అన్వేషించండి

Nandini Milk Prices: మిల్క్‌ రేట్‌ కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం- మరోసారి తెరపైకి నందినీ పాల అంశం

కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఆధ్వర్యంలోని నడుస్తున్న ప్రముఖ బ్రాండ్ నందిని పాల ధర లీటరుకు ₹3 పెంపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఆధ్వర్యంలోని నడుస్తున్న ప్రముఖ బ్రాండ్ నందిని పాల ధర లీటరుకు ₹3 పెంపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాల ఉత్పత్తిదారుల డిమాండ్ల మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

పాల ధరల పెంపును ముఖ్యమంత్రి సిద్ధారామయ్య సమర్థించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటక తక్కువ ధరకు పాలను విక్రయిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పాల ధరలు ఎక్కువగా ఉన్నాయని సీఎం అన్నారు. ప్రస్తుతం రూ.39 ధర ఉండే టోన్డ్ పాలు ఇప్పుడు లీటరుకు రూ.42కు చేరుతుందన్నారు. మిగిలిన చోట్ల, లీటరుకు రూ.54 నుంచి రూ.56 వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో లీటరు ధర రూ.44గా ఉన్నట్లు వివరించారు.  

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం సీఎం సిద్దారామయ్య వాదనను సమర్థిస్తూ మాట్లాడారు. డీకే స్పందిస్తూ  రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారులను, రైతులను ఆదుకునేందుకు ధరల పెంపు అవసరమని అభిప్రాయపడ్డారు. తాము పాల ఉత్పత్తిదారులకు కనీస ధర, కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని భావించామని, అందులో భాగంగానే పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక పాడి రైతులు తాము ఉత్పత్తి చేస్తున్న పాలకు అతి తక్కువ ధరకు పొందుతున్నారని అన్నారు. దేశం మొత్తం మీద టోన్డ్ మిల్క్ లీటరు రూ.56 ఉండగా కర్ణాటకలో మాత్రం రూ.39 ఉందన్నారు. తక్కువ ధరలతో నష్టపోతున్న రాష్ట్ర పాడి రైతులను ఆదుకోవడం తమ బాధ్యత అన్నారు. ఈ నేపథ్యంలోనే పాల ధరలను మూడు రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

బీజేపీ హయాంలో చివరి సారిగా 2022 నవంబర్‌లో పాల ధరలను పెంచారు. కేఎంఎఫ్ మూడు రూపాయలు ప్రతిపాదించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై జోక్యం చేసుకోవడంతో కేఎంఎఫ్ కొంచెం వెనక్కితగ్గింది. లీటరుకు రూ.2 పెంచింది.  2022లో ధర పెరిగినప్పటికీ, కర్ణాటకలో నందిని పాల విక్రయ ధర ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. నందిని పాలు లీటరుకు రూ. 39 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రైవేట్ సంస్థలు తమ పాలను లీటరుకు రూ.48 నుంచి రూ.52 వరకు విక్రయిస్తున్నాయని సీనియర్ KMF అధికారి తెలిపారు. 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని వివాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. బెంగుళూరులో అమూల్ పాలు, పెరుగు విక్రయించడానికి బీజేపీ అనుమతించింది. దీంతో అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్, కన్నడ అనుకూల సంఘాలతో ఆందోళనలకు దిగాయి. అమూల్‌కు అనుమతులు ఇవ్వడం ద్వారా కేఎంఎఫ్ సంస్థను నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నాయని మండిపడ్డాయి.  తాజాగా నందిని పాల ధరల పెంపుపై బీజేపీ ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget