అన్వేషించండి

Delhi Floods: దిల్లీలో వర్ష బీభత్సం, పొంచి ఉన్న యమున వరద ముప్పు - అలర్ట్ గా ఉన్నామన్న సీఎం కేజ్రీవాల్

Delhi Floods: దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. యమున నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా వరద ముప్పు పొంచి ఉంది.

Delhi Floods: దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లో సోమ, మంగళ వారాలు రెండు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలో వరద ప్రమాదం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే కుండపోత వానలతో అల్లాడుతున్న దేశ రాజధానికి యమునా నది రూపంలో మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే దిల్లీలో కురుస్తున్న వానలకు ఎక్కడికక్కడే వాన నీరు నిలిచిపోయింది. వీటికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద తోడవనుంది. హర్యానాలో భారీగా కురుస్తున్న వర్షాలతో హత్నికుండ్ బ్యారేజీ గేట్లను ఎత్తివేసింది. ఈ నీరు దిల్లీని తాకనుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు యమునా నది ప్రమాదక స్థాయికి మించి ప్రవహించనుంది. ఇప్పటికే కుండపోత వర్షాలతో ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రస్తుతం 203.18 మీటర్ల మేర వరద ప్రవహిస్తున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. బ్రిడ్జి వద్ద వరద ప్రమాద స్థాయి 204.5 మీటర్లు కాగా.. హర్యానా నుంచి వచ్చే నీటితో ఇది 205.5 మీటర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. 

దిల్లీ వర్షాల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. యమునా నదికి వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యమునా నది ప్రవాహం 206 మీటర్ల మార్కును దాటగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. అయితే దిల్లీకి వరద పరిస్థితి తలెత్తదని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read: Student Accommodation: హలో స్టూడెంట్స్! హాస్టల్‌లో జాయిన్ అవబోతున్నారా? వీటి గురించి తప్పక తెలుసుకోండి

అధికారులతో సమీక్ష తర్వాత కేజ్రీవాల్ ఏమన్నారంటే..

యమునా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ తో చర్చించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీకి వరద పరిస్థితులు తలెత్తవని అంచనాలు చెబుతున్నట్లు వెల్లడించారు. యమునా నది 206 మీటర్ల మార్కును దాటిన తర్వాత వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. దిల్లీలో జరిగిన మూడు రోడ్ కేవ్-ఇన్ ఘటనలపై విచారణకు ఆదేశించారు. ఒకరిపై ఒకరు వేలెత్తి చూపుకునేందుకు ఇది సమయం కాదని, అన్ని ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కలిసి పని చేయాలని కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్లపై ఉన్న గుంతలను రాళ్లతో పూడ్చాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించాలని ఎన్డీఎంసీని కోరారు. 

41 ఏళ్లలో గరిష్ఠ స్థాయిలో వర్షపాతం

దేశ రాజధానిలో 41 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దిల్లీలో ఒకేరోజు 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం 1982 తర్వా ఇదే తొలిసారి అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దిల్లీలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Waqf (Amendment) Bill 2025 Passed in the Lok Sabha | పంతం నెగ్గించుకున్న NDA | ABP DesamRCB vs GT Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 8వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamSunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Telangana High Court: కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
IPL 2025 GT VS RCB Result Update: బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
Embed widget