అన్వేషించండి

Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!

Independence Day 2022: భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా త్రివర్ణ శోభితంగా మారింది. నేలపైనే కాకుండా అంతరిక్షంలోనూ, భూమికి 30 కిలోమీటర్లపై జాతీయ జెండా ఎగురింది. 

Independence Day 2022: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వాడవాడలా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి ‌అయినవేళ ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపుతో ఇంటంట మువ్వన్నెల జెండా ఎగిరింది. 75 ఏళ్లు పూర్తై వజ్రోత్సవాలు చేసుకుంటున్న వేళ.. అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. భూ గ్రహం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో భారతీయ జాతీయ జెండా ఎగిరింది. స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ జాతీయ పతాకాన్ని అంతరిక్షంలో ఆవిష్కరించింది. యువ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ సంస్థ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ.. హర్ ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా స్పేష్ కిడ్జ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

1,06,000 అడుగుల ఎత్తులో రెపరెపలు..

భూమి నుంచి దాదాపు 1,06,000 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది స్పేస్ కిడ్జ్ సంస్థ. బెలూన్‌లో జాతీయ జెండాను పంపించి. రోదసిలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. దేశంలో యువ శాస్త్రవేత్తలను తయారు చేయడంతోపాటు, పిల్లల్లో అంతరిక్షంపై అవగాహన పెంచేందుకు స్పేస్ కిడ్జ్ సంస్థ కృషి చేస్తోంది. సరిహద్దులు లేని ప్రపంచం కోసం అవగాహన కల్పిస్తుంది స్పేస్ కిడ్జ్. ఇటీవలే లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఈ స్పేస్ కిడ్జ్ సంస్థ. ఆజాదీ సాట్ పేరుతో దేశంలోని 750 మంది బాలికలతో 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవానికి  గుర్తుగా ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది ఈ సంస్థ. సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ ప్రయోగం విఫలమైంది. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ..

75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షం నుంచి కూడా మెసేజ్‌లు వస్తున్నాయి. అంతర్జాతీయ రోదసి కేంద్రంలో పని చేస్తున్న వ్యోమగామి సమంతా క్రిస్టో ఫోరెట్టి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత్‌కు 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏనాటి నుంచో నాసా, ఇస్రో మధ్య మంచి సహకారం ఉందని వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి తెలిపారు. 

5 కోట్ల సెల్పీలతో ఏకత్వం..

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. హర్ ఘర్ తిరంగ కార్యక్రమానికి దేశ పౌరులు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునివ్వగా.. పంద్రాగస్టు వేళ ఇంటింటా జాతీయ పతాకాలు ఎగుర వేశారు. 5 కోట్ల మందికి పైగా త్రివర్ణ పతకంతో సెల్ఫీ దిగి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఇదో అద్భుతమైన విజయంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రికార్డును సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ విజయం భారత దేశ ఐక్యత మరియు ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని సాంస్కృతిక శాఖ పేర్కొంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget