అన్వేషించండి

Central Election Commission: 64.2 కోట్ల మంది ఓటర్లతో భారత్ చరిత్ర - ప్రపంచ రికార్డు సృష్టించామన్న కేంద్ర ఎన్నికల సంఘం

Loksabha elections 2024: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేసి చరిత్ర సృష్టించారని పేర్కొంది.

Central Election Commission Press Meet: 2024 లోక్ సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లతో భారత్ చరిత్ర సృష్టించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన క్రమంలో సోమవారం సీఈసీ నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అయితే, ఎన్నికల ముగింపుపై సీఈసీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందని.. ఈసారి మహిళలు కీలక పాత్ర పోషించారని సీఈసీ చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

కీలక అంశాలివే

 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 

జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య (64.2 కోట్లు) 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే ఈ సంఖ్య 2.5 రెట్లు ఎక్కువగా ఉంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు సీఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించారు. 68,763 బృందాలు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాయి. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4 లక్షల వాహనాలు ఉపయోగించామని.. 135 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల సిబ్బంది అద్భుత పని తీరుతో ఈసారి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎక్కువగా లేదని తెలిపింది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదని పేర్కొంది. 2019 ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా.. ఈసారి 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించాం. ఇందులో 2 రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్ జరిగింది.

గత 4 దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. అక్కడ 58.58 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కశ్మీర్ లోయలో 51.05 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.

పోలీసులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంలో ముమ్మర తనిఖీల ద్వారా ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు సీఈసీ తెలిపింది. 2019లో రూ.3,500 కోట్లు స్వాధీనం చేసుకోగా.. ఈసారి రూ.10 వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు అడ్డుకున్నట్లు పేర్కొంది.

ఈ ఎన్నికల్లో సీ - విజిల్ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయని.. వీటిల్లో 99.9 శాతం ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపింది. డీప్ ఫేక్ వీడియోలు నిలువరించామని.. 87.5 శాతం ఫిర్యాదులకు 100 నిమిషాల లోపే పరిష్కారం చూపించినట్లు వెల్లడించింది.

అటు, మరికొద్ది గంటల్లో వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జూన్ 4న (మంగళవారం) కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు
Embed widget