![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mallikarjun Kharge: ‘ఇండియా’ కూటమి 295కు పైగా సీట్లను గెలవడం ఖాయం: మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge: 'ఇండియా' కూటమి సమావేశం శనివారం ముగిసింది. భారత కూటమి 295 సీట్లకు పైగా గెలుస్తుందని ఖర్గే ప్రకటించారు. అయితే తాము హ్యాట్రిక్ కొడుతున్నామని ఎన్డీఏ కూటమి నేతలు ధీమాగా ఉన్నారు.
![Mallikarjun Kharge: ‘ఇండియా’ కూటమి 295కు పైగా సీట్లను గెలవడం ఖాయం: మల్లికార్జున ఖర్గే lok sabha election 2024 india alliance meeting mamta banerjee arvind kejriwal Mallikarjun Kharge: ‘ఇండియా’ కూటమి 295కు పైగా సీట్లను గెలవడం ఖాయం: మల్లికార్జున ఖర్గే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/571b64de87d9051ee3ddfd4bf7f0ff0a17172545011731037_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mallikarjun Kharge : 18వ లోక్సభ ఎన్నికల తర్వాత 'ఇండియా' కూటమి (I.N.D.I.A Alliance) ముఖ్యమైన సమావేశం శనివారం ముగిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. భారత కూటమి 295 సీట్లకు పైగా గెలుస్తుందని ప్రకటించారు. ఈ సమావేశానికి ఇండియా బ్లాక్ అగ్రనేతలు హాజరయ్యారు. ‘ఇండియా’ కూటమి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ చర్చలో పాల్గొనాలని 'ఇండియా' కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలు నిర్ణయించుకున్నాయని సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా తెలిపారు.
పాల్గొన్న పలువురు విపక్ష నేతలు
ఈ సమావేశంలో పాల్గొనేందుకు విపక్ష నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, ఎన్సీపీ (పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం పలువురు నేతలు పాల్గొన్నారు. భగవంత్ మాన్, డీఎంకే నేత టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
తదుపరి వ్యూహంపై సమావేశం
2024 లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారం పూర్తయింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేటి సమావేశంలో 'ఇండియా' కూటమి భవిష్యత్తు వ్యూహంపై మేధోమథనం చేసింది. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మరికొందరు నేతలు ఇండియా కూటమి సమావేశానికి హాజరుకాలేదు.
#WATCH | INDIA alliance meeting underway at the residence of Congress President Congress President Mallikarjun Kharge, in Delhi.
— ANI (@ANI) June 1, 2024
(Source: Twitter handle of Congress) pic.twitter.com/wxtXmU9Ih0
డీఎంకే తరఫున టీఆర్ బాలు
డీఎంకే ఇండియా కూటమి సమావేశానికి హాజరైంది. విపక్షాల కూటమి ‘ఇండియా’ సమావేశంలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ప్రాతినిధ్యం వహిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. జూన్ 4 భారతదేశానికి కొత్త ఉదయానికి నాంది కానుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లో స్టాలిన్ ప్రకటించారు. ఈరోజు డిఎంకె తరపున మా పార్టీ కోశాధికారి, డిఎంకె పార్లమెంటరీ పార్టీ నాయకుడు టిఆర్ బాలు 'ఇండియా' కూటమి నేతల సమావేశంలో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధిస్తుందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ గైర్హాజరు
ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకాకపోవడం గమనార్హం. మమత సమావేశానికి హాజరవుతుందా అనే ప్రశ్నపై, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శనివారం ఎన్నికలలో బిజీగా ఉంటారని, అందుకే సమావేశానికి హాజరు కాలేరని స్పష్టం చేశారు. జూన్ 4న 'ఇండియా' అనధికారిక సమావేశం ఉంటుందని, అందులో కౌంటింగ్ రోజు సన్నాహాలను చర్చిస్తామని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)