News
News
వీడియోలు ఆటలు
X

Kerala Boat Tragedy: కేరళలో టూరిస్టుల బోటు బోల్తా, 15 మంది మృతి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Boat Tragedy In Kerala: కేరళలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలో టూరిస్టుల బోటు బోల్తా పడింది.

FOLLOW US: 
Share:

Kerala Boat Tragedy: కేరళలో ఘోర విషాదం చోటుచేసుకుంది. టూరిస్టుల బోటు బోల్తా పడటంతో 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మలప్పురం జిల్లాలో తన్నూర్ బీచ్ దగ్గర ప్రమాదం జరిగింది. టూరిస్టుల బోటు బోల్తా పడిన సమయంలో అందులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గజ ఈతగాళ్లతో పోలీసులు, సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అసలేం జరిగిందంటే..
కేరళలోని మలప్పురం జిల్లాలో పర్యాటకులు ప్రయాణిస్తున్న ఓ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు మంత్రి వి అబ్దురహిమాన్ తెలిపారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. డబుల్ డెక్కర్ పడవలో మహిళలు, పిల్లలు సహా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద పురపుజా నదిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బోటు బోల్తా పడటంతో విషాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ టీమ్స్ గజ ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

బోటు ప్రమాదం ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 10 మందిని రెస్క్యూ టీమ్ రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టూరిస్టుల బోటు సర్వీసులు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నడపడానికి అనుమతి ఉంది. ప్రమాదం దాదాపు 7 గంటల సమయంలో జరగడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడువు దాటిన తరువాత బోటుకు పర్మిషన్ ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒడ్డు నుంచి 300 మీటర్ల దూరంలో బోటు బోల్తా పడటంతో నీళ్లలో పడిపోయి పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

బోటులోని ప్రయాణికులు మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి, తానూర్ ప్రాంతాలకు చెందిన వారని సమాచారం. అయితే బోటు డబుల్ డెకర్ బోటు కాగా, అందులో టూరిస్టులకు పరిపోయే సౌకర్యాలు గానీ, లైఫ్ జాకెట్ వంటి సదుపాయాలు లేవు అని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.

Published at : 07 May 2023 10:22 PM (IST) Tags: Crime News Boat Kerala Boat Tragedy Tanur Tanur boat Tragedy

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 50 మందికి గాయాలు

Odisha Train Accident: ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 50 మందికి గాయాలు

AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

Manipur Violence: అమిత్‌షా వార్నింగ్ ఎఫెక్ట్, ఇప్పటివరకు 140 ఆయుధాలు అప్పగించిన నిరసనకారులు

Manipur Violence: అమిత్‌షా వార్నింగ్ ఎఫెక్ట్, ఇప్పటివరకు 140 ఆయుధాలు అప్పగించిన నిరసనకారులు

Rahul Gandhi: 2 ఎఫ్ఐఆర్ లలో 15 లైంగిక వేధింపుల ఆరోపణలు, మోదీ రక్షణ కవచంలో బీజేపీ ఎంపీ- రాహుల్ ఫైర్

Rahul Gandhi: 2 ఎఫ్ఐఆర్ లలో 15 లైంగిక వేధింపుల ఆరోపణలు, మోదీ రక్షణ కవచంలో బీజేపీ ఎంపీ- రాహుల్ ఫైర్

No Fault Divorce: విడాకులు తీసుకోవాలంటే కారణాలు అవసరం లేదు, ఈ నో ఫాల్ట్ డైవర్స్ గురించి మీకు తెలుసా?

No Fault Divorce: విడాకులు తీసుకోవాలంటే కారణాలు అవసరం లేదు, ఈ నో ఫాల్ట్ డైవర్స్ గురించి మీకు తెలుసా?

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా