అన్వేషించండి

Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు

RahulGandhi Speech: లోక్ సభలో రాహుల్ గాంధీ తొలి ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలపగా.. స్పీకర్ ఆదేశాలతో కొన్ని అంశాలను రికార్డుల నుంచి తొలగించారు.

Loksabha Speaker Expunged Some Portion In Rahul Speech From Records: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం లోక్ సభలో చేసిన ప్రసంగంపై తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష నేతగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అగ్నివీర్, మైనార్టీ వంటి అంశాలపై ఘాటుగా స్పందించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. స్పీకర్ ఓంబిర్లా (Loksabha Speaker Ombirla) చర్యలు చేపట్టారు. సభాపతి ఆదేశాల మేరకు రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలిగించినట్లు లోక్ సభ సెక్రటేరియట్ తెలిపింది. రాహుల్ హిందూ మతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సహా ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు పేర్కొంది.

రాహుల్ ఏమన్నారంటే.?

కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా ప్రసంగించారు. దాదాపు గంట 40 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. ఈ క్రమంలో శివుడి ఫోటోను చూపించడంతో.. స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఫోటోలు, ప్లకార్డులు ప్రదర్శించడం నిషేధమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని.. హిందూమతం పేరు చెప్పి అందరినీ భయపెడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇస్లాం, సిక్కు మతాల గురించి కూడా ప్రస్తావించారు. కొంతమంది తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని.. అలాంటి వారు అసలు హిందువులే కారని విమర్శించారు. కాగా, రాహుల్ ప్రసంగం సాగుతున్నంత సేపు, కేంద్ర మంత్రులు, అధికార పక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సైతం రెండుసార్లు రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుని ఆయన వ్యాఖ్యలను ఖండించారు. హిందువులంతా హింసావాదులే అన్నట్టుగా రాహుల్ మాట్లాడడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి గానూ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.

'కేసులు పెట్టి ఇల్లు లాక్కున్నారు'

అధికార పక్ష సభ్యలు అభ్యంతరం చెబుతున్నా రాహుల్ వెనక్క తగ్గకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని విమర్శించారు. తనపై 20కి పైగా కేసులు పెట్టారని.. తన ఇల్లు కూడా లాక్కున్నారని మండిపడ్డారు. ఈడీ తనను 55 గంటల పాటు విచారించిందని.. కేంద్రం దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని.. రైతులకు మద్దతు ధర కల్పించకుండా 700 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నారని అన్నారు. అగ్నివీర్‌పైనా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయగా స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.

రాహుల్ స్పందన ఇదే

కాగా, తన ప్రసంగంలోని కొన్ని అంశాలు తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను నిజాలే మాట్లాడానని.. సత్యమెప్పుడూ సజీవంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. 'మోదీజీ ప్రపంచంలో సత్యాన్ని తొలగించవచ్చు. కానీ వాస్తవానికి, సత్యాన్ని తొలగించలేము. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, అదే నిజం. వారు కోరుకున్నంత మాత్రాన ఆ అంశాలను తొలగించగలరు. కానీ సత్యమే సత్యం.' అని పేర్కొన్నారు.

Also Read: Mahua Moitra: నన్ను బహిష్కరించినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది - ఎంపీ మహువా మొయిత్రా

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Pantangi Toll Plaza: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
Embed widget