అన్వేషించండి

IRCTC Tourism: రూ.15 వేలకే తొమ్మిది రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనభాగ్యం - దక్షిణ భారతదేశ యాత్ర ప్యాకేజీ వివరాలు

IRCTC Tourism: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణీకులు కోసం ట్రావెలింగ్ ప్యాకేజీలను ప్రకటిస్తూనే ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఐఆర్ సీటీసీ మంచి ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.

Divya Dakshin Yatra with Jyotirlinga:  భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణీకులు కోసం టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూనే ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఐఆర్ సీటీసీ ఓ మంచి ప్యాకేజీను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.  భారతీయ రైల్వే టూరిజం కోస మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌ను ప్రకటించింది.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి  దివ్య దక్షిణ యాత్రను ఆపరేట్ చేయనుంది.

ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన ప్యాకేజీలో అరుణాచలం (Arunachalam), రామేశ్వరం (Rameswaram), మధురై (Madurai), కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ లలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు.  ఇది ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల టూర్ ప్యాకేజీ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఎక్కొచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.  ఈ టూర్ ప్యాకేజీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ప్రవేశపెట్టబడింది. ఈ టూర్ ప్యాకేజీలో, భక్తులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రయాణిస్తారు.  ఈ నెల 25న హైదరాబాద్ నుంచి టూర్ మొదలవుతుంది.

 బోర్డింగ్/డీబోర్డింగ్ పాయింట్లు ఎక్కడ ఉంటాయి?
ఈ టూర్ ప్యాకేజ్‌లోని ప్రయాణికులు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల నుండి ఎక్కవచ్చు/దిగిపోవచ్చు.
  
టూర్ ప్లానింగ్ ఇలా 
ఐఆర్ సీటీసీ టూరిజం దివ్య దక్షిణ యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుండి ప్రారంభమవుతుంది. మొదటి రోజు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, రెండో రోజు నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఈ టూరిస్ట్ రైలు ఎక్కవచ్చు. రెండో రోజు తిరువణ్ణామలై చేరుకుంటారు. అరుణాచలం ఆలయాన్ని సందర్శించవచ్చు. మూడో రోజు రామేశ్వరం చేరుకుంటారు. స్థానిక దేవాలయాలు చూడవచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేస్తారు. నాల్గవ రోజు రామేశ్వరం నుండి మధురైకి బయలుదేరుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆ తర్వాత కన్యాకుమారి బయలుదేరాలి. ఐదవ రోజు రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ చూడవచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస చేస్తారు.

ఆరవ రోజున త్రివేండ్రం బయలుదేరుతారు. శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్ చూడవచ్చు. ఆ తర్వాత తిరుచిరాపల్లికి బయలుదేరారు. ఏడవ రోజు శ్రీరంగం దేవాలయం, బృహదీశ్వరాలయం చూడవచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎనిమిదో తేదీన రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, తొమ్మిదో తేదీన సికింద్రాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

 ఈ టూర్ ప్యాకేజీ ధర
ఈ టూర్ ప్యాకేజీలోని ఎకానమీ క్లాస్‌లో  ప్రయాణించినట్లయితే..  ఒక వ్యక్తికి రూ.14,250 చెల్లించాలి. స్టాండర్డ్ కేటగిరీలో ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.21,900 చెల్లించాలి. అయితే, మీరు కంఫర్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ. 28,500 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు ఎకానమీ క్లాస్‌లో రూ. 13,250, స్టాండర్డ్ క్లాస్‌లో రూ. 20,700, కంఫర్ట్ క్లాస్‌లో రూ. 27,010 చెల్లించాలి. ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఇతర టూర్ ప్యాకేజీల మాదిరిగానే  పర్యాటకులకు వసతి, ఆహార సౌకర్యాలు కూడా అందించబడతాయి.

ప్యాకేజీ పేరు – జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర (SCZBG10)
కవర్ చేయబడిన గమ్యస్థానాలు - తిరువణ్ణామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి మరియు తంజావూరు.
పర్యటన ఎన్ని రోజులు ఉంటుంది - 8 రాత్రులు మరియు 9 రోజులు
బయలుదేరే తేదీ - మే 25 , 2024
భోజన పథకం - ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం,  రాత్రి భోజనం
ట్రావెల్ మోడ్ - భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
తరగతి - స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ

దర్శించే ప్రదేశాలు
తిరువణ్ణామలై- అరుణాచలం దేవాలయం (Arunachalam Temple)
రామేశ్వరం- రామనాథస్వామి దేవాలయం (Ramanathaswamy Temple)
మధురై- మీనాక్షి అమ్మవారి ఆలయం (Meenakshi Amman Temple)
కన్యాకుమారి- రాక్ మెమోరియల్, కుమారి అమ్మ వారి టెంపుల్ (Kumari Amman Temple)
త్రివేండ్రం- పద్మనాభస్వామి ఆలయం (Shree Padmanabhaswamy Temple)
తిరుచ్చి - రంగనాథస్వామి ఆలయం (Sri Ranganathaswamy Temple)
తంజావూరు - బృహదీశ్వరాలయం (Brihadeeswara Temple)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
TGPSC: ‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Embed widget