By: ABP Desam | Updated at : 13 Jun 2022 05:06 PM (IST)
Edited By: Murali Krishna
జమ్ముకశ్మీర్లో సెంచరీ కొట్టిన సైన్యం- ఉగ్రవాదులకు ఇక కష్టమే!
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతపై సైన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2022 ఆరంభం ఇప్పటివరకు జమ్ముకశ్మీర్లో 100 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వేర్వేరు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను హతం చేసినట్లు అధికారులు ప్రకటించారు.
63 మంది
మృతి చెందిన 100 మంది ఉగ్రవాదుల్లో అత్యధికంగా 63 మంది నిషేధిత లష్కేర్ తోయిబాకు చెందినవారు ఉన్నారు. మరో 24 మంది జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వేర్వేరు ఆపరేషన్లలో చనిపోయిన ముష్కరుల్లో విదేశాలకు చెందినవారి సంఖ్య 29గా ఉంది.
గతేడాది ఇదే 6 నెలల కాలవ్యవధిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్యతో పోల్చితే ఈ ఏడాది చనిపోయినవారి సంఖ్య రెట్టింపుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదేకాల వ్యవధిలో 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇటీవల
జమ్ముకశ్మీర్ పుల్వామాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి.
ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య శనివారం కాల్పులు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ దాదాపు 12 గంటలపాటు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.s
కాల్పుల్లో మరణించిన వారిని జునైద్ షీర్గోజ్రీ, ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్గా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ముగ్గురు స్థానికులేనని, వీరు లష్కరే తోయిబా గ్రూప్కు చెందిన వారని పేర్కొన్నారు.
Also Read: National Herald case: రాహుల్ గాంధీని ఈడీ ఏమడిగిందో తెలుసా?- 3 గంటల పాటు విచారణ
Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Kuja Dosha Verdict: అత్యాచార బాధితురాలి జాతకాన్ని కోరిన అలహాబాద్ హైకోర్టు - ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సురక్షితం, 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్!
Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్, రైళ్లల్లో భద్రతపై ప్రశ్నల వర్షం
Odisha Train Accident LIVE: రైలు ప్రమాదంలో 288 మంది మృతి, మరో 56 మంది పరిస్థితి విషమం
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?