News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NewsClick: న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు, చైనా నుంచి నిధుల ఆరోపణల నేపథ్యంలో దాడులు

NewsClick: న్యూస్ క్లిక్ న్యూస్ పోర్టల్ కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ వస్తున్న ఆరోపణ నేపథ్యంలో పోలీసులు సోదాలు చేపట్టారు.

FOLLOW US: 
Share:

NewsClick: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. న్యూస్ క్లిక్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ కు చైనా నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. న్యూస్ క్లిక్ జర్నలిస్టుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. చైనా నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ విభాగం అధికారులు స్థానికంగా ఉన్న న్యూస్ క్లిక్ ఆఫీసుతో పాటు.. అందులో పని చేస్తున్న జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్ సహా ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. వారి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ విషయాన్ని న్యూస్‌క్లిక్ జర్నలిస్టు అయిన అభిసార్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో చెప్పుకొచ్చారు. పోలీసులు తన ఇంటికి వచ్చారని, తన ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు తన పోస్టులో వెల్లడించారు. కొంత మంది జర్నలిస్టులను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారని మరికొందరు ఆరోపించారు.

రెండు సంవత్సరాల క్రితం 2021 లోనూ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ కు విదేశాల నుంచి భారీగా నిధులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణలో తేలింది. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ తరఫున న్యూస్ క్లిక్ కు చైనా నుంచి భారీగా నిధులు వచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. నెవిల్లే చైనా కమ్యూనిస్టు పార్టీ తో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. న్యూస్ క్లిక్ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ కథనం ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారం కాస్త తీవ్ర దుమారం రేపింది. న్యూస్ క్లిక్ కు చైనా నుంచి అందుతున్న నిధుల వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపడుతోంది.

జూన్ 21, 2021న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి న్యూస్ క్లిక్ పై, పుర్కాయస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వరల్డ్ వైడ్ మీడియా హోల్డింగ్స్ నుంచి న్యూస్‌క్లిక్ కు రూ.9.59 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. విదేశాల నుంచి వచ్చిన డబ్బుకు సంబంధించి న్యూస్ క్లిక్ సహా ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 

Published at : 03 Oct 2023 01:09 PM (IST) Tags: Noida Delhi Journalists NewsClick Raided By Police

ఇవి కూడా చూడండి

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

Bharat Ki Baat Year Ender 2023 : చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

Bharat Ki Baat Year Ender 2023 :  చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే