అన్వేషించండి

Nitish Kumar: చంద్రబాబును ఇరుకున పెడుతున్న నితీశ్ - పదే పదే కేంద్రం ముందు ప్రత్యేక హోదా డిమాండ్, ఏం జరుగుతుందో?

Bihar CM Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ మేరకు తీర్మానానికి ఆ పార్టీ సమావేశంలో శనివారం ఆమోదం తెలిపారు.

JDU Seeks Special Category Status For Bihar: కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తాజాగా కేంద్రానికి గట్టి మెలిక పెట్టారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ కార్యవర్గ సమావేశంలో శనివారం తీర్మానించారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ (Special Status) లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆ పార్టీ ఆమోదించింది. అలాగే, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో అక్రమాలు నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠిన చట్టం చేయాలని తీర్మానించింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లను నితీశ్ కుమార్ మోదీ సర్కారు ముందు ఉంచుతున్నారు. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని గతంలోనే కేంద్ర పెద్దలు స్ఫష్టం చేసిన క్రమంలో.. మళ్లీ నితీశ్ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంలో కీలకంగా ఉన్న ఆయన డిమాండ్‌పై ఇప్పుడు మోదీ సర్కారు ఎలా స్పందిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

మూడో అతి పెద్ద పార్టీగా..

బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆ రాష్ట్ర కేబినెట్ గతేడాది ఓ తీర్మానాన్ని నవంబరులో ఆమోదించింది. అయితే, అప్పటికీ నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కూటమి నుంచి వైదొలగిన సీఎం.. మళ్లీ బీజేపీ గూటికి చేరారు. తాజాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో.. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా  జేడీయూ అవతరించింది. ఈ క్రమంలోనే 'ప్రత్యేక హోదా' అంశాన్ని లేవనెత్తడంపై అంతటా ప్రాధాన్యత సంతరించుకుంది. 'బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, సవాళ్లు, సమస్యలను పరిష్కరించడంతో ఇది కీలక దశ' అని జేడీయూ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అటు, ఇదే సమావేశంలో పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్ నేత సంజ్‌ఝాను ఎన్నుకొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి.?

2014లో ప్రత్యేక రాష్ట్రం విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన తీర్మానంలో పొందుపరిచింది. అయితే, ఆ తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు (NDA Government) ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాగా, దేశంలో ప్రత్యేక హోదా సాధనకు ఏపీ, బిహార్ రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. గతంలో కేంద్రంలో ఎన్డీయే కూటమిలో బీజేపీకి సొంతంగా బలం ఉండడంతో ఈ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో ఏపీ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూలు కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నితీశ్ కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మరి ఈ డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ సీఎం చంద్రబాబుపై (CM Chandrababu) ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారులో ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే డిమాండ్ ఆయనపై మళ్లీ బలంగా వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Kerala Assembly Elections 2026: కేరళ బీజేపీకి తెలుగు బీజేపీ నేతల సపోర్టు - విస్తృతంగా ప్రచార బాద్యతలు
కేరళ బీజేపీకి తెలుగు బీజేపీ నేతల సపోర్టు - విస్తృతంగా ప్రచార బాద్యతలు
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Embed widget