అన్వేషించండి

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!

LPG Subsidy New Rules: వార్షిక ఆదాయం పది లక్షలు దాటిన పన్ను చెల్లింపుదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతోంది. వారికి ఎల్పీజీ సబ్సిడీ శాశ్వతంగా నిలిపివేసేందుకు చర్యలు చేపట్టింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పది లక్షల వార్షిక ఆదాయం దాటితే ఎల్పీజీ సబ్సిడీ రద్దు.
  • ఆదాయపు పన్ను రికార్డులతో చమురు సంస్థల అనుసంధానం.
  • అర్హులైన వారికే గ్యాస్ సబ్సిడీ కొనసాగింపు.
  • సబ్సిడీ నిలిపేస్తే మార్కెట్ ధరకే సిలిండర్లు కొనాలి.

LPG Subsidy New Rules: భారత్‌లో ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, చమురు విక్రయ సంస్థలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. మీరు గ్యాస్ సబ్సిడీ పొందుతున్నట్టు అయితే వెంటనే మీ మొబైల్‌ ఫోన్‌ మెసేజ్‌లను ఒకసారి చెక్ చేసుకోండి. వార్షిక ఆదాయం పది లక్షల పరిమితిని దాటిన వారిని గుర్తించి, వారి సబ్సిడీ తొలగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వం రంగ చమురు సంస్థలు ఇప్పుడు వినియోగదారుల డేటాను ఆదాయపు పన్ను విభాగం రికార్డులతో నేరుగా అనుసంధానిస్తున్నాయి. ఈ ఆటోమేటెడ్‌ డేటా మ్యాచింగ్ ప్రక్రియ ద్వారా, ఏ కుటుంబాల వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పది లక్షల కంటే ఎక్కువగా ఉందో వారిని గుర్తిస్తున్నారు. 

గతంలో సబ్సిడీని వదులుకోవాలని కోరుతూ గివ్‌ ఇట్‌ అప్‌ వంటి స్వచ్ఛంద ప్రచారాలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రూల్స్ అమలులో కఠినంగా వ్యవహరిస్తోంది. అర్హత లేని వారు సబ్సిడీ పొందకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ నిబంధన కేవలం గ్యాస్‌ కనెక్షన్ కలిగిన వ్యక్తి ఆదాయంపైనే కాకుండా, ఆ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయంపై కూడా ఆధారపడి ఉంటుంది. సదరు వినియోగదారుడి వార్షిక ఆదాయం పది లక్షలు దాటినా, గ్యాస్‌ కనెక్షన్‌తో లింక్ అయి ఉన్న భార్య, లేదా భర్త వంటి కుటుంబ సభ్యుల ఆదాయం పది లక్షల పరిమితిని మించినా సబ్సిడీ నిలిపేస్తారు. 

గత ఆర్థిక సంవత్సరంలో మీ స్థూల పన్ను పరిధిలోకి వచ్చే ాదాయం ఈ పరిమితిని దాటినట్టు ఐటీ రికార్డుల్లో ఉంటే మీరు అనర్హులుగా మారిపోతారు. 

ఏడు రోజుల గడవు 

రికార్డులతో మ్యాచ్ అయిన వినియోగదారులకు చమురు సంస్థల నుంచి అధికారిక ఎస్‌ఎంఎస్ వస్తుంది. అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను రికార్డుల ప్రకారం మీ లేదా మీ కుటుంబ సభ్యుడి ఆదాయం పది లక్షల పరిమితిని మించింది. నిర్ణీత సమయంలోగా స్పందించకుంటే సబ్సిడీ నిలిపోతుంది. అని ఆ మెసేజ్ సారాంశం. 

మీకు ఈ మెసేజ్ వచ్చినట్టు అయితే కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఒక వేళ ప్రభుత్వ రికార్డుల్లో తప్పు ఉందని, మీరు భావిస్తే వెంటనే సంబంధిత చమురు సంస్థ డిజిటల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు జాతీయ టోల్ ఫ్రీ నెంబర్‌ 1800-2333-555కు కాల్ చేసి తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. 

ఒకవేళ మీరు నిర్ణీత సమయంలోపు స్పందించకపోతే, పహల్ పథకం కింద మీ ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలో జమ అయ్యే సబ్సిడీ శాశ్వతంగా నిలిపేస్తారు. అటువంటి వినియోగదారులు భవిష్యత్‌లో మార్కెట్ ధరకే సిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

ఎప్పటి నుంచి అమల్లో ఉంది? 

గ్యాస్ సబ్సిడీపై పది లక్షల ఆదాయ పరిమితిని ప్రభుత్వం తొలిసారిగా డిసెంబర్‌ 2015లో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో ఇది స్వచ్ఛందంగా ఉండేది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తున్న తరుణంలో మే 11న వడోదరలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విలువై విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన కోరారు. ప్రజా రవాణా వాడటం, కార్ పూలింగ్‌ చేయడం, సాధ్యమైనంత వరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పని చేయాలని సూచించారు.

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

వార్షిక ఆదాయం ఎంత మించితే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది?

మీ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు మించితే లేదా మీ కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది.

ఆదాయపు పన్ను రికార్డులతో గ్యాస్ కనెక్షన్ డేటాను ఎందుకు అనుసంధానిస్తున్నారు?

అర్హత లేని వినియోగదారులకు సబ్సిడీ అందకుండా నిరోధించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు.

సబ్సిడీ నిలిపివేతపై సందేశం వస్తే ఏం చేయాలి?

మీ ఆదాయం గురించి మీకు ఏమైనా సందేహాలుంటే, వెంటనే చమురు సంస్థ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-2333-555 కి కాల్ చేయవచ్చు.

సబ్సిడీ ఆగిపోతే భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్లను ఎలా కొనుగోలు చేయాలి?

సబ్సిడీ నిలిచిపోయిన వినియోగదారులు భవిష్యత్తులో మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget