అన్వేషించండి

Pahalgam Attack Reasons: ఈ మూడు కారణాల వల్లే టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ పహల్గాంలో దాడులకు తెగబడిందా...?

Pahalgam Terror Attack | పహల్గాం ఉగ్రదాడిలో  26 మంది చనిపోయారు. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇందుకు బాధ్యులుగా రెసిస్టెన్స్ ఫ్రంట్  ప్రకటించుకుంది.

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.  ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇందుకు బాధ్యులుగా లష్కరే  తోయిబా కు అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్  ప్రకటించుకుంది. కాశ్మీర్ అంశమే ఈ దాడులకు కారణం అయినా ఈ సమయంలో దాడి వెనక ఉన్న మూడు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన వేళ...

కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా ఆకర్షింపజేసే ఉద్దేశంతోనే తరుచూ ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు దిగుతుంటారు.  370 ఆర్ఠికల్ రద్దు తర్వాత ఏర్పడిన ఈ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఇవాళ తన పంజా విసిరింది. అయితే  అది అదను చూసి అమెరికా ఉపాధ్యక్షుడు  జేడీ వాన్స్  మన దేశంలో పర్యటిస్తున్న తరుణంలో  అతి కిరాతంగా  టూరిస్టులను పొట్టనబెట్టుకుంది.  తద్వారా   అమెరికాతో పాటు అంతర్జాతీయంగా  ఆయా దేశాల్లో కాశ్మీర్  అంశాన్ని సజీవంగా చర్చలో ఉంచే ఉద్దేశం కనబడుతుంది. దీనిపై  ఇప్పుడు  మన దేశ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో పాటు అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,  యూకే దేశాలు,  పాకిస్థాన్, చైనా , టర్కీ , కెనడా వంటి దేశాలు , ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కాశ్మీర్ పై స్పందించాలని, ఇది అంతర్జాతీయ సమస్యగా చర్చించాలన్న కారణంతో తరుచూ ఉగ్ర  సంస్థలు ఇలాంటి కిరాతక ఘటనలకు పాల్పడుతుంటాయని అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతుంటారు.  పహల్గాం ఘటన కూడా ఇదే తరహాలో జరిగి ఉంటుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

2.  ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా..

 ఇక ఉగ్రదాడికి ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు ఏం సంబంధం అని అనుకోవచ్చు. కాని  పాకిస్థాన్, సౌదీల మధ్య ఇటీవలి కాలంలో శత్రుత్వం పెరిగిందనే చెప్పాలి.  రెండు దేశాలు ముస్లిం దేశాలు అయినా విదేశాంగ విధానం, వాణిజ్య పరమైన ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ కు అనుకూలంగా పాకిస్థాన్ వ్యవహరించడం సౌదీకి  నచ్చలేదు. సౌదీ అరేబియా - ఇరాన్ ల మధ్య పెద్ద ఎత్తున విబేధాలున్నాయి.  ఈ పరిస్థితుల్లో ఇరాన్ తో సంబంధాలు పాక్ పెంచుకోవడం  వల్ల  సౌదీ అరెబియా - పాక్ ల మధ్య  దూరం పెరిగింది.  ఇక  370 ఆర్ఠికల్ ను మన దేశం రద్దు చేసినపుడు దీనిపై   మద్ధతు ఇవ్వాలని సౌదీ నేతృత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్  ను పాక్ కోరింది. కాని సౌదీ అరేబియా మాత్రం కాశ్మీర్ అంశంపై  భారత్ ను  బహిరంగంగా తప్పుబట్టేందుకు ఇష్టపడలేదు. దీంతో పాక్  ఈ విషయమై సౌదీ పై గుర్రుగా ఉంది.  దీంతో పాటు ఇటీవలి కాలంలో సౌదీ  అరెబియా ఇండియాతో  వాణిజ్య సంబంధాలతో పాటు   ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు  ఏర్పరుచుకోవడం పాక్ కు సుతారం ఇష్టం లేదు. ఈ కారణాలు కూడా టీఆర్ఎస్ తో దాడి చేయించేందుకు పాక్ కు  ఓ ప్రేరణ కావచ్చని భద్రతా నిపుణులు చెబుతున్నారు. 

 3. పర్యాటకులను భయభ్రాంతులకు గురి చేసేందుకేనా...?

 ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో చాలా మార్పులు వచ్చాయి.  అక్కడ భూములను కొనుగోలు చేసే హక్కు అందరికి లభించింది.  అప్పటకి వరకు ఉన్ కాశ్మీర్ ప్రత్యేక చట్టాలు రద్దు అయి, భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది.  అంతే కాకుండా ఏ రాష్ట్రంలో వ్యక్తి అయినా  అక్కడి ఉద్యోగాలకు  దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా పర్యాటక రంగం కూడా  అభివృద్ది చెందింది. కాశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాలివుడ్ తో  పాటు  ఇతర భాషా చిత్రాల చిత్రీకరణ పెరిగింది.   ఓ మాటలో చెప్పాలంటే  370 ఆర్ఠికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో పరిస్థితి బాగుందన్న ప్రచారం బాగా సాగుతోంది. ఇది ముష్కర ఉగ్ర సంస్థలకు నచ్చడం లేదు.  కాశ్నీర్ తమది అని  భావిస్తోన్న ఈ  ఉగ్ర మూక  ఓ రకమైన భయబ్రాంతులు కలిగించే చర్యకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.  కాశ్మీరేతరులు వ్యాపారం  లేదా  పరిశ్రమలు స్థాపించకుండా, అక్కడి భూములను కొనుగోలు చేయకుండా, అక్కడి ఉద్యోగాలకు పోటీగా రాకుండా ఉండేలా పహల్గాం దాడి జరిగి ఉండవచ్చన్న చర్చ సాగుతోంది.  గతంలో ఉగ్రవాదుల దుశ్చర్యల వల్ల దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కాశ్మీర్ లోయకు రావడానికి జంకేవారు.  370 ఆర్టికల్ రద్దు తర్వాత పర్యాటకుల సంఖ్య పెరిగింది. వారికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాయి.  ఈ కారణంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని హింసకు దిగితే  దేశీయంగా, అంతర్జాతీయంగా ఓ ఉలికిపాటు కలిగించవచ్చన్నది టీఆర్ఎఫ్ నేతలు, పాక్  సైనిక నాయకత్వ దుష్టబుద్దిగా  అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతున్నారు.

 

 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ బీజేపీకి తెలుగు బీజేపీ నేతల సపోర్టు - విస్తృతంగా ప్రచార బాద్యతలు
కేరళ బీజేపీకి తెలుగు బీజేపీ నేతల సపోర్టు - విస్తృతంగా ప్రచార బాద్యతలు
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట విజయ్ వర్సెస్ రజనీకాంత్ - ఘాటు లేఖ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ !
తమిళనాట విజయ్ వర్సెస్ రజనీకాంత్ - ఘాటు లేఖ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ !
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Embed widget