్పగించారు.

Manipur Violence: కేంద్ర భద్రతా బలగాల నుండి ఆయుధాలు దొంగలించిన వారు వెంటనే వాటిని తిరిగి ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ ఫలితాన్నిస్తోంది. ఆయుధాలు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా.. అమిత్ షా హెచ్చరికలు ఫలితాన్ని ఇచ్చాయి. మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 140కి పైగా ఆయుధాలను సరెండర్ చేశారని మణిపూర్ పోలీసులు తాజాగా ప్రకటించారు. అమిత్ షా హెచ్చరికల మేరకు ఆయుధాలను అప్పగించారని తెలిపారు. SLR 29, కార్బైన్, AK, INSAS రైఫిల్, INSAS LMG, .303 రైఫిల్, 9mm పిస్టల్, .32 పిస్టల్, గ్రెనేడ్ లాంచర్ సహా పలు ఆయుధాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినట్లు వెల్లడించారు. 

రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో కమిటీ..

మే 3వ తేదీ నుంచి మణిపూర్‌ అట్టుడుకుతోంది. గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రం పోలీసులు, భద్రతా బలగాల నిఘాలో ఉంది. ఎక్కడా మళ్లీ అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మణిపూర్ పర్యటనకు వెళ్లి అక్కడి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. పరిస్థితులు సమీక్షించారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గవర్నర్ నేతృత్వంలోనూ మరో కమిటీ ఏర్పాటు కానుంది. ఇదే విషయాన్ని అమిత్‌షా అధికారికంగా వెల్లడించారు. 

Also Read: Rahul Gandhi: 2 ఎఫ్ఐఆర్ లలో 15 లైంగిక వేధింపుల ఆరోపణలు, మోదీ రక్షణ కవచంలో బీజేపీ ఎంపీ- రాహుల్ ఫైర్

"గత నెల మణిపూర్‌లో అల్లర్లు జరిగాయి. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మణిపూర్‌లో మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటించాను. అధికారులతో భేటీ అయ్యాను. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఏం చేయాలో పరిశీలించాను. మైతేయ్, కుకీ వర్గాలకు చెందిన నేతలనూ కలిశాను. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ అవసరం. అందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. గవర్నర్‌ నేతృత్వంలో మరో కమిటీ కూడా ఏర్పాటవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. ఎవరు ఈ కుట్ర చేశారన్నది వాళ్లు త్వరలోనే ఛేదిస్తారు. పారదర్శకంగా విచారణ జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ప్రజలంతా ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరి వద్దనైనా ఆయుధాలుంటే వెంటనే వాటిని పోలీసులకు అప్పగించండి" అని అమిత్ షా గురువారం రోజు కోరారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget