అన్వేషించండి

రాజ్యాంగ పదవులను గౌరవించండి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వరుస పర్యటనలు చేస్తున్నారు. తరచూ రాజస్థాన్‌ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారంటూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌, ధన్కర్ ను ప్రశ్నించారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వరుస పర్యటనలు చేస్తున్నారు. తరచూ రాజస్థాన్‌ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారంటూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌, ధన్కర్ ను ప్రశ్నించారు. లక్ష్మణ్‌గఢ్‌లోని మోడీ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రసంగించారు. రాజ్యాంగ పదవులను గౌరవించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కు సూచించారు. 

జ్యాంగ పదవుల పట్ల గౌరవం ఉండాలి
తనను మళ్లీ మళ్లీ ఎందుకు రాష్ట్రానికి వస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని, అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ పదవులపై  వ్యాఖ్యానిస్తారని అనుకోలేదన్నారు. రాజ్యాంగ పదవుల పట్ల గౌరవం ఉండాలన్న ధన్కర్, మనందరం కలిసికట్టుగా, చేయిచేయి కలిపి ఏకాభిప్రాయంతో విధానాలు రూపొందించి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పదవుల్లో ఉన్నా దేశానికి సేవకులమని, ఇది మన దేశమన్నారు ఉపరాష్ట్రపతి ధన్కర్. రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు ఇది అందరికీ వర్తిస్తుందని వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి రానివ్వకూడదన్న ధన్కర్, కాస్త సున్నితత్వం ప్రదర్శించాలని సూచించారు. 

ఢిల్లీ-రాజస్థాన్ కు అప్ డౌన్ చేస్తున్నారన్న గెహ్లట్
 ఉప రాష్ట్రపతి ఢిల్లీకి, రాజస్థాన్‌కు అప్‌ అండ్‌ డౌన్ చేస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ అయినా, రాష్ట్రపతి అయినా తాము గౌరవిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇలా వరుస పర్యటనలు చేయడం సరికాదని సూచించారు. రాజకీయ నాయకులు రావొచ్చని, ఉప రాష్ట్రపతిని పంపించొద్దంటూ బీజేపీని ఉద్దేశించి చురకలు అంటించారు. అది రాజ్యాంగ పదవన్న ఆయన, తమకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులపై గౌరవం ఉందని తెలిపారు. ఉప రాష్ట్రపతి వచ్చి ఐదు జిల్లాల్లో పర్యటించడంలో, ఏమైనా లాజిక్‌ ఉందా ? ఇది ఎన్నికల సమయం అని గుర్తు చేశారు. 

రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థానానికి...
1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామంలో జగ్‌దీప్‌ జన్మించారు. గోఖల్‌ చంద్‌, కేసరి దేవి తల్లిదండ్రులు. ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌ సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. రాజస్థాన్‌ ఝుంఝునూ జిల్లాకు చెందిన ఈయన గ్రామస్థాయి పాఠశాలలో, తర్వాత సైనిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో డిగ్రీచేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్న తర్వాత రాజస్థాన్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. అత్యంత తక్కువ సమయంలోనే రాజస్థాన్‌ హైకోర్టులో బలమైన న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన ధన్కర్

1989లో తొలిసారి ఝున్‌ఝునూ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 1990-1991 మధ్య స్వల్పకాలం పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 93-98 మధ్య రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా పని చేశారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2019లో అనూహ్యంగా కేంద్రం ఆయన్ని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా నియమించింది. మమతా బెనర్జీకి అనేక విషయాల్లో చికాకు తెప్పించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget