అన్వేషించండి

Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల గుట్టు విప్పిన ఈసీ- సంచలనం రేపుతున్న డేటా

Elections commission: జాతీయ పార్టీలైన బీజేపీకి అత్యధికంగా రూ.6,061కోట్లు, కాంగ్రెస్ కోసం రూ.1,422 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేశారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా తృణమూల్ కోసం బాండ్లు కొనుగోలు చేశారు.

Electoral Bonds Data: సుప్రీంకోర్టు సంచలన తీర్పు మేరకు తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ డేటాను ఈసీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించగా ఆ వివరాలను ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. రెండు భాగాలుగా ప్రకటించిన 337 పేజీల డేటా ఆధారంగా 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకూ 11వేల 671కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశాయి. ఏ కంపెనీ ఏ రాజకీయపార్టీకి ఎంత విరాళాలు ఇచ్చింది అనే విషయాన్ని ఈసీ వెల్లడించకపోయినా ఏ కంపెనీ ఎన్ని కోట్ల డబ్బులు పార్టీల కోసం ఇస్తున్నాయో ఓ క్లారిటీ వచ్చింది. 

పార్టీల వారీగా లెక్కలు చూస్తే

జాతీయ పార్టీలైన బీజేపీకి అత్యధికంగా రూ.6,061కోట్లు, కాంగ్రెస్ కోసం రూ.1,422 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేశారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా తృణమూల్ కోసం రూ.1,610 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల విషయానికి వస్తే
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ఎన్నికల బాండ్ల విరాళాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఆపార్టీకి ఇప్పటివరకూ 337కోట్ల రూపాయలు అధికారికంగా అందాయి. రూ.219కోట్లతో రెండోస్థానంలో టీడీపీ, రూ.21కోట్ల రూపాయల విరాళాలు పొంది జనసేన మూడోస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు రూ.1,215 కోట్ల విరాళాలు అందాయి.

పార్టీలకు విరాళాలు కంపెనీలు :

బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్‌ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్‌ నుంచి బిలియనీర్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌, అనిల్‌ అగర్వాల్‌, ఐటీసీ, మహీంద్ర అండ్‌ మహీంద్ర, తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగిన మేఘా ఇంజినీరింగ్‌, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇక్కడో ఇంకో సీరియస్ విషయం ఏంటంటే.. అసలు అంతగా పేరులేని ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్ అనే సంస్థ దేశంలోనే అత్యధికంగా 1,368కోట్ల రూపాయలు విరాళాలను పొలిటికల్ పార్టీలకు బాండ్ల రూపంలో కొనిపెట్టింది. ఇంతకీ ఈ కంపెనీ వివరాలు ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇదో డొల్ల కంపెనీ అనే అనుమానాలతో 2022 మార్చి నుంచి ఈడీ రైడ్స్ కూడా జరుగుతున్నాయి దీని మీద. సో ఈ కంపెనీ 1368కోట్ల రూపాయలు ఏ పార్టీకి ఇచ్చింది ప్రస్తుతానికైతే సీక్రెట్. 

Image

ఇప్పటి వరకు ప్రకటించిన డేటాలో ఉన్న కొన్ని కంపెనీలు పాకిస్థాన్‌ బేస్డ్‌గా నడుస్తున్నాయేన చర్చ సాగుతోంది. ఆ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియడం లేదు. మరోవైపు యశోద సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ రూ.162 కోట్లు, స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ సొంతంగా రూ.35 కోట్లు, ఆయన కంపెనీలు మరో రూ.247 కోట్ల విలువైన బాండ్లు కొన్నాయి. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌: రూ.123 కోట్లు. బిర్లా కార్బన్‌ ఇండియా: రూ.105 కోట్ల రూపాయల బాండ్ల కొనుగోలు చేశాయి. . 

తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది.  షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.

Image

మరికొన్ని తెలుగు కంపెనీల వివరాలు 
డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌: రూ.80 కోట్లు
హెటిరో గ్రూప్‌: రూ.60 కోట్లు'
నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌: రూ.55 కోట్లు
దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌: రూ.55 కోట్లు
అరబిందో ఫార్మా లిమిటెడ్‌: రూ.50 కోట్లు
రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.45 కోట్లు
మైహోం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.25 కోట్లు
భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌: రూ.10 కోట్లు
శ్రీచైతన్య స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌: రూ.6 కోట్లు

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NEET-UG Paper Leak: నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
TVK strict announcement: బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
CM Vijay OSD Astrologer: ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?
ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget