అన్వేషించండి

Mukul Roy Passes Away: కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత.. వ్యూహకర్తగా మంచి పేరున్న నేత

Mukul Roy Death News | మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ అనారోగ్య సమస్యలతో కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. టీఎంసీ సీనియర్ నేత సోమవారం కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు కాగా, చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 1:30 గంటలకు ఆయన చనిపోయినట్లు సమాచారం. ముకుల్ రాయ్ మృతిపట్ల టీఎంసీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి నమ్మకమైన నేతగా ముకుల్ రాయ్ ఎదిగారు. కేంద్రంలో కీలక పదవులు చేపట్టి సేవలు అందించారు. ముకుల్ రాయ్ 2009లో కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2011, 2012 మధ్య రైల్వే శాఖ మంత్రిగా సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. 

ముకుల్ రాయ్ పొలిటికల్ కెరీర్..

ఒకప్పుడు ముకుల్ రాయ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో రెండవ అత్యంత ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. నైపుణ్యం కలిగిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆయనకు పేరుంది. 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు. 2017లో పార్టీతో సంబంధాలు చెడటం, నారద స్టింగ్ వివాదం సమయంలో టీఎంసీ నుంచి ఆయనను బహిష్కరించారు. నారద స్టింగ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేపింది.

బీజేపీలో చేరి, తిరిగి టీఎంసీకి యూటర్న్.. 

నవంబర్ 2017లో ముకుల్ రాయ్ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పార్టీలో ఆయన హోదా వేగంగా పెరిగింది. 2020లో ఆయనకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించింది. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ప్రచార వ్యూహాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఆరోగ్య సమస్యల కారణంగా ముకుల్ రాయ్ 2021లో క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఫలితాల తర్వాత ఆ పార్టీని వీడి తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత కొన్నేళ్లుగా, ఆయన ఆరోగ్యం కారణంగా అంత యాక్టివ్‌గా లేరు. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముకుల్ రాయ్ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET-UG Paper Leak: నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
TVK strict announcement: బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
CM Vijay OSD Astrologer: ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?
ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget