అన్వేషించండి

Piyush Goyal Privilege Notice : కేంద్ర మంత్రికి ప్రివిలేజ్ నోటీస్, సభను తప్పుదోవ పట్టించారని టీఆర్ఎస్ ఆరోపణ

Piyush Goyal : ధాన్యం సేకరణపై కేంద్రం, రాష్ట్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై టీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు.

Piyush Goyal Privilege Notice : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రం వార్ జరుగుతోంది. సీఎం కేసీఆర్ తో సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్రం తీరుపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంపై పోరు ఆగదని స్పష్టం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని నిరసనలు చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసినట్లే తెలంగాణలోనూ ధాన్యం సేకరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర మంత్రి అన్నారు.  

కేంద్ర మంత్రికి ప్రివిలేజ్ నోటీసు

కేంద్ర మంత్రి సభలో అవాస్తవాలు చెప్పారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని ఎంపీలు పేర్కొన్నారు. డబ్ల్యూటీవో నియమావళి నేపథ్యంలో
పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని ఎంపీలు పేర్కొన్నారు. ప్రివిలేజ్ నోటీసును టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేత లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు.  

కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

ధాన్యం సేకరణపై ఇటీవల కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్‌ రైస్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందన్నారు. ఎంవోయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని కేంద్రం మంత్రి ఆరోపించారు.  శుక్రవారం రాజ్యస‌భలో ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో  ధాన్యం సేకరణపై సమాధానమిస్తూ పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ కొత్తగా ధాన్యం సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి సీఎం దమ్కీలు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పీయూష్ గోయల్ పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్‌ తరహాలో కొనాలని తెలంగాణ సీఎం లేఖ రాశారని, పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారన్నారు. పంజాబ్ లో పండేటటువంటి బియ్యాన్ని ఇవ్వాలన్నారు. రైతులను తప్పుదోవపట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో పండిన రా రైస్‌ మొత్తం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
IMD: దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Thota Trimurtulu : తోట త్రిమూర్తులు జైలు శిక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ - పోటీ చేయడానికి అర్హత ఉంటుందా ?
తోట త్రిమూర్తులు జైలు శిక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ - పోటీ చేయడానికి అర్హత ఉంటుందా ?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Embed widget