అన్వేషించండి

Teachers Day 2024: సర్వేపల్లి రాధాకృష్ణన్ తండ్రి తీసుకున్న సరైన నిర్ణయమే ఆయనను రాష్ట్రపతిని చేసిందా!

Teachers Day 2024 History : రాధాకృష్ణన్‌ తండ్రికి పై ఆయన పై చదువులు చదవడం ఇష్టం లేదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు తన కొడుకు కూడా ఏదో ఒక దేవాలయంలో పూజారిగా స్థిరపడాలని కోరుకున్నారు.

Happy Teachers Day 2024 : మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజనీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పదవులకే వన్నెతెచ్చిన ‘భారతరత్నం’. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలో, విద్యకు సమాజంలో సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ, చొరవ తనను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. అందుకే ఆయన పుట్టినరోజును స్మరించుకుంటూ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రముఖ పండితుడు, ఉపాధ్యాయుడు. రాజకీయ నాయకుడు, ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు గ్రహీత కూడా. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5, 1962 న జరుపుకున్నారు. అలాగే, రాష్ట్రపతి రాధాకృష్ణన్ అదే సంవత్సరంలో అధికారం చేపట్టారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి అయ్యారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన తర్వాత రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. 1965లో ఆయన విద్యార్థులు, స్నేహితులు తన పుట్టినరోజును నిర్వహించడానికి సంప్రదించారు.  ఆ సమయంలోనే తన జన్మదిన వేడుకలు కాకుండా ఉపాధ్యాయులందరినీ గౌరవించేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.
 
స్కాలర్ షిప్ ల మీదే చదువు పూర్తి
రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులు. రాధాకృష్ణన్ తొలినాళ్లు తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కేవీ హైస్కూల్లో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేటలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో జరిగింది.  మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఫిలాసఫీ చదివారు. ఆయన చదువంతా స్కాలర్‌షిప్‌ల‌తోనే జరిగింది.  

పదహారేళ్ల వయసులోనే పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకామును వివాహం చేసుకున్నారు. వీరికి గోపాల్ అనే కుమారుడితో పాటు ఐదుగురు కుమార్తెలు కలిగారు. తరువాత మైసూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆయన విశేష కృషి కారణంగా ఆంధ్రా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. అతను తన జీవితకాలంలో అనేక అవార్డులు అందుకున్నారు.  

పూజారిని చేద్దామనుకున్న తండ్రి, కానీ రాష్ట్రపతి స్థాయికి..
నిజానికి రాధాకృష్ణన్‌ తండ్రి వీరాస్వామికి పై ఆయన పై చదువులు చదవడం ఇష్టం ఉండేది కాదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో తన కొడుకు కూడా ఏదో ఒక దేవాలయంలో పూజారిగా స్థిరపడాలని ఆయన తండ్రి కోరుకున్నారు. అయితే.. తన కుమారుడి అద్భుత ప్రతిభను చూసి ఎంత కష్టమైన పడి తనను పై చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత మనందరికీ తెలిసిన సంగతే.. విద్యావేత్తగా, దార్శనికుడిగా, రాజకీయ నాయకుడిగా విజయవంతమైన ప్రయాణం సాగించి.. చరిత్ర పుటల్లో నిలిచారు. ఆ రోజు రాధాకృష్ణన్ తండ్రి మనసు మార్చుకోకపోతే, ఈ మహానుభావుడు, గొప్ప విద్యావేత్త, దార్శనికుడు, భారతదేశ రాష్ట్రపతిగా మనం చూసేవాళ్ళం కాదేమో.

Also Read: Teachers Self Care Secrets : టీచర్స్​ డే స్పెషల్.. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి టీచర్స్ ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget