Donald Trump Tariff on India: భారత్-అమెరికా ట్రేడ్ డీల్: ఎంత టారిఫ్ విధించబోతున్నారో తెలిపిన డొనాల్డ్ ట్రంప్
US Tariff on India | భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత్ మీద ఎంత టారిఫ్ విధించే అవకాశం ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

India US Trade Deal from August 1: అమెరికా ప్రభుత్వం విధిస్తున్న కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి పలు దేశాల్లో అమల్లోకి రానున్నాయి. ఇంకా భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదు. డెడ్ లైన్ దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారతదేశంపై ఎంత శాతం సుంకం విధించబోతున్నారో తన మనసులో మాటల్లో చెప్పారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తమకు మిత్రదేశమని పేర్కొన్నారు. తమ సూచన మేరకు భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించుకున్నాయని మరోసారి ప్రస్తావించారు. భారత్ -అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. భారతదేశంపై అమెరికా 20-25 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా నుంచి ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్న భారత్
ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్ లో జరిగిన మీడియా సమావేశంలో డొనాాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారత్ తమకు మిత్రదేశం అని, ఇతర దేశాలలాగే వారిపై సైతం టారిఫ్ విధిస్తాం అన్నారు. అమెరికా భారతదేశంపై 20 నుంచి 25 శాతం వరకు సుంకాలు విధించనుందని స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా నుండి భారత్ ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాను పదవిలో ఉన్నంత కాలం టారిఫ్ కొనసాగుతాయని ట్రంప్ అన్నారు. ఇప్పటివరకు అమెరికా విధించనున్న సుంకాలకు సంబంధించి భారతదేశానికి అధికారికంగా ఎలాంటి లేఖ రాలేదని అధికారులు తెలిపారు.
అమెరికాకు భారత్ గుడ్ ఫ్రెండ్.. కానీ
"భారత్ అమెరికాకు మంచి మిత్రుడు, కానీ గత కొన్నేళ్లుగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మా మీద ఎక్కువ సుంకాలు విధించింది. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. నా నిర్ణయాలు అమెరికాకు చాలా ప్రయోజనాలు చేకూర్చుతాయి" అన్నారు. భారతదేశం నుండి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై ఏప్రిల్ 22న ట్రంప్ 26 శాతం సుంకం విధించారు. తరువాత కొంతకాలం పాటు నిషేధం విధించారు.
When asked if India is going to pay high tariffs, between 20-25%, US President Donald Trump says, "Yeah, I think so. India is my friend. They ended the war with Pakistan at my request...The deal with India is not finalised. India has been a good friend, but India has charged… pic.twitter.com/ioyIaDS8Xo
— ANI (@ANI) July 29, 2025
వాణిజ్య ఒప్పందంపై భారతదేశం వైఖరి ఏమిటి?
కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఇటీవల మాట్లాడుతూ.. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అంతా బాగుంది. భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చలు జరుపుతోంది. ఇదే ఆత్మవిశ్వాసం మనల్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ప్రోత్సహిస్తుంది" అని అన్నారు. గత వారం ప్రధానమంత్రి మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ సైతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
#WATCH | When asked if India is going to pay high tariffs, between 20-25%, US President Donald Trump says, "Yeah, I think so. India is my friend. They ended the war with Pakistan at my request...The deal with India is not finalised. India has been a good friend, but India has… pic.twitter.com/IYxParZqce
— ANI (@ANI) July 29, 2025






















