News
News
X

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు అయ్యారు. అంటే ఏదో బిడ్డను దత్తత తీసుకుని వీళ్లు తల్లిదండ్రులు కాలేదండీ.

FOLLOW US: 
Share:

Kerala Transgender Couple: దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు అయ్యారు. అంటే ఏదో బిడ్డను దత్తత తీసుకుని వీళ్లు తల్లిదండ్రులు కాలేదండీ. సరోగసి పద్ధతిని సైతం వారు పాటించలేదు. పురుషుడిగా మారిన ఓ మహిళ (జహాద్) గర్భవతిగా మారి బుధవారం నాడు ఓ పండంటి బిడ్డకు జన్మిచ్చారు. అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉండగా.. మార్చి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నామని ఆ జంట వెల్లడించినా.. కొన్ని వైద్య కారణాల వల్ల డాక్టర్లు సర్జరీ చేసి డెలివరీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జహాద్, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. 

కొన్ని అవయవాలు మాత్రం లింగ మార్పిడి పూర్తి కాలేదు

జహాద్ (23), జియా పావల్ (21) కేరళలోని కోజికోడ్‌లో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ జంట. జహాద్ ఇటీవల మహిళగా మారగా.. కొన్ని అవయవాలు మాత్రం లింగ మార్పిడి పూర్తి కాలేదు. జహాద్ స్తనాలను ఇప్పటికే సర్జరీ చేసి తొలగించారు. కానీ అండాశయం లాంటి కొన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు కావాలని ఉందని జియా పావల్ భావించింది. ఈ విషయాన్ని చెప్పగా జహాద్ అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్ జహాద్ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడం దేశంలో హాట్ టాపిగ్ గా మారింది. జహాద్ పార్ట్ నర్ జియా పావల్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఈరోజు తన జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. మాకు మద్దతు తెలిపిన వారికి, తమ శ్రేయస్సు కోరిన అందరికీ, మెస్సేజ్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను తల్లి కావాలని ఎలా కలలు కంటానో, అదే విధంగా అతను (జహాద్) తండ్రి కావాలని కలలు కంటున్నాడని చెప్పుకొచ్చింది. 

జియా పావల్ క్లాసికల్ డ్యాన్స్ టీచర్ గా చేస్తుండగా.. జహాద్ ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌ గా చేసి మానేశాడు. అయితే గర్భం దాల్చిన కొన్ని నెలలకు జాబ్ మానేసినట్లు తెలిపారు. తమకు ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వంగానీ, లింగ మార్పిడి సంఘాలు తమకు అండగా నిలవాలని సహాయం కోసం ఈ దంపతులు ఇటీవల అభ్యర్థించారు. ఇటీవల జహాద్ బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ట్రాన్స్ జెండర్ జంట విషయం అందరికీ తెలిసింది. కొందరు వీరికి మద్దతు తెలపగా, మరికొందరు నెటిజన్లు భవిష్యత్ ఎలా ఉంటుందోనని ప్రశ్నల వర్షం కురిపించారు.

స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తర్వాత కూడా గర్భం.. ఎలా సాధ్యం?

ట్రాన్స్ జెండర్ల జంట తమ లింగాన్ని మార్చుకోవడానికి శస్త్ర చికిత్సను ఆశ్రయించారు. జియా పురుషుడిగా జన్మించగా.. స్త్రీగా మారాడు. అయితే జహాద్ స్త్రీగా జన్మించగా... తరువాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. కానీ ఈ సర్జరీలో అతని గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదు. ఈ క్రమంలోనే అతడు గర్భవతి అయ్యాడు. 

Published at : 08 Feb 2023 07:46 PM (IST) Tags: Kerala Transgender Transgender couple Ziya & Zahad Zahad blessed with a baby

సంబంధిత కథనాలు

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

Laxman Narasimhan: స్టార్‌ బక్స్‌ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!

Laxman Narasimhan: స్టార్‌ బక్స్‌ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!

పానీపూరీ రుచి చూసిన జ‌పాన్ ప్ర‌ధాని

పానీపూరీ రుచి చూసిన జ‌పాన్ ప్ర‌ధాని

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

WillFul Defaulters: బ్యాంకులకు ₹88,435 కోట్ల కుచ్చు టోపీ, టాప్‌-3 కేటుగాళ్లు వీళ్లే

WillFul Defaulters: బ్యాంకులకు ₹88,435 కోట్ల కుచ్చు టోపీ, టాప్‌-3 కేటుగాళ్లు వీళ్లే

టాప్ స్టోరీస్

Supreme Court : గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడంపై కేంద్రానికి నోటీసులు - సుప్రీంకోర్టు కీలక నిర్ణయం !

Supreme Court : గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో  పెట్టడంపై  కేంద్రానికి నోటీసులు - సుప్రీంకోర్టు కీలక నిర్ణయం !

SIT Notices To Bandi Sanjay : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు సిట్ నోటీసులు - 24న హాజరు కావాలని ఆదేశం !

SIT Notices To Bandi Sanjay :  టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు సిట్ నోటీసులు - 24న హాజరు కావాలని ఆదేశం !

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?