అన్వేషించండి

Indigo Flight In Karachi: హైదరాబాద్‌ వస్తున్న ఫ్లైట్ పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ - వెంటనే మరో విమానం కరాచీకి

‘‘షార్జా-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం వల్ల కరాచీకి మళ్లించారు. ప్రయాణికులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరొక విమానాన్ని కరాచీకి పంపుతున్నాము.’’ అని ఇండిగో ప్రకటించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యవసరంగా దించారు. విమానంలో సాంకేతిక లోపం ఉందని పైలట్ నివేదించడంతో, దానిని కరాచీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అక్కడ విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు సంబంధించి నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే, అందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆలోపు పాకిస్థాన్ లో ఉన్న ప్రయాణికుల్ని ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు కరాచీకి మరో విమానాన్ని పంపాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మరో విమానాన్ని కరాచీకి పంపింది.

మరో విమానం కరాచీకి..
దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందిస్తూ ‘‘షార్జా-హైదరాబాద్ విమాన పైలట్ విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించడంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీకి మళ్లించారు. ప్రయాణికులను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు మరొక విమానాన్ని కరాచీకి పంపుతున్నాము.’’ అని ప్రకటన విడుదల చేసింది.

గత రెండు వారాల్లో కరాచీలో దిగిన రెండో భారతీయ విమానయాన సంస్థ ఇది. అంతకుముందు జూలై 5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.

జులై 5న న్యూఢిల్లీ నుండి దుబాయ్‌కి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా కరాచీ విమానాశ్రయంలో ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఎయిర్‌లైన్ ప్రతినిధి మాట్లాడుతూ, “జులై 5, 2022న, స్పైస్‌జెట్ B737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ SG-11 (ఢిల్లీ-దుబాయ్) ఇండికేటర్ లైట్ సరిగా పని చేయకపోవడంతో కరాచీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.’’ అని పేర్కొన్నారు.

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్
ఇదే వారంలో గత బుధవారం ఢిల్లీ నుంచి ఇంఫాల్ వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం కూడా కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇండిగో విమానం నంబర్ 6E2615 ఇంఫాల్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ అక్కడ ప్రతికూల వాతావరణం కారణంగా, ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దాని కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. విమానంలో ఇంధనం కూడా అయిపోనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 141 మంది ప్రయాణికులు ఉన్నారు.

గత జూలై 6న, ఇండిగో ఎయిర్‌ లైన్స్‌కు చెందిన రాయ్‌పూర్-ఇండోర్ విమానంలో ప్రమాదం తలెత్తిన సంగతి తెలిసిందే. A320 విమానం గమ్యస్థానంలో దిగిన తర్వాత దాని క్యాబిన్ నుండి పొగలు కమ్ముకోవడాన్ని సిబ్బంది గమనించారు. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి దిగారని తెలిపారు. దీనిపై డీజీసీఏ విచారణ జరుపుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget