అన్వేషించండి

Delhi Air Quality: మరింతగా దిగజారిన ఢిల్లీ గాలి నాణ్యత, 231 AQIగా నమోదు

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారింది. ఏక్యూఐ 231గా నమోదైంది.

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 231గా నమోదైంది. శనివారం ఉదయం 9 గంటలకు ఏక్యూఐ 231 వద్ద ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కారు చర్యలు ప్రారంభించిన మరుసటి రోజే.. ఢిల్లీ గాలి నాణ్యత పూర్ స్థాయికి పడిపోయింది. ఏక్యూఐ 0-50 వరకు ఉంటే ఉత్తమంగా చూస్తారు. ఏక్యూఐ 51-100 ఉంటే సంతృప్తికరం, ఏక్యూఐ 101-200 ఉంటే మోడరేట్, ఏక్యూఐ 201-300 ఉంటే పూర్, ఏక్యూఐ 301-400 ఉంటే వెరీ పూర్, 401-500 ఉంటే తీవ్రంగా పరిగణిస్తారు.

రాజధానిలో గాలి నాణ్యత పేలవంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ చర్యలు ప్రారంభించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు వాడకాన్ని నిషేధించాలని, కాలుష్య పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించాలని జాతీయ రాజధాని ప్రాంతంలోని స్థానిక అధికారులను ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ ఆదేశించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP) అనే కాలుష్య నియంత్రణ ప్రణాళికలో భాగంగా ఉన్న చర్యలు చేపట్టింది.

GRAP 1వ దశను ప్రారంభిస్తూ.. కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఈ ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించడాన్ని నిరోధించడానికి కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చింది. దేశ రాజధాని పరిధిలో గాలి నాణ్యత మరింతగా క్షీణించకుండా ఉండేందుకు రాజధాని పరిధిలో GRAP మొదటి దశను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

GRAP చేపట్టే చర్యలను నాలుగు దశలుగా వర్గీకరించారు. స్టేజ్-1 పూర్ (ఏక్యూఐ 201-300), స్టేజ్-2 వెరీ పూర్ (ఏక్యూఐ 301-400), స్టేజ్-3 తీవ్రం (ఏక్యూఐ 401-450), స్టేజ్-4 సివియర్ ప్లస్ (ఏక్యూఐ >450).

అయితే పంజాబ్ లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రారంభించాక ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడాన్ని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఏక్యూఐ స్థాయిలను 6 ప్రదేశాల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) కొలుస్తుంది. అక్టోబర్ 6వ తేదీన పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా మొత్తం 91 చోట్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ హార్వెస్టింగ్ సీజన్ లో మొత్తంగా 845 కేసులు వెలుగుచూశాయని అధికారులు తెలిపారు. గత ఆరు రోజుల్లోనే అమృత్‌సర్‌ జిల్లాలో 345 కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 6వ తేదీన అమృత్‌సర్‌లో 41, తర్న్ తరణ్ లో 15, పాటియాలా 10, సంగ్రూర్ లో 6 ప్రాంతాల్లో పంట వ్యర్థాలను కాల్చిన ఘటనలు నమోదయ్యాయి. 

అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ

వాయు కాలుష్యంలో భారత్‌లో ఢిల్లీనే అత్యంత కాలుష్య నగరంగా ఉంది. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మధ్య కాలంలో వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే ఢిల్లీలోనే అత్యంత ఎక్కువ కాలుష్యం నమోదైనట్లు పరిశోధనల ఆధారంగా వైల్లడైంది. రెండవ అత్యంత కాలుష్య నగరంగా పట్నా ఉంది. ఆ తర్వాత ముజఫరాబాద్‌, ఫరీదాబాద్‌, నోయిడా, ఘజియాబాద్‌, మీరట్‌, నల్బారి, అసన్‌సోల్‌, గ్వాలియర్ వరుస స్థానాల్లో ఉన్నాయి. రెస్పిరర్‌ లివింగ్‌ సైన్స్‌ నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. వీరు సెన్సార్‌ ఆధారిత నెట్‌వర్క్‌ సహాయంతో గాలి నాణ్యత, వాతావరణ పరిస్థితులు సహా పలు అంశాలను దృష్టిలోకి తీసుకుని పరిశోధన చేపట్టారు. 

భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి కలిగిన నగరంగా మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్‌ నిలిచింది. అక్కడ PM2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 11 మైక్రోగ్రాములు మాత్రమే ఉంది. దీంతో అక్కడ గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంది. ఐజ్వాల్‌ తర్వాత కర్ణాటకలోని చిక్‌మంగుళూరు, హర్యానాలోని మండిఖేరా, కర్ణాటకలోని చామరాజనగర్‌, మడికేరి, విజయపుర, రాయచూర్‌, శివమొగ్గ, గడగ్‌, మైసూర్‌ నగరాలు ఉన్నాయి. కర్ణాటకలోని ఎనిమిది నగరాల్లో స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు వెల్లడైంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget